Thursday, November 19, 2015

మొసళ్ల లైంగికత పొదిగేప్పుడే తెలుస్తుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  •  

  •  
    ప్రశ్న: మొసళ్ల లైంగికత జన్యు పరంగా ముందే నిర్ణయం కాదని, పొదిగే క్రమంలోనే అవి ఆడ, మగ వేరు అవుతాయని విన్నాను. నిజమేనా?

జవాబు: ఇది నిజమే. మనుషులు తదితర క్షీరదాలు, చాలా జంతువుల్లో లైంగిక క్రోమోజోములు ఉంటాయి. తద్వారా ఆడ జంతువు, మగ జంతువు కలిసినపుడు ఆడ జంతువు అండంలో, మగ జంతువు శుక్ర కణం లేదా తదనుగుణమైన కణం సంయోగం చెందుతుంది. ఆ క్రమంలో సంయుక్త బీజకణం (Zygote) ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజ కణంలోని జీవి ఆడనా, మగనా అక్కడే నిర్దేశితమవుతుంది. కాబట్టి గర్భధారణ తర్వాత ఆడ బిడ్డగానీ, మగ శిశువుగానీ జన్మిస్తాయి. అలాగే కోడి పుంజు, కోడిపెట్ట కలిశాక ఏర్పడ్డ గుడ్డును పొదగకముందే పుట్టబోయేది పెట్టనా లేదా పుంజా ముందే నిర్ణయమయి ఉంటుంది. కానీ మొసళ్లు, అలిగేటర్లు వంటి జంతువులలో ఆడ, మగ లైంగికత ఉన్నా వాటిలో లైంగికతను నిర్ణయించే క్రోమోజోములు లేవు. కాబట్టి అండ దశలోనే లైంగికత నిర్ధారణ అయి ఉండదు. గుడ్డు పొదిగే ఉష్ణోగ్రతను బట్టి పుట్టబోయే మొసలి ఆడా, మగనా నిర్ణయమవుతుంది. మొసలి గుడ్డు 30 నుంచి 32 డిగ్రీల సెంటిగ్రేడు కన్నా తక్కువ ఉంటే ఆడ మొసలి వస్తుంది. మొసళ్లు ఒకసారి అనేక గుడ్లు పెడతాయి కాబట్టి ఉష్ణోగ్రత 33 నుంచి 34 డిగ్రీల సెంటిగ్రేడు మధ్య ఉంటే గుడ్లలో కొన్ని ఆడవి, కొన్ని మగవిగా బయటికొస్తాయి. అదే 35 డిగ్రీల సెల్సియస్‌కన్నా ఎక్కువుంటే మగ మొసళ్లు బయటికొస్తాయి.


- ప్రొ.ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ====================

మొసళ్ల లైంగికత పొదిగేప్పుడే తెలుస్తుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



    ప్రశ్న: మొసళ్ల లైంగికత జన్యు పరంగా ముందే నిర్ణయం కాదని, పొదిగే క్రమంలోనే అవి ఆడ, మగ వేరు అవుతాయని విన్నాను. నిజమేనా?


జవాబు: ఇది నిజమే. మనుషులు తదితర క్షీరదాలు, చాలా జంతువుల్లో లైంగిక క్రోమోజోములు ఉంటాయి. తద్వారా ఆడ జంతువు, మగ జంతువు కలిసినపుడు ఆడ జంతువు అండంలో, మగ జంతువు శుక్ర కణం లేదా తదనుగుణమైన కణం సంయోగం చెందుతుంది. ఆ క్రమంలో సంయుక్త బీజకణం (Zygote) ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజ కణంలోని జీవి ఆడనా, మగనా అక్కడే నిర్దేశితమవుతుంది. కాబట్టి గర్భధారణ తర్వాత ఆడ బిడ్డగానీ, మగ శిశువుగానీ జన్మిస్తాయి. అలాగే కోడి పుంజు, కోడిపెట్ట కలిశాక ఏర్పడ్డ గుడ్డును పొదగకముందే పుట్టబోయేది పెట్టనా లేదా పుంజా ముందే నిర్ణయమయి ఉంటుంది. కానీ మొసళ్లు, అలిగేటర్లు వంటి జంతువులలో ఆడ, మగ లైంగికత ఉన్నా వాటిలో లైంగికతను నిర్ణయించే క్రోమోజోములు లేవు. కాబట్టి అండ దశలోనే లైంగికత నిర్ధారణ అయి ఉండదు. గుడ్డు పొదిగే ఉష్ణోగ్రతను బట్టి పుట్టబోయే మొసలి ఆడా, మగనా నిర్ణయమవుతుంది. మొసలి గుడ్డు 30 నుంచి 32 డిగ్రీల సెంటిగ్రేడు కన్నా తక్కువ ఉంటే ఆడ మొసలి వస్తుంది. మొసళ్లు ఒకసారి అనేక గుడ్లు పెడతాయి కాబట్టి ఉష్ణోగ్రత 33 నుంచి 34 డిగ్రీల సెంటిగ్రేడు మధ్య ఉంటే గుడ్లలో కొన్ని ఆడవి, కొన్ని మగవిగా బయటికొస్తాయి. అదే 35 డిగ్రీల సెల్సియస్‌కన్నా ఎక్కువుంటే మగ మొసళ్లు బయటికొస్తాయి.


