Thursday, December 25, 2014

Sea waves come towards Seacost why?,సముద్రంలో అలలు తీరం వైపే వస్తాయేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  


ప్రశ్న: గాలి ఎటు వీచినా సముద్రంలో అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. ఎందుకు?

జవాబు: సముద్రపు మధ్య భాగం లోతుగా ఉన్నా తీరాన్ని సమీపించే కొద్దీ లోతు తగ్గుతుంది. చివరికి తీరం దగ్గర లోతు శూన్యం అవుతుంది. నీటిలోని కదలిక అలలు లేదా తరంగాలు. ఇవి లోతు ఎక్కువ ఉన్న సముద్రపు మధ్య భాగంలో తక్కువ తీవ్రతతోను, లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎక్కు తీవ్రతతోను ఉంటాయి. ఇందుకు కారణం శక్తినిత్యత్వ సూత్రమే. సముద్రపు మధ్యలో తలెత్తిన తక్కువ తీవ్రత ఉన్న అలలు తీరాన్ని అధిక తీవ్రతలోకి చేరతాయి. అలలు రావడం గాలి వల్ల కాదు కాబట్టి గాలి దిశకు సంబంధం లేకుండా అలలు తీరంవైపే వస్తాయి.

తుపానులు, పెనుగాలులు సంభవించినపుడు మాత్రమే గాలి వీడ్పులు అలల ఎత్తుల్ని కొంత వరకు ప్రభావితం చేస్తాయి. అలల ప్రావస్థ మాత్రమే తీరాన్ని తాకుతుంది కానీ సముద్రపు నీరు కాదు. సముద్రపు నీరు సముద్రంలోనే ఉంటుంది. అలలు కూడా తీరం దగ్గర అధిక ఎత్తుకు ఎగరడం వల్ల తీరపు అంచుల దగ్గర మన కాళ్లను తాకుతాయి. అంతమాత్రాన అలల నీరు తీరం వైపు ప్రవహిస్తుందనుకోకూడదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • =============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

How lemon juice clear sopts on Water tap, కుళాయిపై మచ్చలను నిమ్మరసం ఎలా తొలిగిస్తుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసం ఎలా తొలిగిస్తుంది?
జవాబు: నీళ్ల కుళాయిలపై ఏర్పడే తెల్లటి మరకలను నిమ్మరసంతోనే కాకుండా, ద్రాక్షరసం నుంచి తయారు చేసే 'వినిగర్‌'తో కూడా తొలగించవచ్చు. కుళాయిలపై వాటిలో ప్రవహించే నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం అయాన్ల వల్ల ఏర్పడే లవణాల మూలంగా తెల్లని సున్నపు మరకలు ఏర్పడతాయి. ఉప్పునీటిలో ఈ లవణాల శాతం అధికంగా ఉంటుంది. కుళాయిలపై నీటి అణువులు భాష్పీభవనం చెందిన తర్వాత ఈ మరకలు శాశ్వతంగా ఉండిపోతాయి. వీటిని ఏ రసాయనిక ద్రావకం ద్వారానైనా తొలగించవచ్చు. కానీ అతి గాఢత కలిగిన ఆ ద్రావకాల వల్ల రసాయనిక చర్యలు జరిగి కుళాయిలు తయారయిన లోహాలు కరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ కుళాయిలపై సున్నపు మరకలు పడిన ప్రదేశాలను అతి తక్కువ గాఢత ఉండే నిమ్మరసం లేక వినిగర్‌తో రుద్దితే, నిమ్మరసంలోని సిట్రిక్‌ ఆమ్లం, వినిగర్‌లో ఉండే ఎసిటిక్‌ ఆమ్లం, ఆ కుళాయిలకు అంటుకుపోయిన తెల్లటి సున్నపు మరకలను అంటే ఆ లవణాలను తొలగిస్తాయి. తర్వాత ఆ ప్రదేశాలను నీటితో కడిగితే, కుళాయిలు మునుపటి లాగే మెరుస్తుంటాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Currency not same all over the world why?,అంతటా ఒకే కరెన్సీ ఉండదేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?
జవాబు: ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు, అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో అన్ని రుతువుల్లో తయారు కావు. ఇచ్చి పుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు సేవలు భారత దేశానికీ అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి కాబట్టి ఈ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్‌ తీసుకుంటాం. అదే టోకెన్‌ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్‌ఫోను విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకొనే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తుమార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్‌ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం.

అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30 వేల రూపాయలకు అమ్మితే అమెరికాలో 500 డాలర్లు పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే 500 డాలర్ల విలువ 30 వేల రూపాయల విలువ సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలరుకు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపాదేశాలు కూడబలుక్కుని తమదేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా 'యూరో'ను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, December 24, 2014

Soaps clean dirt How?,సబ్బులు మురికిని ఎలా వదిలించగలవు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: స్నానం చేసేటపుడు, బట్టలు ఉతికేప్పుడు సబ్బులు మురికిని ఎలా వదిలించగలవు?
Ans :  మనం వేసుకొనే వస్త్రాల మీద, శరీరం మీద చేరే మురికి కణాలు రెండు రకాలు. కొన్ని నూనె లాంటి జిడ్డు పదార్థాలకు చెందినవైతే, మరికొన్ని విద్యుదావేశాలు కలవి. గాలిలోని కణాలు ఒకదానిని మరొకటి రాసుకోవడం వల్ల వాటికి విద్యుదావేశం కలుగుతుంది. మామూలుగా నీటిలో ముంచి బట్టలు ఉతకడం వల్లకానీ శరీరంపై నీరు పోసుకుని రుద్దుకోవడం వల్ల కానీ ఈ మురికి కణాలు సులభంగా తొలిగిపోవు. పైగా ఉతకడం వల్ల, రుద్దడం వల్ల ఈ కణాలలో విద్యుదావేశం తొలిగిపోయి బట్టలకు, ఒంటికి అంటుకుపోతాయి. నూనె కణాలు నీటితో కలవక పోవడం వల్ల అవి మరీ అతుక్కుపోతాయి. సబ్బు వివిధ రకాల రసాయనిక పదార్థాల సమ్మేళనం. సబ్బులోని రసాయనిక అణువులకు ఉన్న ప్రత్యేక ధర్మం, అణు నిర్మాణం మూలంగా అవి మురికిలోని జిడ్డుతో కూడిన కణాలకు, విద్యుదావేశం ఉన్న కణాలకు అంటుకుంటాయి. తర్వాత నీరు పోసి ఉతకడం గానీ, రుద్దడం కానీ చేయగానే సబ్బుకణాలు మురికి కణాలను తమతో పాటు, గుడ్డలనుంచి, ఒంటి నుంచి తొలగిస్తాయి.

స్నానానికి వాడే సబ్బుల్లో మురికిని తొలగించే రసాయన పదార్థాలతో పాటు సువాసన వెదజల్లే పదార్థాలు కూడా ఉండటం వల్ల మనకి ఆహ్లాదంగా అనిపిస్తుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why there short and long difference,పొట్టీ పొడవుల తేడాలేల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: కొందరు మనుషులు పొట్టిగా, మరి కొందరు బాగా ఎత్తుగా ఉంటారెందుకు?

