
మనకు ఏది వ్రాయాలన్న మనం ఉపయోగించేది మొదట పెన్ను. కాని మనకు ఆ పెన్ను గురించి వివరాలు ఏమి తెలయవు కనుక ఇప్పుడు ఆ పెన్ను ఎలా పుట్టినదో అసలు ఎవరు కనుగొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇవ్వాళ మనం క్లాస్రూంలో పెన్ను పట్టుకొని టకటకా నోట్స్ రాసుకుంటున్నాంగానీ ఇలా పెన్నును ఈ షేప్లో చూడడం వెనుక బోలెడంత కథ ఉంది. భారతదేశంలో పెన్ను, పేపరు రానంత వరకూ రాతకోతలన్నీ తాటాకుల మీద, ఘంటంతో సాగేవి. ఆ తర్వాత సిరాలో ముంచి రాసే పెన్నులు వచ్చాయి. అయితే నాలుగు పదాలు రాయగానే మళ్ళీ పెన్నును సిరాలో ముంచి రాయాల్సి వచ్చేది. ఈ తలనొప్పిని పరిహరించిన వ్యక్తి పేరు 'లూయిస్ ఇ.వాటర్మెన్'. ఈయన అమెరికన్. ఇన్సూరెన్స్ ఏజెంట్గా పని చేసేవాడు. ఒకసారి పాలసీ తీసుకోవడానికి వచ్చిన పెద్దమనిషి సంతకం చేయడానికి కలంను సిరాలో ముంచగా అది కాస్తా ఒలికి పేపర్లు పాడయ్యాయి. ఇది అపశకునం గా భావించిన ఆ పెద్ద మనిషి పాలసీ చేయకుండానే వెళ్ళి పోయాడు. దాంతో కోపం తెచ్చుకున్న వాటర్మెన్ అసలు సిరాలో ముంచే అవసరం లేకుండా నిబ్ వెనుక ఇంకు రిజర్వాయర్ ఉండేలా పెన్ను తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి 'ఫౌంటెన్ పెన్' ను 1884 లో తయారు చేశాడు. ఇతడిలాగే మరికొందరు కూడా పెన్నులు తయారు చేసినా ప్రపంచానికి ఫౌంటెన్ పెన్ సృష్టికర్తగా పరిచయమైంది వాటర్మెన్ మాత్రమే. పెన్నును జేబులో పెట్టుకునే వీలుగా క్లిప్ను తయారు చేసింది కూడా ఇతడే.
- =====================================