- ప్రొ.ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ===========================
  • visit My website > Dr.Seshagirirao - MBBS.- http://dr.seshagirirao.tripod.com/

పురుగులు చిన్నగా ఉంటాయేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...పురుగులు చిన్నగా ఉంటాయేం?








ప్రశ్న: పురుగుల పరిమాణం జంతువుల, పక్షుల కన్నా తక్కువగా ఉంటుంది. ఎందువల్ల?

జవాబు: వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్‌ శాతం ఇప్పటి కన్నా ఎక్కువగా ఉండి ఉంటే, పురుగుల దేహ పరిమాణం కూడా ఇప్పటి కన్నా ఎంతో ఎక్కువగా ఉండి ఉండేది. వెన్నెముక లేని ప్రాణుల పరిమాణం వాటికి లభించే ఆక్సిజన్‌ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అతి సన్నని గొట్టాల రూపంలో ఉండే వ్యవస్థ పురుగుల దేహమంతా వ్యాపించి వాటికి ఆక్సిజన్‌ను అందజేస్తుంది. అందువల్ల, పురుగు పరిమాణం పెద్దదయే కొలదీ, దాని దేహానికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే వ్యవస్థ విస్తారమైనదే కాకుండా క్లిష్టంగా, చిక్కుపడి ఉంటుంది. అలాంటి వ్యవస్థ పరుగుల పరిమాణంపై కొంత పరిమితిని విధిస్తుంది. వాతావరణంలోని గాలిలో ఉండే ఆక్సిజన్‌ పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే, వాటి దేహంలోని వ్యవస్థ అంత ప్రతిభావంతంగా పనిచేస్తుంది.

ప్రస్తుతం గాలిలో ఆక్సిజన్‌ 21 శాతం ఉంటే, భూమిపై జీవం ఏర్పడి ప్రాణులు తిరుగాడుతున్న తొలి రోజుల్లో గాలిలో ఆక్సిజన్‌ 35 శాతం ఉండేది అందువల్ల ఆ రోజుల్లో రెక్కల పరిమాణం 760 మిల్లీ మీటర్లు ఉండే రాక్షస తూనీగలు ఉండేవి.

అంతేకాకుండా, పురుగుల గరిష్ఠ పరిమాణంపై ఆంక్షలు విధించే మరో అంశం- పురుగుల శ్వాసనాళాల పరిమాణంలో కొంత పరిమితి ఉంటుంది. అందువల్ల పురుగుల పరిమాణం ఆ పరిమితిని దాటితే, ఆ భాగాలకు ఆక్సిజన్‌ లభించదు. అందువల్లే పురుగుల శరీర పరిమాణం అంత తక్కువగా ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌ visit My website > Dr.Seshagirirao - MBBS.-
  • ================================
dr.seshagirirao.com/

మిగతా మోటారు వాహనాల టైర్లలో లాగా రేస్‌కార్ల టైర్లలో మామూలు గాలి ఎందుకు నింపరు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



 ప్రశ్న: మిగతా మోటారు వాహనాల టైర్లలో లాగా రేస్‌కార్ల టైర్లలో మామూలు గాలి ఎందుకు నింపరు?


జవాబు: రేస్‌కార్ల టైర్లలో గాలికి బదులు నైట్రోజన్‌ వాయువును నింపుతారు. దీనికి కారణం నైట్రోజన్‌ వాయువులో ఉష్ణం వల్ల ఉత్పన్నమయే సంకోచ, వ్యాకోచాలు సమంగా ఒకే తీరులో ఉంటాయి. మామూలు గాలిలో కొంత శాతం తేమ కూడా ఉండటం వల్ల దాని సంకోచ, వ్యాకోచాలు ఒకే తీరుగా ఉండవు. ఫలితంగా టైర్లలో ఉండే ఒత్తిడిలో తేడాలు వస్తాయి. రేస్‌ కార్లు అత్యంత వేగంతో ప్రయాణించేటపుడు టైర్లలో ఎక్కువ వేడి పుడుతుంది. దాని ప్రభావం వాటి లోపల ఉండే వాయువు మీద పడుతుంది. గాలి కన్నా నైట్రోజన్‌పై ఉష్ణ ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్రోజన్‌ను వాడటం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ==================

పప్పు తింటే చీము పడుతుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: శరీరానికి గాయమయినపుడు పప్పు తింటే చీము పడుతుందంటారు నిజమేనా?