జవాబు:
విపరీతమైన జన్యులక్షణాలు, గర్భస్థ సమయంలో పిండంలో కలిగిన మార్పుల మూలాన ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తిగా సుమారు ఎనిమిది అడుగుల 3 అంగుళాల ఎత్తుగల సుల్తాన్‌ కోసెన్‌ గిన్నిస్‌ రికార్డుకెక్కాడు. ప్రపంచంలో నేటి వరకు రికార్డు ప్రకారం అత్యంత పొట్టి వ్యక్తి నేపాల్‌ దేశానికి చెందిన చంద్ర బహద్దూర్‌ డాంగీ. ఇతని ఎత్తు కేవలం ఒక అడుగు తొమ్మిదిన్నర అంగుళాలు. ఇలాంటి విపరీతమైన వ్యత్యాసాలు మినహాయిస్తే సాధారణ ప్రజానీకంలో ఎత్తు పొడవులు తేడా ఉండటానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి, అప్రధానమైనవి ఉన్నాయి. అప్రధానమైనవి అరుదుగా సంభవించే కారణాలు. ఉదాహరణకు గర్భంలో ఉండగా తల్లి సరిగా ఆహారం తీసుకోనట్లయితే పిండం ఎదుగుదలలో లోపం వచ్చి ఆ తర్వాత ఎంత తిన్నా పొడవు పెరగక పోవచ్చు. ఒక వేళ మామూలుగానే తల్లి ఆరోగ్యంగా గర్భం ధరించినా ప్రసవం తర్వాత నూతన శిశువుకు బాలారిష్టాలు కల్గి ఎముకల ఎదుగుదలలో లోపాలు వచ్చినా, పెరిగే క్రమంలో పోషకాహారం లేకున్నా, బాల్యంలోనే ఎదుగుదల క్షీణించవచ్చు. మనిషి సుమారు 20 సంవత్సరాల లోపే ఎదుగుతాడు. ఆ తర్వాత ఎదుగుదల ఉండదు. కాబట్టి 20 సంవత్సరాల లోపు పోషకాహారం, వ్యాయామం, మంచి నిద్ర అవసరం.

ప్రధానమైన కారణాలు జన్యు సంబంధమైనవి. ఉదాహరణకు తల్లిదండ్రులు ఇరువురూ పొడవుగా ఉన్నట్లయితే పిల్లలు కూడా పొడవుగానే ఎదిగే అవకాశం ఉంది. చైనా, జపాన్‌, నేపాల్‌, మలేషియా వంటి ప్రాంతాల్లో ప్రజల జన్యుతత్వం అక్కడ సగటు మనిషి ఎత్తు 5 అడుగుల వరకే ఉండేలా ఉంది. అమెరికా, దక్షిణాఫ్రికా, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అలాంటి జన్యుతత్వం లేదు.
సాధారణంగా వారు 6 అడుగుల వరకు పెరుగుతారు. భారతీయులు సగటుగా 5 నుంచి 6 అడుగుల మధ్య ఉంటారు. అత్యంత పొడవుకు కూడా జన్యువులే కారణం.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

డెడ్‌సీ లో మనుషులు-వస్తువులు మునగవా?,Articles not sink in Dead sea?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  


  •  
ప్రశ్న: డెడ్‌ సీ (మృత సముద్రం)లో మనుషులే కాకుండా వస్తువులు కూడా తేలుతాయా?
జవాబు: డెడ్‌సీ (Dead sea) అని పిలిచే మృత సముద్రం మిగతా సముద్రాలతో సంబంధం లేకుండా ఒక పెద్ద కొలనులాగా ఉంటుంది. సుమారు 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో ఇజ్రాయిల్‌, జోర్డాన్‌ దేశాల మధ్య విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తులో ఉన్న సరస్సు. దీంట్లో సముద్రాలలో కన్నా లవణీయత పదిరెట్లు ఎక్కువ. అంటే ఉప్పు వంటి అనేక లవణాల గాఢత విపరీతంగా ఉండడం వల్ల ఇందులో చేపలు, తిమింగలాలు, నాచు, కోరల్స్‌ వంటి పెద్ద జీవజాతులు బతకలేవు. అందుకే దీన్ని మృత సముద్రం అన్నారు. కేవలం తక్కువ స్థాయిలో కొన్ని బాక్టీరియాలు, ఫంగస్‌ జీవులు ఉంటాయి.
మృతసముద్రంలో ఉప్పు శాతం విపరీతంగా ఉండడం వల్ల ఈ నీటి సాంద్రత 1.24 గ్రా/మి.లీ. ఉంటుంది. అందుకే మనుషులు తదితర జీవులు మునగవు. ఈత కొట్టవలసిన అవసరం లేకుండానే నీళ్లలో తేలవచ్చు. మనుషులు మునగనంత మాత్రాన మిగతా వస్తువులు కూడా మునగవని అనుకోడానికి లేదు. ప్లవన సూత్రాల ప్రకారం ద్రవాల సాంద్రత కన్నా వస్తువుల సాంద్రత ఎక్కువయితే ఆ వస్తువులు ఆ ద్రవంలో మునుగుతాయి. తక్కువయితే తేలుతాయి. కాబట్టి 1.24 గ్రా/మి.లీ. కన్నా ఎక్కువ సాంద్రత ఉన్న ఇనుము, రాళ్లు వంటివి తప్పకుండా మునుగుతాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Do not walk under trees during nights, రాత్రివేళ చెట్ల కింద నడవకూడదా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: రాత్రిపూట భోజనం తర్వాత చెట్ల కింద నడవవచ్చా?ప్రమాదమేమీ లేదా?

జవాబు:
నడుస్తున్నపుడు తలకు ఆకులు తాకేలా పొట్టిగా ఉన్న చెట్ల కింద ఎక్కువ సేపు రాత్రుళ్లు ఉండకూడదనేది ఓ సూచన. అలా ఉన్నంత మాత్రాన విపరీతమైన సమస్య, ప్రాణాపాయం ఏమీ రాదు. కానీ ఆక్సిజన్‌ను మనతో పాటు చెట్టు కూడా శ్వాసక్రియలో వాడుకుంటుంది. మనలాగే శ్వాసక్రియలో చెట్లు కూడా కార్బన్‌ డయాక్సైడును విడుదల చేస్తాయి. కార్బన్‌ డయాక్సైడ్‌ అణుభారం 44. నైట్రోజన్‌, ఆక్సిజన్‌లున్న గాలి కన్నా ఇది ఎక్కువ. అదే పనిగా చెట్టు కిందే ఉంటే కార్బన్‌డయాక్సైడ్‌ బరువెక్కి చెట్టు కిందికి పోగవుతుంది కాబట్టి మనకు ప్రాణ వాయువయిన ఆక్సిజన్‌ తక్కువగా లభ్యమవుతుంది. అయితే చెట్టు ఆకులు తగిలేలా ఎవరూ చెట్లకింద నడవరు, పడుకోరు.

