ప్రశ్న: అంతరిక్షంలోకి రాకెట్లను పంపేప్పుడు ఇంజను భాగాలు ఒకటొకటిగా విడిపోయి సముద్రంలోకి పడిపోతాయి కదా? మరి సముద్ర జీవులకు అపాయం కలుగదా?
జవాబు: పైకి వెళ్లేప్పుడు రాకెట్టులో ఇంధనాన్ని వివిధ దశల్లో దహనం చేసే ఏర్పాటు ఉంటుంది. సాధారణంగా ఘన ఇంధనాన్ని(solid fuel) వాడే సందర్భంలో ఈ తరహా నిర్మాణాలుంటాయి. ఇవి సాధారణంగా కిందికి పడుతున్నప్పుడు వాతావరణంలోని గాలి రాపిడి వల్ల మండిపోయి బూడిదయిపోతాయి. ఇంకా కొద్దో గొప్పో మిగిలివున్న భాగాలు అతి వేగంగా సముద్రపు నీటిలో పడతాయన్నమాట నిజమే. కానీ సముద్రానికి ఉన్న అమితమైన లోతు వల్ల, లవణీయత వల్ల ఇంజను భాగాలు పడినప్పుడు కలిగే తాడన తీవ్రత(impact) త్వరితంగానే సమసిపోతుంది. అదే ప్రాంతంలో ఆ సమయానికే జలచరాలు ఉండే అవకాశాలు కూడా తక్కువే. కాబట్టి పెద్దగా అపాయం ఉండనట్టే.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ========================