జవాబు: పప్పు తింటే చీము పడుతుందనేది సమాజంలో ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం. నిజానికి గాయం తగిలితే అది తొందరగా మానాలంటే పప్పు తినడం శ్రేయస్కరం. అసలు చీము అంటే ఏమిటి? గాయమయినపుడు ఆ గాయపు రంధ్రం గుండా కన్నంలోంచి దొంగలు దూరినట్లు రోగకారక బాక్టీరియాలు తదితర పరాన్న జీవులు శరీరంలోకి ప్రవేశిస్తే, వాటితో పోరాడి మరణించిన మన తెల్లరక్త కణాలే! మన రక్షణ వ్యవస్థలో భాగమైన ఈ మృతవీరులే గాయమైన చోట చీముగా కనిపిస్తాయి. నశించిన ఈ తెల్ల రక్తకణాల సైన్యం స్థానంలో కొత్త తెల్ల రక్తకణాలు ఏర్పడాలంటే మన శరీరానికి తగినన్ని పోషక విలువలున్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కావాలి. ఈ రెండూ అమితంగా ఉన్న ఆహార పదార్థం పప్పు. బాగా ఉడికించిన పప్పు తింటే గాయమయినా చీము పట్టదు సరికదా పుండు తొందరగా మాని పోతుంది. పప్పు తినకుండా ఉంటేనే గాయానికి ప్రమాదం.


-ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం,-జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  •  =======================

వాతావరణంలోని తేమను ఎలా కొలుస్తారు?


  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  ప్రశ్న: వాతావరణంలోని తేమను ఎలా కొలుస్తారు?

జవాబు: గాలిలో ఉండే తేమను ఆర్ద్రత అంటారు. ఈ ఆర్ద్రతను రెండు విధాలుగా విభజింపవచ్చు. ఒకటి పరమ ఆర్ద్రత. రెండోది సాపేక్ష ఆర్ద్రత. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను పరమ ఆర్ద్రత అంటారు. ప్రస్తుతం ఉండే ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను సంతృప్తీకరణం చేయడానికి కావలసిన తేమ శాతాన్ని సాపేక్ష ఆర్ద్రత అంటారు.

ఆర్ద్రతను హైగ్రోమీటర్‌ అనే పరికరంతో కొలుస్తారు. ఈ హైగ్రోమీటర్లు హెయిర్‌ హైగ్రోమీటర్‌, కెపాసిటివ్‌ హైగ్రోమీటర్‌ అని రెండు రకాలు. సాపేక్ష ఆర్ద్రతను కొలిచే హెయిర్‌ హైగ్రోమీటర్‌లో వెంట్రుకలు ఒక కుచ్చు రూపంలో ఉంటాయి. గాలిలో తేమను పీల్చుకున్నపుడు ఆ వెంట్రుకలు సాగుతాయి. అపుడు పరికరంలో ఉండే అతి సున్నితమైన యాంత్రిక వ్యవస్థ వెంట్రుకల పొడవులోని మార్పును ఒక స్కేలుపై చలనంలో ఉండే సూచికకు అందజేస్తుంది. స్కేలుపై ఆర్ద్రతల విలువలు విభాగాల రూపంలో ఉంటాయి. ఉష్ణోగ్రతలలో స్వల్ప మార్పులను సునిశితంగా గ్రహించే సామర్థ్యం ఉండటం వల్ల స్త్రీల తల వెంట్రుకలను ఈ పరికరంలో వాడతారు.

పరమ ఆర్ద్రతను కొలిచే కెపాసిటివ్‌ హైగ్రో మీటర్‌లో గాలిలోని ఆర్ద్రతను కొలవడానికి విద్యుచ్ఛక్తిని వాడతారు. ఈ పరికరంలో ఒక కండెన్సర్‌ ఉంటుంది. కండెన్సర్‌లో సమాంతరంగా ఉండే విద్యుత్‌ వాహకాలైన రెండు పలకల మధ్య ఉండే టెన్షన్‌ మార్పుల ఆధారంగా ఆర్ద్రతను కొలుస్తారు. ఆర్ద్రత అంటే గాలిలో తేమ తగ్గే కొలదీ కండెన్సర్‌ పలకల మధ్య టెన్షన్‌ తగ్గుతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • =============================