చెట్టు కొమ్మలకు, నేలకు మధ్య బాగా సందు ఉన్నట్లయితే గాలి ఎప్పటికప్పుడు విసరణం చెందుతుంది. కాబట్టి అదేపనిగా కార్బన్‌డయాక్సైడు అక్కడే ఉండిపోదు. మామూలుగా ఎత్తుగా ఉన్న చెట్ల కింద పగలయినా రాత్రయినా నడిస్తే ప్రత్యేక తేడా ఉండదు. ప్రమాదం ఏమీ లేదు. భోజనం తర్వాత కొంత నడక మంచిది అన్న సామెత నేడు చెల్లదని వైద్యులు అంటున్నారు. భోజనం తర్వాత కొంత విశ్రాంతి అవసరమని శాస్త్రవేత్తలు సూత్రీకరిస్తున్నారు.

అయినా భోజనానికీ, చెట్లకు సంబంధం ఏముంటుంది? చెట్ల కింద రాత్రుళ్లు నడవాలా వద్దా అన్నదే మీమాంస లేదా భోజనం తర్వాత నడవటం మంచిదా, కాదా అనేది సంశయం.


- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ===========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Cause for moving arround , పరిభ్రమణానికి కారణమేంటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

Q : అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎందుకు?

A : ఏదైనా వస్తువు, ఉదాహరణకు తిరుగుతున్న బొంగరం, ఒక అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరుగుతుందంటే, అది పరిభ్రమణం చేస్తుందని అంటాం. అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు ఇలా పరిభ్రమణాలు చేస్తుండడానికి కారణాన్ని భౌతిక శాస్త్ర నియమం 'కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం' ద్వారా వివరించవచ్చు. ఈ నియమం ప్రకారం పరిభ్రమణం చేస్తున్న వస్తువు ఏ కారణం లేకుండా దానంతట అది ఆగిపోదు. పరిభ్రమణం చేస్తున్న బొంగరం కొంతసేపటికి ఆగిపోవడానికి కారణం దాని 'ములుకు'కు నేలకు మధ్య ఉన్న ఘర్షణ (friction) ప్రభావమే. ఆ ఘర్షణ లేకుంటే పరిభ్రమణంలో ఉన్న బొంగరం ఆగకుండా అలా తిరుగుతూనే ఉంటుంది.

ఇక నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణ విషయానికి వస్తే, అవి తమ చుట్టూ తాము పరిభ్రమిస్తున్న వాయుధూళి సముదాయం ఘనీభవించడం వల్ల ఏర్పడినవే. ఈ వాయుమేఘాలు గురుత్వ ప్రభావం వల్ల క్రమేపీ తమలోకి తాము కుంచించుకుపోవడంతో కాలక్రమేణా నక్షత్రాలు, వాటి చుట్టూ గ్రహ వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ వాయు మేఘాలు కుంచించుకుపోయేకొలదీ వాటి భ్రమణ వేగాలు ఎక్కువయ్యాయి. ఐస్‌పై స్కేటింగ్‌ చేస్తూ తమ చుట్టూ తాము తిరుగుతున్న స్కేటర్లు తాము దూరంగా బార చాపిన చేతులను తమ శరీరానికి దగ్గరగా తెస్తున్నపుడు వారి పరిభ్రమణ వేగం ఎక్కువవుతున్నట్లు.

ఇలా పరిభ్రమిస్తున్న వాయు మేఘాలు క్రమేపీ నక్షత్రాలుగా మారుతున్నపుడు ఆ మేఘాలలోని అతి కొద్ది శాతం పరిభ్రమణ చలనం మాత్రమే నక్షత్రాలకు బదిలీ అవుతుంది. లేకపోతే ఆ చలన వేగానికి నక్షత్రాలు తునాతునకలై పోతాయి. ఇలా జరగకుండా నిరోధించడానికే ఆ నక్షత్రాల నుంచి గ్రహాలు ఏర్పడి, వాయుమేఘాల తొలి పరిభ్రమణ వేగం అంటే తొలి కోణీయ ద్రవ్యవేగాన్ని తలాకొంచెం పంచుకున్నాయి. అందువల్లే నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

పాదరసం నీటిలో కరగదు-కలవదు.ఎందువల్ల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పాదరసం నీటిలో కరగదు-కలవదు.ఎందువల్ల?

జవాబు: భూమిపై ఉన్న వందకుపైగా మూలకాల్లో సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల దగ్గర ద్రవస్థితిలో ఉన్నవి రెండే రెండు. ఒకటి బ్రోమిన్‌. ఇది అలోహం (non metal) , రెండోది పాదరసం. ఇది లోహం. అరచేతిలో పెట్టుకొంటే ద్రవంగా మారే రుబిడియం, ఫ్రాన్షియం, గెలియం వంటి ఇతర లోహాలు ఉన్నాయి. మూలకాలకు స్వతహాగా ధ్రువత్వం (polarity) ఉండదు.

ఒకే కణానికి విద్యుదావేశం ఉంటే వాటిని అయానులు అంటారు. ఉదాహరణకు (Nacl) ఉప్పులో సోడియం కణానికి ధనావేశం ఉంటుంది. ఒక కణంలో ఓ ప్రాంతంలో ధనావేశ లక్షణం, మరో ప్రాంతంలో రుణావేశ లక్షణం ఉంటే అటువంటి పదార్థాలను ధ్రువపదార్థాలు (polar materials) అంటారు. ఉదాహరణకు అమ్మోనియో (NH3) అణువులో నత్రజని పరమాణువు ప్రాంతంలో రుణావేశితం స్వల్పంగా పోగయి ఉంటుంది. హైడ్రోజన్‌లున్న ప్రాంతంలో స్వల్పంగా ధనావేశం పోగయి ఉంటుంది. అందుకే ఆ అణువును ధ్రువాణువు అంటారు. పూర్తిగాగానీ లేదా పాక్షికంగానైనా గానీ విద్యుదావేశం అదనంగా లేని పరమాణువుల్ని అణువుల్ని, పదార్థాల్ని మనం అధ్రువ పదార్థాలు అంటాం. అయస్కాంత పదార్థాలు అయస్కాంత లక్షణాలున్న పదార్థాలతోనే ప్రభావితమైనట్లే, విద్యుదావేశమున్న పదార్థాలు ఇతర విద్యుదావేశిత పదార్థాలతోనే ప్రభావితమవుతాయి. నీటి అణువు H2o కూడా ధ్రువ అణువు. ఆక్సిజన్‌ దగ్గర రుణావేశం, హైడ్రోజన్ల దగ్గర ధనావేశం స్వల్పంగా పోగయి ఉంటాయి. కాబట్టి నీటిని ధ్రువద్రావణి అంటారు. అందువల్ల అయాను లక్షణాలున్న ఉప్పు, ధ్రువ లక్షణాలున్న చక్కెర, ఆల్కహాలు వంటివి నీటిలో బాగా కరుగుతాయి, కలుస్తాయి. పాదరసానికి ధ్రువ లక్షణం లేకపోవడం వల్ల నీటిలో కరగదు. కలవదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; జనవిజ్ఞానవేదిక, శాస్త్రప్రచార విభాగం (తెలంగాణ)

 

  • ========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Wednesday, December 17, 2014

వైద్యులు నాడి పట్టుకుని చూస్తారెందుకు?.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
 ప్ర : వైద్యులు నాడి పట్టుకుని చూస్తారెందుకు?.

