Monday, July 13, 2015

మనలో చాలా మందికి చదవుకుంటున్నప్పుడు నిద్ర వస్తుంది ఎందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: మనలో చాలా మందికి చదవుకుంటున్నప్పుడు నిద్ర వస్తుంది ఎందుకు?

జవాబు: చదివేటప్పుడు నిద్ర రావడమనేది మనం ఏ భంగిమలో ఉన్నాం, ఎంతసేపు ఉన్నాం అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది. చదివేటపుడు మన శరీర కదలికలు తక్కువగా ఉండటం వల్ల కండరాలకు ప్రవహించే రక్త ప్రసరణ తగ్గుతుంది. దాని వల్ల శరీరంలోని జీవకణాల్లో దహనచర్య మందగించి, లాక్టిక్‌ యాసిడ్‌ అనే ఆమ్లం తయారవుతుంది. ఈ ఆమ్లం ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను అతిగా పీల్చుకొంటుంది. దాంతో శరీరంలోని రక్తానికి కావలసిన ఆక్సిజన్‌లో కొంత తగ్గుతుంది. ఆక్సిజన్‌ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల మగతగా, నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే చదివేటప్పుడు ఒకే భంగిమలో ఉండి పోకుండా అపుడపుడూ అటూ ఇటూ కదలడం, ఏకబిగిన చదవకుండా మధ్యలో కాస్త విరామం ఇవ్వడం అవసరం.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Sunday, July 12, 2015

విమానాలు ఆకాశంలో ఎగురుతున్నపుడు వాటి మీద పిడుగులు పడవా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: విమానాలు ఆకాశంలో ఎగురుతున్నపుడు వాటి మీద పిడుగులు పడవా?


జవాబు: విమానాలు గాలిలో ఎగురుతున్నపుడుగానీ నేలమీద ఉన్నపుడుగానీ వాటిని పిడుగులు సాధారణంగా ఏమీచేయలేవు.
పిడుగు అంటే ఏమిటో తెలుసుకుంటే ఈ విషయం బోధపడుతుంది. మేఘాల రాపిడితో ఉద్భవించిన అత్యధిక స్థిర విద్యుత్తు నేలవైపునకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే నేలకు, విద్యుదావేశితాలయిన మేఘాలకు మధ్య వేల వోల్టుల మోతాదులో శక్మ భేదం (Potential difference) ఉంటుంది. రెండు బిందువుల మధ్య శక్మ భేదం ఉన్నట్లయితే విద్యుదావేశం అతి తక్కువ నిరోధం ఉన్న మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఆ విద్యుద్గమనం ఉష్ణ రూపంలో బయటపడుతుంది. అదే ప్రమాదాన్ని కలిగించే సంఘటన. కానీ విమానం కిందున్నపుడు విద్యుత్ప్రవాహాన్ని నిరోధించే రబ్బరు టైర్లు ఉంటాయి. మేఘాల్లో ఉన్నపుడు దాని ద్వారా భూమిని చేరే మార్గం మేఘాల్లోని విద్యుత్తుకు లేదు. అసలు విషయం మరోటి ఉంది. విమానం పైకి లేచిన కొన్ని నిముషాల్లోనే అది మేఘాల్ని దాటి పైకి వెళ్లి ప్రయానిస్తుంది. మెరుపులు ఉరుములు, పిడుగులు తన కింద ఎక్కడో సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి పిడుగు ప్రభావం విమానం పైన ఉండదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

తుపాను వచ్చేముందు కీటకాలకు తెలిసిపోతుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...









ప్రశ్న: ఉరుములతో కూడిన 'తుపాను' వచ్చే ముందు కొన్ని పురుగులు, కీటకాలు నేలకు దగ్గరగా ఎగురుతూ ఉంటాయి. ఎందుకు?

