Sunday, September 28, 2014

వజ్యానికి ఆ మెరుపులు కాంతులు ఎలా ఏర్పడ్డాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : వజ్రము బొగ్గు(కార్బన్‌) నుండి పుట్టినదని అంటారు మరి ఆ వజ్రానికి  ఆ మెరుపులు కాంతులు ఎలా ఏర్పడ్డాయి?

జ : అనేక లక్షల సంవత్సరాల క్రితము భూమి చల్లబడినపుడు శిలాద్రవము భూమిలోపలి పొరల్లో వుండిపోయింది అని ... కాలక్రమములో ఉష్ణోగ్రత , ఒత్తిడుల ప్రభావాన కార్బన్‌ పార్టికిల్స్ ఒకదానికొకటి చేరి స్పష్టమైన స్పటికల్లా ఏర్పడి ఉండవచ్చుననని అంటారు . అవే స్పచ్చమైన కార్బన్‌ స్పటికలు . సాధారణ స్థితిలో వాటికి మెరుపులు ఉండవు . దొరికిన వజ్రాన్ని రెండుగా కోసి ... వచ్చిన రండుముక్కలను రెండు గుండ్రని రూపములోకి తెస్తారు. ఆ తర్వాత వజ్రాన్ని సానపడతారు. అలా సానబట్టగా వచ్చినటువంటి వజ్రముఖ కోణాలనుండి కాంతి మిగిలిన పదార్ధాలకన్నా మెరుగా వెలుపలికి పంపుతుంది.. . . కాబట్టి వజ్రము మెరుస్తుంది. 
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...