జ : ప్రస్తుత వైద్యులు  రోగిని తాకడం తగ్గించారు. . కానీ పాతరోజుల్లో వైద్యులు తమ రోగిని ముంజేయి దగ్గర పట్టుకుని చూసేవారు. అది నాడిని పట్టుకోవడము అని మనము అనుకుంటాము . వాస్తవములో వైద్యుడు రక్తనాళము పట్టుకుని చూస్తాడు . రక్తనాళము లో రక్తము ఒక క్రమవేగముతో ప్రవహిస్తుంది. అది కాకుండా ధమని గోడలు గుండె కొట్టుకోవడము మాదిరిగానే పల్స్ కొట్టుకొంటుంది. అది ఎన్నిసార్లు కొట్టుకుంటున్నాదో లెక్కపెడతారు. అనారోగ్యానికి గురి అయినప్పుడు ఆ రక్తప్రవాహ వేగము మారుతుంది. ఆ వేగము తగ్గిందా , పెరిగిందా అనేది చేయి పట్టుకుని తెలుసుకొని దానిని బట్టి రోగాన్ని అంచనావేయడము వైద్యులు చేస్తారు.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, December 13, 2014

దురద కలిగించే మొక్కలుంటాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్ర : దురద కలిగించే మొక్కలుంటాయా?

జ : ఉంటాయి... కొన్ని రకాల మొక్కలు , గడ్డి  మన చర్మానికి తాకినప్పుడు  దురద పెడుతుంది. మన ప్రాంతాలలొ దొరికే " దురదగుండాకు " అందరికీ తెలినదే. ఇంగ్లీష్ లో స్టింగింగ్ నెటిల్ అంటారు. ఇది గ్రామాల్లో , ఊరి బయట రోడ్డు పక్కన పెరిగే ఓ పిచ్చి మొక్క. ఆ మొక్కల ఆకుల మీద సూచ్మ రూపములో గొట్టాలవంటి సూదులు ఉంటాయి. వాటి అంచుల్లో దురద కలిగించే రసాయనము ఉంటుంది . ఆ రసాయనము  ప్రభావము వలన దురద వస్తుంది. అది ఆ మొక్కలు రక్షణకోసము ఏర్పరచుకున్న వ్యవస్థ . 

ఈ విషయము తెలిసిన జంతువులు ఆ మొక్కలను మాత్రము తినవు . వాటికి దూరము గా ఉంటాయి. ఆత్మరక్షణ వాటి ఉద్దేశము . కాని మనిషికే ఇబ్బంది.
  •  ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, December 06, 2014

Is there any animal bigger than Elephant?-ఏనుగు కంటే పెద్ద జంతువు ఉందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  


 ప్ర : ఏనుగు కంటే పెద్ద జంతువు ఉండా?

 జ : భూమి మీద నివసించే జంతువులలో ఏనుగే అతిపదది . అయితే ఏనుగును మించిన మరో జంతువుంది. అది సముద్రములో తిరిగే తిమింగలము.  తిమింగలాలలో నీలితిమింగలము ప్రపంచములో అతి పెద్ద జంతువు ..దీని బరువు 200 టన్నులు  పైచిలుకు , పొడవు 100 అడుగులుకన్నా ఎక్కువే. దీని నాలుక బరువు నాలుగు టన్నుల బరువు కంటే ఎక్కువే. అంత పెద్దజంతువు నీళ్ళలో కాబట్టి హాయిగా స్వేచ్చగా తిరగ గలుగుతుంది. అది కూడా ఏనుగు , మనిషి లాగ ఒక క్షీరదమే.
  • ===========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, November 30, 2014

why do we shiver in winter cold?-చలికి వణుకుతామెందుకు ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  



 ప్ర : చలికాలము లో చలికి వణుకుతామెందుకు ?

జ : చలిలో బయటకు వెళితే శరీరము వణుకుతుంది. దీనికి కారణము శరీర ఉష్ణోగ్రతకు బయట వాతావరణ ఉష్ణోగ్రతకు ఉన్న తేడా . ఉష్ణోగ్రత అధికము గా వున్న చోటనుండి తక్కువ ఉన్నచోటుకు ప్రవహిస్తుంది. అలా శరీరము నుండి చలి వాతావరణము లోకి ఉష్ణోగ్రత  హఠాత్తుగా , వేగముగా ప్రవహించేసరికి దానికి స్పందనగా శరీర కండరాలు ఒక్క సారికా కదలినట్లవుతాయి. దాంతో శరీరము వణుకుతుంది. శరీర ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటేనే లోపలి శరీర వ్యవస్థ సక్రమముగా పనిచేస్తుంది. ఆ ఉష్ణోగ్రతను స్థిరము గా నిలబెట్టుకునే యత్నములో శరీరము వణుకుతుంది.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వివాహిత స్త్రీలు మెట్టెలు పుస్తెలు ధరిస్తారెందుకు ?.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  


 ప్ర : వివాహిత స్త్రీలు మెట్టెలు పుస్తెలు ధరిస్తారెందుకు ?.

జ : విష్ణుభక్తులు త్రిపుండ్రాలను , శివభక్తులు విభూతిరేఖలను ధరించినట్లు గానే సౌభాగ్యవతులకు మంగళప్రదాయిని అయిన గౌరీదేవి యొక్క అలంకారాలు ధరిస్తే సౌభాగ్యవృద్ధి జరుగుతుందనే నమ్మకముతో స్త్రీలు మట్టెలు , పుస్తెలు ధరిస్తారు. అంతేకాక శారీరక శాస్త్రరీత్యా ఆ యా శరీర భాగలలో ఆ యా అలంకారాలను ఉంచడం వల్ల ఆక్యుపంచర్ వైద్యవిధానము లో కొన్ని వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది .
  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Cannot feel taste when suffer cold?- జలుబుంటే రుచి తెలియదా?,

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  


ప్రశ్న: జలుబు చేస్తే ఆహార పదార్థాల రుచి, వాసన సరిగా తెలియదు. ఎందుకు?

జవాబు: సాధారణ జలుబు (common cold) ను వైద్యశాస్త్ర పరిభాషలో నాసో ఫేరింజిటిస్‌ (naso pharyngitis)అంటారు. జలుబుకు కారణం వైరస్‌లు. దాదాపు 20 రకాల వైరస్‌ల వల్ల జలుబు వచ్చే ప్రమాదమున్నా ప్రధానంగా రైనో వైరస్‌ వల్ల వస్తుంది. జలుబు అంటువ్యాధి. ఈ వైరస్‌లు గాలి ద్వారా, శరీర స్పర్శ ద్వారా ఒకర్నించి మరొకరికి సోకుతాయి. దగ్గు, బొంగురు గొంతు, అదేపనిగా ముక్కు కారడం, తుమ్ములు, జ్వరం జలుబుకున్న ప్రధాన లక్షణాలు. జలుబుకు చికిత్స లేదు. కాబట్టి ప్రకటనలు విని డబ్బులు వృథా చేసుకోవద్దు.