జవాబు: మామూలుగా దోమల వంటి చిన్న కీటకాలు గాలిలో ఎగురుతూ, తిరుగుతుంటాయి. వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్నపుడు, గాలి బరువుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎగిరే కీటకాలకు వాతావరణంలోని పై పొరలలోకి ప్రవేశించి ఎగరగలిగే ప్రేరణ లభిస్తుంది. కానీ తుపాను రావడానికి ముందు వాతావరణ పీడనం తగ్గిపోవడంతో ఎక్కువ ఎత్తులో ఎగిరే కీటకాలు భూమికి దగ్గరగా కింది తలాలకు పడిపోతాయి. ఆ పరిస్థితుల్లో అవి తమ రెక్కల సాయంతో కాకుండా తుపాను ముందు వీచే నులివెచ్చని గాలితోపాటు ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరే కీటకాలను తుపాను పురుగులు అంటారు. ఇలా ఎగిరే కీటకాలు ప్రపంచం మొత్తం మీద 5,000 రకాలు ఉన్నాయి. నేలకు దగ్గరగా ఎగిరే ఈ కీటకాలు తుపాను రాకను ముందుగా తెలియజేసి మనకు కొంత వరకు మేలు చేస్తాయి. కానీ అవి ఏపుగా ఎదిగిన మొక్కల ఆకులకు రంధ్రాలు చేసి ఆ మొక్కల్లోని జీవరసాన్ని ఆహారంగా పీల్చి వేయడంతో పూలు, కులు త్వరగా నశిస్తాయి. అలా ఈ కీటకాలు ప్రకృతికి హాని కలగజేస్తాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌

  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

ఎర్రచందనం, గంధం ఒకటేనా? వాటి ఉపయోగాలేమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...








ప్రశ్న: ఎర్రచందనం, గంధం ఒకటేనా? వాటి ఉపయోగాలేమిటి?

జవాబు: ఎర్రచందనం, గంధపు వృక్షం రెండూ సుగంధ ద్రవ్య వృక్షాలే అయినా వృక్ష శాస్త్ర పరంగా రెండూ ఒకే జాతికి చెందినవి కావు. ఎర్ర చందనానికి వాసన కన్నా రంగు ఎక్కువ. దీనిని వృక్ష శాస్త్రంలో టెరో కార్పస్‌ శాంటాలినస్‌ అంటారు. ఎర్రచందనపు వృక్షం మధ్య భాగం ఖరీదు ఘనపుటడుగు దాదాపు రూ. లక్ష వరకు ఉంటుంది. చాలా దృఢంగా, ముదురు ఎరుపు రంగులో ఉండడం వల్ల ఈ కలపను ఖరీదైన నిర్మాణాల్లోనూ, చైనా వాళ్లు తినడానికి వాడే పుల్లల తయారీలోనూ, ఎర్రని పౌడర్‌ తయారీలోనూ ఎర్రచందనాన్ని వాడుతున్నారు. ఒక్కో చెట్టు విలువ సుమారు కోట్లలో ఉండడం వల్ల ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు గురవుతున్నట్టు తరచూ వార్తల్లో వింటూ ఉంటాం. గంధపు చెట్టును శాస్త్రీయంగా శాంటాలమ్‌ పెనిక్యూలాటం అంటారు. ఇవి ఎర్ర చందనం లాగా దృఢంగా ఉండవు. గరుగ్గా ఉన్న బండమీద నీరు పోసి రాస్తే పసుపు రంగులో ఉన్న గంధపు లేపనం లభిస్తుంది. ఈ చెట్టు నుంచి తీసిన నూనెను ప్రధానంగా సుగంధ ద్రవ్యాలలోనూ సబ్బుల తయారీలోనూ వాడతారు. గంధపు చెట్టు కలపను నిర్మాణాల్లో వాడరు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,--జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ==========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Saturday, July 11, 2015

మోటారు వాహనాలను పెట్రోల్‌కు బదులు గాలితో నడపడానికి వీలుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...








ప్రశ్న: మోటారు వాహనాలను పెట్రోల్‌కు బదులు గాలితో నడపడానికి వీలుందా?

జవాబు: రోజు రోజుకూ పెట్రోల్‌ ధర పెరిగిపోతున్న కారణంగా ప్రపంచ దేశాల్లోని శాస్త్రజ్ఞులు ప్రత్యామ్నాయ ఇంధనాల అన్వేషణలో తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాసలోని భాగమే బాగా ఒత్తిడికి గురి చేసిన గాలి లేక ఇతర వాయువులను (వీటిని సంపీడన వాయువులు అంటారు) మోటారు వాహనాలను నడపడానికి ఉపయోగించవచ్చా అనే దిశలో ప్రస్తుతం చేస్తున్న ప్రయోగాలు. ఒత్తిడిలో ఉన్న వాయువును వ్యాకోచింపజేస్తే ఉత్పన్నమయే బలం మోటారు వాహన ఇంజన్‌ పిస్టన్‌ను నడపడానికి ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో నడిచే వాహనం శబ్ద కాలుష్యం లేకుండా నిశ్శబ్దంగా నడవడమే కాకుండా, కార్బన్‌, పొగలాంటి కాలుష్యాలు వెదజల్లదు.

