ప్రశ్న: విమానం నడిపే పైలట్కు దారి ఎలా తెలుస్తుంది?
జవాబు: విమానాన్ని నడిపే పైలట్కు ఎదురుగా టీవీలాంటి తెరలు ఉంటాయి. వాటి మీద భూమి అక్షాంశాలు, రేఖాంశాలు(altitudes and longitudes) ఉంటాయి. వీటి ద్వారా భూమి మీద ఉండే ప్రతి ప్రాంతం ఉనికి తెలుస్తుంది. ఉదాహరణకు మన హైదరాబాద్ అక్షాంశం 17.366 డిగ్రీల ఉత్తరం, రేఖాంశం 78.476 డిగ్రీల తూర్పు. ఇలా ప్రతి పట్టణం, నగరం వివరాలు నిర్దేశితమై ఉంటాయి. ఉపగ్రహపు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) అనే నియంత్రణ ద్వారా విమానాన్ని పైలట్ నడుపుతాడు. ఏవియానిక్స్ అనే కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ద్వారా బయల్దేరిన చోటును, గమ్యాన్ని నిర్దేశిస్తే, అక్కడున్న కంప్యూటరే పైలట్లకు సూచనలు ఇస్తుంది. అలాగే విమానాశ్రయాల్లోని నియంత్రణ కేంద్రాల్లో ఉండే సిబ్బంది ఎప్పటికప్పుడు విమానం ప్రయాణాన్ని కంప్యూటర్ వ్యవస్థ ద్వారా గమనిస్తూ అవసరమైన సూచనలు అందిస్తుంటారు. మైక్రోవేవ్స్ ద్వారా జరిగే ఈ కమ్యూనికేషన్స్కు అవరోధం కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రయాణికులు సెల్ఫోన్లను వాడరాదని చెబుతారు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్,-వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ======================