జలుబు చేసినపుడు ముక్కులో ఉన్న ఘ్రాణేంద్రియ కణాల మీద వైరస్‌ కణాలు దాడిచేస్తాయి. వాటి పీచమణచడానికి మన రక్షక కణాలయిన తెల్లరక్తకణాలు యుద్ధం చేస్తాయి. అలాగే నోటిలో, నాలుకతో పాటు అన్ని వైపులా ఈ వైరస్‌లు దాడిచేయడం, వాటి మీద రక్షక కణాలు యుద్ధం చేసి తొలగించడం పరిపాటి.మరోమాటలో చెప్పాలంటే వాసన చూడాల్సిన ముక్కు, రుచి చూడాల్సిన నాలుక వైరస్‌, తెల్ల రక్తకణాల మధ్య యుద్ధ భూములుగా మారతాయన్నమాట.అటువంటి పరిస్థితిలో తిన్న ఆహార పదార్థాల్లోని వాసన నిచ్చే అణువుల్ని, రుచిని కలిగించే రసాయనాల్ని ఆయా ఇంద్రియావయవాలు సరిగా గుర్తించలేవు. అందుకే జలుబున్నపుడు వాసన, రుచి మందగిస్తాయి.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; --కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, November 28, 2014

మనం నడుస్తున్నపుడు కుడివైపు కంటే ఎడమ వైపునకే ఒరుగుతుంటామెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




 ప్రశ్న:మనం నడుస్తున్నపుడు కుడివైపు కంటే ఎడమ వైపునకే ఒరుగుతుంటాం. ఎందుకు?

జవాబు: మనదేహం కచ్చితమైన సౌష్ఠవం కల్గి ఉండదు. మన కుడి కాలు ఎడమ కాలు కన్నా కొంచెం పొడవుగా ఉంటుంది. క్రీడాకారుల శరీర దారుఢ్యాన్ని నిర్ణయించే పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణయింది. అంతేకాకుండా ఎడమ కాలు కన్నా కుడి కాలు కొంచెం ఎక్కువ బలంగా ఉండి సులభంగా వంగే గుణం కల్గి ఉంటుంది. అందువల్లే ఏదైనా వస్తువును తన్నవలసి వస్తే మనం సాధారణంగా కుడి కాలునే ఎక్కువగా వాడుతాం. నడుస్తున్నపుడు కుడికాలును ఎడమ కాలి కన్నా కొంచెం పైకి ఎత్తుతాం. కుడికాలు ఎక్కువ బలం కల్గి ఉండటం వల్ల మనం నడుస్తున్నపుడు నేలను కుడి కాలి పాదంతో నెట్టినపుడు దాని ఫలితంగా ఉత్పన్నమయ్యే ప్రతిబలం ఎడమవైపునకు పనిచేస్తుంది. ఆ బలం ఎడమపాదం కుడివైపు ప్రసరింపచేసే బలం కన్నా ఎక్కువ ఉంటుంది. కుడికాలు వేసే అంగ, అది కలగచేసే ప్రతిబలం ఎక్కువ కావడం వల్ల ఈ రెంటి కలయిక మనం ఎక్కువ దూరం నడుస్తున్నపుడు మనల్ని అపసవ్య దిశలో కదిలేటట్లు చేస్తుంది. అందువల్ల వేగంగా నడుస్తున్నపుడు ఎడమవైపునకు ఒరుగుతూ ఉంటాం. నడకలో బ్యాలెన్స్‌ పోయినపుడు ఎడమవైపునకు ఎక్కువగా వాలిపోతాం. నడకలో బలంగా ఉన్న కుడికాలు ప్రాధాన్యత వల్లే ఏదైనా శుభకార్యానికి బయలుదేరేటప్పుడు కుడికాలును ముందు పెట్టమని అంటారేమో!

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

మనం సూర్యరశ్మి నుంచి పొందే D విటమిన్‌కు, ఆహారం ద్వారా లభ్యమయ్యే డి విటమిన్‌కు తేడా ఉందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




    ప్రశ్న: మనం సూర్యరశ్మి నుంచి పొందే D విటమిన్‌కు, ఆహారం ద్వారా లభ్యమయ్యే డి విటమిన్‌కు తేడా ఉందా?


జవాబు: స్వచ్ఛమైన పదార్థం ఏ పద్ధతిలో తయారయినా గానీ గుణగణాలు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి D విటమిన్‌ను సూర్యరశ్మి ద్వారా పొందినా, ఆహారం ద్వారా పొందినా వాటిలో తేడా ఉండదు. ఆహారం ద్వారా లభించే D విటమిన్‌ ఒకే దఫాలో సరిపడినంత తీసుకోగలం. సాధారణ మనిషికి రోజుకు 15 నుంచి 20 మైక్రో గ్రాముల (మిల్లిగ్రాములో వెయ్యో వంతును మైక్రోగ్రాము అంటారు) 'డి' విటమిన్‌ అవసరం. అయితే ఎక్కువసేపు ఎండలో కూర్చుంటే చర్మంలో 'డి' విటమిన్‌తోపాటు క్యాన్సరు కారక ఉత్పన్నాలు కూడా వచ్చి చేరతాయి. ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. సాధారణంగా ఉదయం కాసేపు ఎండలో నడిచినా లేదా సాయంత్రం ఎండ ఉన్నప్పుడు కొన్ని నిముషాలు ఉన్నా మనకు అవసరమైనంత 'డి' విటమిన్‌ లభిస్తుంది.

'డి' విటమిన్‌ లోపిస్తే ఎముకలకు సంబంధించిన లోపాలు వస్తాయి. ఇందులో ప్రధానమైంది 'రికెట్స్‌' chole calciferol అనే పేరుతో D3 విటమిన్‌ సూర్యరశ్మి సమక్షంలో చర్మంలో కొలెస్టరాల్‌ నుంచి తయారవుతుంది. ఇది ఆహారం ద్వారా కూడా దొరుకుతుంది. ergo calciferol కూడా దొరుకుతుంది. D2 విటమిన్‌ మాత్రం సూర్యరశ్మి సమక్షంలో సాధారణంగా లభ్యం కాదు. దీన్ని ఆహారం ద్వారా పొందాల్సిందే. ఈ రెండింటిని కలగలిపి D విటమిన్‌ అంటాము. ఈ విటమిన్లు ఎముకలు సమగ్రంగా, సక్రమంగా పెరిగేలా దోహదపడతాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ) 
  • ===========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, November 23, 2014

Sweating in Himalayas? - హిమాలయాలలో ఉన్నవారికి చెమట పోస్తుందా?.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
 ప్ర : హిమాలయాలలో ఉన్నవారికి చెమట పోస్తుందా?.