గాలి (వాయువు) సాయంతో నడిచే ఈ 'ఎయిర్‌ కారు'లో అత్యధిక ఒత్తిడికి గురిచేసిన గాలితో నింపిన గాలి సీసాలు ఉంటాయి. ఈ కారు గంటకు 100 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో పయనించేటట్టు డిజైన్‌ చేస్తారు. ఒత్తిడిగల గాలితో టాంకులు నింపడానికి పెట్రోలు టాంకులలా కాకుండా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. పెట్రోల్‌ ప్రమేయం లేకుండా మోటారు వాహనాలను నడిపే మరో ప్రాజెక్టులో నైట్రోజన్‌ను ఇంధనంగా వాడతారు. ఈ వాయువులో 78 శాతం గాలి మైనస్‌ 196 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వాయురూపంలో ఉండి, వేడి చేసినపుడు 700 రెట్లు వ్యాకోచిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఇంధన స్టేషన్లు దేశదేశాల్లో వెలిసే అవకాశం ఉంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Friday, July 10, 2015

చల్లదనము సృష్టించడము ఎందుకంత కష్టము ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్ర : చల్లదనము సృష్టించడము ఎందుకంత కష్టము ?

జ: చలిగా ఉంటే అరచేతులు రాచుకుని ముఖము మీద పెట్టుకుంటే వేడిగా తగులుతుంది. కాని వేసవిలో చల్లదనము సృష్టించే మార్గం మన  దగ్గరలేదు. ఫ్రిజ్, ఎయిర్ కండిషనర్ వంటి ఖరీదుతో కూడుకున్నవే చల్లదనానికి వాడేవి . వాయువులో అటు ఇటు అణువులు గందరగోళం గా తిరుగుతుంటాయి . వాటి వేగము తగ్గించి వస్తువును చల్లపరచాలంటే చాలా శక్తి అవసరము . అటువంటి శక్తిని  మనము చేతితో సృష్టించలేము.యాంత్రికము గా మాత్రమే సాధ్యము. అందుకే వస్తువులను సులభముగా వేడిచేయగలము గాని అంతే త్వరగా తక్కువ శక్తితో చల్లబరచలేము .


  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Saturday, July 04, 2015

What is Mirage-ఎండమావి అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ఎండమావి (ఎండమావులు) (ఆంగ్లం Mirage) అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఒక కాంతి ధర్మం. కాంతి కిరణాలు వంగి ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదలాడుతున్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే నీరున్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావమే.
ఎండ సమయంలో తారు రోడ్డు మీద మనం నిలబడినపుడు కొంత దూరంలో రోడ్డు మీద నీటి మడుగు ఉన్నట్టు కన్పిస్తుంది. కాని అక్కడ నీరు ఉండదు ఈ విధంగా భ్రమ కలిగించే మాయా నీటి మావులను ఎండమావులు అంటారు. కాంతి కిరణాలు ఒక వస్తువు లోపల సంపూర్ణంగా పరావర్తనం చెందడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. తారు రోడ్డు మీద నీరు ఉన్నట్టుగా భ్రమ పడడానికి కూడా కారణం సంపూర్ణాంతర పరావర్తనం. ఇది వాతావరనము లోని ఉష్ణోగ్రత ప్రభాన ఏర్పడతాయి. ఉష్ణోగ్రత పెరిగినపుడు భూమిని అంటిపెట్టుకుని ఉన్న గాలి వేడెక్కి పలుచబడి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కాని పైన వున్న గాలి చల్లదనము  వేడిగాలిని పైకి వెళ్ళనివ్వనందున ఈ వేడిగాలి  పక్కకు చేసే ప్రయాణం అలలా ఉండి నీటిప్రవాహాన్ని తలపిస్తుంది... అదే ఎండమావి.


Wednesday, July 01, 2015

పాండవులకు ద్రౌపది కాకుండా వేరే భార్యలున్నారా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్ర : పాండవులకు ద్రౌపది కాకుండా వేరే భార్యలున్నారా? ఉంటే వారి పేర్లేమిటి?