జ : పోస్తుంది కాని కనబడదు . మనిషి క్షీరద విభాగానికి చెందిన జీవి కాబట్టి శరీరము మీద స్వేదగ్రంధులు తప్పకుండా ఉండాయి. క్షీరదాలు తమ శరీర ఉష్ణోగ్రతను స్థిరముగా ఉంచుకునేందుకు శరీరము నుండి  నీటిని చెమట రూపములో బయటకు పంపుతుంటాయి. అది నిరంతరము జరిగే ప్రక్రియ . వేడి ప్రాంతం లోవారికి కనిపించినంత అధికం గా చెమట బయటకు  కనిపించకపోయినా హిమాలయాలలో ఉండేవారికీ చెమట పోస్తుంది. ఆ చలి ప్రాంతలలోవారి చెమట వెంట వెంటనే గాలిలో కలిసిపోతుంది. కాబట్టి చెమట పోయడమనే సహజ లక్షణము ఎటువంటి వాతావరణము లో ఉన్నప్పటికీ కొనసాగుతునే ఉంటుంది.
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why that difference in Milk and Butter milk,పాలు-మజ్జిగల్లో ఆ తేడా ఏల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  



ప్రశ్న: మజ్జిగలో కలిపిన నీరు కాసేపయ్యాక పైన తేటగా తేలుతుంది. మజ్జిగ తెలుపు కింద పేరుకుంటుంది. కానీ పాలలో నీళ్లు పోస్తే నీరు ఎప్పటికీ పైకి తేలదు ఎందుకని?

జవాబు: ఇద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం ఏర్పడితే వారిద్దరూ పాలు నీళ్లలాగా కలిసిపోయారు అంటూ సామెత కూడా ఉంటుంది. గతంలో పలుమార్లు చెప్పుకున్నట్లు పాలు ఓ కొల్లాయిడ్‌ తరహా మిశ్రమ పదార్థం. అధిక భాగం నీరే ఉన్నా అందులో ఉన్న మిగిలిన పీలిక పదార్థాలు, తైల బిందువుల మీద సూక్ష్మ స్థాయిలో విద్యుదావేశం ఉండటం పరస్పర వికర్షణ ద్వారా అవి చెల్లాచెదరుగా పాల భాగం మొత్తం సమానంగా విస్తరించి ఉంటాయి. తోడు వేసి పెరుగుగా మార్చితేగానీ, లేదా ఉప్పు వేసి పాలు విరిగేలా చేస్తేగానీ లేదా నిమ్మరసం పిండి విరిగేలా చేస్తేగానీ పాలలోని కొల్లాయిడల్‌ తత్వం పోదు. కానీ మజ్జిగ అంటేనే చిలికిన పెరుగు. పెరుగు అంటనే పాలలో ఈస్ట్‌ బాక్టీరియా విడుదల చేసిన రసాయనాల వల్ల కొల్లాయిడల్‌ తత్వం పోగొట్టుకొని పాలలోని పాల పదార్థాలు గడ్డకట్టుకున్న స్థితి. కాబట్టి అటువంటి పెరుగును చిలికి మజ్జిగ చేసినా కొల్లాయిడల్‌ తత్వాన్ని (విద్యుదావేశాల్ని) పోగొట్టుకున్న పాలలోని పదార్థాలు భూమ్యాకర్షణ వల్ల కిందికి ఎప్పడికపుడు జారుకుంటాయి. కానీ అంతటా వ్యాపించి ఉన్న నీరు పైకి తేరుకున్నట్టు అనిపిస్తుంది.

పాలస్థితిలో అందులోని పదార్థాలకు విద్యుదావేశం ఉండటం వల్ల కలిగే కొల్లాయిడల్‌ తత్వం వల్ల నీరు ఎంత పోసినా సమంగా విస్తరించి ఉంటాయి. కానీ మజ్జిగలోని పాల పదార్థాలకు విద్యుదావేశం లోపించడం వల్ల కొల్లాయిడల్‌ తత్వాన్ని పోగొట్టుకుని భూమ్యాకర్షణ వల్ల కిందికి చేరుకుంటాయి. ఇదే తేడా.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, November 20, 2014

పాలు మరిగిస్తే ఎందుకు పొంగుతాయి? నీళ్లు ఎందుకు పొంగవు?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 నీళ్లు పొంగవేం?

ప్రశ్న: పాలు మరిగిస్తే ఎందుకు పొంగుతాయి? నీళ్లు ఎందుకు పొంగవు?

జవాబు: పాలు పొంగడం అంటే పాలలో అధిక మోతాదులో ఉన్న నీళ్లే పొంగుతాయన్న విషయం తెలుసుకోవాలి. పాలు నిర్దిష్టమైన ఒకే పదార్థం కాదు. ఉప్పు లాగా, చక్కెరలాగా, క్లోరోఫారంలాగా, ఆక్సిజన్‌లాగా అది ఒక శుద్ధమైన సంయోగ పదార్థమో, మూలకమో కాదు. పాలు ఓ మిశ్రమ పదార్థం. అలాగని ఉప్పు నీళ్లలాగా, చక్కెర ద్రావణంలాగా సోడా బాటిల్‌లోని నీళ్లలాగా సమసంఘటన ద్రావణం కూడా కాదు. పాలను కొల్లాయిడ్‌ తరహా మిశ్రమ పదార్థం అంటారు. అంటే అందులో ద్రావణి అయిన నీటితోపాటు, కరిగిన కొన్ని లవణాలు, చక్కెరలతో పాటు కరగకుండా పాలలో అన్ని వైపులకూ విస్తరించి ఉన్న పెద్దపెద్ద అణువులు, ప్రోటీన్‌ పీలికలు, జీవ రసాయన బృహదణువులూ ఉంటాయి.

వీటికి తోడుగా చక్కెర గుళిక మీద చీమలు గుమిగూడినట్టు చిన్నపాటి నీటి బిందువుల చుట్టూ పాతుకుపోయిన తైల కణాలు, తైల బిందువుల చుట్టూ ఇదే విధంగా పేరుకున్న నీటి బిందువులు ఉండే సమూహాలు కూడా ఉంటాయి. ఇలాంటి సమూహాలను మైసెల్స్‌ అంటారు. ఇలా ఎన్నో పదార్థాల సమ్మిశ్రణమే పాలు. ఇలాంటి పాలను వేడి చేసినప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్‌కు దాటే సమయంలో పాలలోని నీరు ద్రవస్థితి నుంచి వాయు స్థితిగా మారే క్రమంలో బుడగలు ఏర్పడతాయి. అయితే పాలలో వివిధ పదార్థాలు ఉండటం వల్ల పాలలో ఉష్ణం అన్ని వైపులకు ఒకేవిధంగా విస్తరించదు. క్రింద భాగాన అధిక వేడి పైభాగంలో తైల బిందువులు తేలడం వల్ల తక్కువ వేడి ఉంటుంది. కాబట్టి కిందనే మొదట ఏర్పడ్డ నీటి ఆవిరి బుడగలు తమపై ఉన్న పాలభాగాన్ని నెట్టుకుంటూ పైకి వెళతాయి. అందువల్లే పాలు పొంగుతాయి. కానీ నీటి విషయం అలా కాదు. నీరు శుద్ధమైన ద్రావణి కాబట్టి ఉష్ణం అన్ని వైపులకూ ఉష్ణ సంవహనం అనే పద్ధతిలో చేరడం వల్ల నీటిలో అన్ని భాగాల్లోనూ బుడగలు వస్తాయి. కాబట్టి పొంగకుండానే పైనున్న బుడగలు గాలిలో కలుస్తుంటాయి.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ============================

Calender papers fly up why?,క్యాలెండర్‌ కాగితాలు మాత్రం పైకే ఎగురుతాయెందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !..