జ : పాండవులకు ద్రౌపది కాకుండా వేరే భార్యలున్నారు .
ధర్మరాజు కి : దేవిక , పౌరవతి.
భీమునుకి : జలంధర , కాళి , హిడింబ .
అర్జునుకి : సుభద్ర , ఉలూచి , చిత్రాంగద , పమీల .
నకులునికి : కరేణుమతి, (కరుణుక ).
సహదేవునికి : విజయ . ........................ అనే భార్యలు ఉన్నారు.

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Thursday, June 25, 2015

స్కూటర్‌ లాంటి ద్విచక్ర వాహనాలలో పెట్రోల్‌తో ఆయిల్‌ ను కలిపి పోస్తారెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: స్కూటర్‌ లాంటి ద్విచక్ర వాహనాలలో పెట్రోల్‌తో ఆయిల్‌ ను కలిపి పోస్తారెందుకు?

జవాబు: స్కూటర్లలో పెట్రోల్‌తో ఆయిల్‌ను కలిపి నింపడానికి కారణం ఆ వాహనంలోని ఇంజన్‌ భాగాల మధ్య రాపిడి లేకుండా కందెన వేయడానికే. ఇంజన్‌లోని రాడ్‌ బేరింగ్స్‌, రిస్ట్‌పిన్స్‌, కామ్స్‌, ఇంజన్‌ సిలెండర్‌ వాల్స్‌ లాంటి భాగాల మధ్య రాపిడి లేకుండా మిషన్‌ భాగాలు అరిగిపోకుండా ఉండడానికే. అంతేకాకుండా ఆయిల్‌, పెట్రోల్‌ కలిపిన మాధ్యమం స్కూటర్‌ ఇంజన్‌లో ఉత్పన్నమయిన వేడిని తగ్గించి ఒక శీతలీకరణ మాధ్యమం లాగా పనిచేస్తుంది.

ఇలా లూబ్రికేషన్‌ చేయడం స్కూటర్‌లాంటి ద్విచక్రవాహనాలకే కాకుండా బస్సు, లారీల్లాంటి నాలుగు చక్రాల వాహనాలకు కూడా ఎంతో అవసరం. ఈ వాహనాలలో ఈ ల్యూబ్రికేషన్‌ వ్యవస్థ ప్రత్యేకంగా ఆయిల్‌ టాంక్‌, ఆయిల్‌పంపు రూపంలో ఉంటుంది. ఈ టాంక్‌లో నింపిన ఆయిల్‌, ఆయిల్‌ పంపు ద్వారా వాహనం వివిధ యంత్ర భాగాలకు సరఫరా అవుతుంది. ల్యూబ్రికేటింగ్‌ వ్యవస్థ వేరే ప్రత్యేకంగా ఉండటం వల్ల ద్విచక్ర వాహనాలలో లాగా ఎక్కువ పొగ వెలువడడం, స్పార్క్‌ ప్లగ్‌పై కార్బన్‌ డిపాజిట్‌ కావడం లాంటి సమస్యలు తలెత్తవు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Wednesday, June 03, 2015

How does wound heal?-గాయం ఎలా మానుతుంది ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్ర : గాయం ఎలా మానుతుంది ?

జ : గాయము తగలనానే దెబ్బతిన్న రక్తనాళాలు కుచించుకుపోయి రక్తస్రావము ను తగ్గింస్తాయి . ఈలోగా రక్తము గడ్డకట్టి గాయం చివరల గట్టిపదేలా చేస్తాయి. తెల్ల రక్తనణాలు వచ్చి గాయం లోకి ప్రవేశించే సూక్ష్మజీవులను నిరోధిస్తాయి  తరువాత  చర్మము లోపలి ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కణాలు గాయము ప్రాంతానికి చేరి కొత్తకణజాలాలను ఉత్పత్తిచేయడం మొదలుపెడతాయి.

చర్మకణాలు విభజనచెంది కొత్త కణాలు ఉత్పత్తిచేసి గాయం పైనంతా వ్యాప్తిచెందడం మొదలుపెడతాయి. అప్పుడు పైభాగాన నల్లగా కట్టిన చెక్కు వంటిది రాలిపడిపోతుంది.

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.-