ప్రశ్న: ఫ్యాన్‌ గాలి పైనుంచి కిందకు వీస్తున్నా క్యాలెండర్‌ కాగితాలు మాత్రం పైకే ఎగురుతాయి. ఎందుకు?

జవాబు: ఇలా జరగడానికి కారణం గాలి వస్తువులపై ప్రయోగించే పీడన ప్రభావమే. ఉదాహరణకు రెండు ఆపిల్‌ పళ్లను సన్నని దారాలతో ఒకదాని పక్కన మరొక దానిని వేలాడదీసి వాటి మధ్యన ఉండే ఖాళీ స్థలంలో గాలిని వూదితే, ఆ పండ్లు రెండు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరుగుతాయని అనుకొంటాం. కానీ, నిజానికి అవి రెండూ దగ్గరగా వస్తాయి. గాలి వూదడం వల్ల అంతక్రితం ఆపిల్స్‌ మధ్య ఉన్న గాలి తొలగిపోయి తాత్కాలికంగా అక్కడ కొంత శూన్యం ఏర్పడుతుంది. ఆ శూన్యాన్ని నింపడానికి పక్కల ఉన్నగాలి తోసుకు వస్తుంది. ఆ గాలి తనతోపాటు ఆపిల్స్‌ను కూడా దగ్గరగా తెస్తుందన్నమాట.

ఫ్యాన్‌ నుంచి గాలి వీస్తున్నపుడు కూడా ఇదే సూత్రం క్యాలెండర్‌ కాగితాలపై వర్తిస్తుంది. పైనుంచి వేగంగా వచ్చే ఫ్యాన్‌ గాలి క్యాలెండర్‌ పేపర్ల వద్ద అంతకు ముందున్న గాలిని తొలగిస్తుంది. ఆ ప్రదేశంలో పీడనం తగ్గడం వల్ల క్యాలెండర్‌ కిందవైపు ఉండే గాలి అక్కడకు వస్తుంది. కింద నుంచి గాలి పైకి వచ్చినపుడు తేలికగా ఉండే క్యాలెండర్‌ కాగితాలు పైకి లేచి రెపరెపలాడుతుంటాయి.

- ప్రొ|| ఈవీ. సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ============================

Magnatic Trains move -మాగ్నటిక్‌ రైళ్లు చక్రాలు లేకుండానే ఎలా నడుస్తాయి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: మాగ్నటిక్‌ రైళ్లు చక్రాలు లేకుండానే ఎలా నడుస్తాయి?

జవాబు: మామూలు రైళ్లు పట్టాల మీద ఆనడం వల్ల పట్టాలకు రైలు చక్రాలకు మధ్య ఏర్పడిన ఘర్షణను చక్రం తిరగడం ద్వారా అధిగమిస్తారు. అందుక్కావలసిన శక్తిని ఇంధనం ద్వారా లేదా సరాసరి విద్యుత్తు ద్వారా పొందుతారు. చక్రాలు గుండ్రంగా ఉండటం వల్ల పట్టాలకు ఆనిన భాగం స్వల్పంగానే ఉంటుంది. ఘర్షణ అనేది మనకు ఆటంకం. దాని విలువ అంటుకొని ఉన్న వస్తువుల మధ్య అంటుకున్న వైశాల్యాన్ని బట్టి పెరుగుతుంది. చక్రాలు పట్టాలకు తాకిన ప్రాంతపు వైశాల్యం తక్కువగా ఉండటం వల్ల ఘర్షణ బలం కొంతలో కొంత తగ్గినట్టే.

కానీ బండి జరగాలంటే చక్రం తిరగాలి. అందుకోసమే శక్తి అవసరం. మాగ్నటిక్‌ రైళ్లలో రైలు బండి చక్రాల ఆధారంగా పట్టాల మీద నిలబడదు. రైలు పట్టాలకు రైలు బండి అడుగున ఉన్న చక్రాల స్థానే ఉన్న పట్టీలకు ఒకే ధృవత్వం ఉన్న అయస్కాంత తత్వాన్ని విద్యుశ్చక్తి ద్వారా ఏర్పరుస్తారు. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయని మీరు చదువుకున్నారు. పట్టాల అయస్కాంత ధృవత్వం, రైలు అడుగున ఉన్న విద్యుదయస్కాంత పట్టీల అయస్కాంత తత్వం ఒకేవిధంగా ఉండటం వల్ల ఏర్పడిన వికర్షణ రైలు మొత్తంగా పట్టాల నుంచి కొన్ని మిల్లిమీటర్ల మేరపైకి తీస్తుంది. దీన్నే అయస్కాంత ఉత్‌ప్లవనం అంటారు. ప్రత్యేక పద్ధతిలో పట్టాలకు, పట్టీలకు మధ్య ఏర్పడిన వికర్షణ బలాన్ని మార్చడం ద్వారా రైలు ముందుకు వెళ్లేలా ఏర్పాటు ఉంటుంది. మామూలు రైలు పట్టాల్లాగా ఈ మాగ్నటిక్‌ రైలు బండి పట్టాలు సాఫీగా అవిచ్ఛిన్న రేఖలాగా కాకుండా విచ్ఛిన్నంగా ఉండటం వల్ల ఇలా చలనం వీలవుతుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ==========================

Where did mosquitos go in winter?-చలికాలము లో దోమలు ఎక్కడికి పోతాయి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : -చలికాలము లో దోమలు ఎక్కడికి పోతాయి?

జ : చలికాలము లో దోమలు ఎక్కడికీ పోవు . చలి ఎక్కువగా ఉన్నప్పుడు వాతావరనము సరిపోక దోమలు ఎటో పారిపోతాయనుకుంటాము కాని నిజానికి అవి ప్రతికూల పరిస్థితులనుండి  తప్పించుకునేందుకు దాక్కుంటాయి. ఎక్కువగా ..వేడిగా ఉన్న మన బెడ్ రూములలోనే నివాసాలు ఏర్పరచుకుంటాయి. వీలైతే మనకు కుట్టడానికి ప్రయత్నిస్తాయి. చలికాలము ముందు పెట్టిన గుడ్లు పొదగబడక అలాగే ఉంటాయి. ప్యూపా దశకు చేరినవి అలాగే నిలబడతాయి.  ఇక పెడ్ద దోమలయితే గోడలకు అంటిపెట్టుకుని అటూ ఇటూ ఎగరక శరీరములో నిలువ చేసునివున్న శక్తిని వినియోగించుకుటాయి. తిరిగి చల్లని ఉష్ణోగ్రత పోయి అనుకూల పరిస్థితులు రాగానే గుడ్లు , ప్యూపాల నుండి దోమలు పుట్టుకొస్తాయి.
  •  ====================

Nalleru pai nadaka?-నల్లేరు పై బండి నడక అంటే ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : నల్లేరు పై బండి నడక అంటే ఏమిటి?
జ : నల్లేరు మీద నడక---అతి సులబమైన పని అని అర్థం.
వివరణ:..... బండి నడిచే దారిలో నల్లేరు అడ్డంగా వుంటే బండి నడకకు అడ్డమేమి కాదు. దాన్ని తొక్కు కుంటూ అతి సులబంగా బండి పెళ్లి పోతుంది. గ్రామాలలో రహదారులు తినంగా ఉండక బాగా గోతులతో అధ్వాన్నము గా ఉండేవి . అటువంటి గోగులలో బండి నడకకు అవరోధము గా ఉన్నాప్పుడు ఆ గోతులలొ నల్లేరును పడేసేవారు. ఆ తీగలను వేయడం ద్వారా బండి నడక సాఫీగా సాగిపోవడము వల్ల ... అనాయాసం గా జరిగే కార్యాలకు ఆవిధంగా " నల్లేరు పై బండి నడక " అనడం అలవాటుగా మారింది
.
  • ===========================

Saturday, November 15, 2014

Do Suras are only 3 crores?- దేవతలు మూడుకోట్లుమందే ఉంటారా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

ప్ర : Do Suras are only 3 crores?- దేవతలు మూడుకోట్లుమందే ఉంటారా?.

జ : దేవతలు కష్యపు మహాముని 14  రకాల సంతానములో ఒక జాతి. అధితి-కష్యపమునికి పుట్టిన సంతానము .దేవలోక నివాసులు . ఈ పద్నాలు లోకాలూ జంబూ ద్వీపములో ఉన్నవే.

ఒకానొక సందర్భము లో చేవతలకు ఇకమీదట సంతానము కలుగరాదని " పార్వతీ దేవి " శపించినది. ఆ కారణముగా అప్పటికే ... అంతకుపూర్వమే సంతానము కలిగి ఉన్నవారు తప్ప ఆ పైన దేవతలకెవరికీ సంతానము లేకుండా పోయింది. కాబట్టి ఆనాటి తర్వాత దేవతల సంఖ్య పెరిగే అవకాశము లేదు. మంకున్నది మూడుకోట్లు దేవతలు కాదు .? 33 కోట్ల మంది దేవతలు.
  •  మూలము : స్వాతి వారపత్రిక తేదీ. 21-11-2014 (అనిల్ స్వాతి).
 దేవతలు అమృతము తాగి చావులేకుండినవారైనందున సంతానము లేకుండా ఉండడమే మేలు . పుట్టుక ఉండి ..చావు లేకపోతే   వారి జనాభా పరగడమే కాని తరగడమంటూ ఉండదు. నేడు దేవతలు ఉన్నారా? లేరా? అనేది ఎవరికీ తెలియని రహస్యము .. ఇది ఒక నమ్మకము మాత్రమే.  జీవ పరిణామ క్రమములో కాలగర్భములో కలిసిపోయారేమో?

  • -=======================

Sunday, November 09, 2014

అంతరిక్ష వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: అంతరిక్షంలోని గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి?

జవాబు: అంతరిక్షంలోని ఏ ఖగోళ వస్తువు ఆకారాన్నైనా నిర్ణయించేది అది ఏ పదార్థాలతో నిర్మితమై ఉంది అనే విషయంపైనే కాకుండా దాని ద్రవ్యరాశిపై తద్వారా ఉత్పన్నమయ్యే గురుత్వం (Gravity) పై కూడా ఆధారపడి ఉంటుంది. వాయువులేక ద్రవ పదార్థాలతో కూడుకున్న గ్రహాలు, గోళాకారంలో రూపొందుతాయి. కారణం దానిపై గురుత్వం అన్ని దిశలలో ఒకే రకంగా, సమానంగా పనిచేయడమే. భూమి తొలుత ద్రవ రూపంలోనే ఉండేది. అదే వాటి అంతర్భాగాలు అప్పటికే రాతితో నిర్మితమయి ఉంటే, గురుత్వ బలంకన్నా బరువైన రాయి ప్రయోగించే బలం ఎక్కువవడంతో 'ఆస్టరాయిడ్ల' లాంటి లఘు గ్రహాలు గోళాకారంలో కాకుండా ఒక క్రమంలేని విచిత్రమైన ఆకారాలు కలిగి ఉంటాయి. కానీ ఆస్టరాయిడ్ల వ్యాసం 800 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటే దాని గురుత్వం తగినంత బలం కలిగి ఉండడంతో అది చాలా వరకు గోళాకారాన్ని కలిగి ఉంటుంది. దీనికి 970 కిలోమీటర్ల వ్యాసం ఉండే లఘు గ్రహం 'సిరీస్‌' మంచి ఉదాహరణ.

తమ చుట్టూ తాము అతి వేగంగా తిరిగే ఖగోళవస్తువులు కచ్చితమైన గోళాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారం (Elliptical form) కలిగి ఉంటాయి. దీనికి కారణం వాటి పరిభ్రమణ వేగం వాటి విషువద్రేఖ (Equator) దగ్గర ఎక్కువగా ఉండడంతో అక్కడ ఏర్పడిన ఉబ్బు వల్లనే.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ============================

Sea water change to drinking water?,సముద్రపు నీటిని మంచినీరుగా మార్చగలమా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న : సముద్రపు నీటిని మంచినీరుగా మార్చగలమా?

జవాబు: కోట్లాది సంవత్సరాలుగా వర్షపు నీరు నదుల్లోనూ, వర్షపాత ప్రాంతాల్లోనూ ఉన్న వివిధ లవణాలను మోసుకెళ్లి సముద్రంలో కలపడం వల్ల సముద్రపు నీరు ఉప్పుమయం అయ్యింది. సముద్రపు నీరు తాగు, సాగునీరుగా పనికిరాదు. ఇలాంటి నీరు తాగితే జీర్ణవాహిక పొడవునా ఉన్న కణాల్లోని నీరు ద్రవాభిసరణం (Osmosis) ద్వారా తాగిన ఈ ఉప్పు నీళ్లలో కలుస్తుంది. తద్వారా జీర్ణవాహిక తన నిర్మాణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పైగా సముద్రపు నీటిలో ఉన్న కొన్ని నిరింద్రియ లవణాలు రక్తంలో కలిస్తే మన జీవ భౌతిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. వ్యవసాయానికి ఈ నీరు పారితే పొలంలో ఉన్న సారాన్ని హరించి వేస్తాయి. పంటలు సరిగా పండవు.

సముద్రంలో ఉన్న నీటి మొత్తాన్ని మంచినీరుగా మార్చడం వీలుకాదు. కానీ సముద్రపు నీటిని తక్కువ మోతాదులో 'రివర్స్‌ ఆస్మోసిస్‌' ద్వారా మంచి నీటిగా మార్చగలం. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని. అయితే రివర్స్‌ ఆస్మాసిస్‌, స్వేదన ప్రక్రియల ద్వారా ఉప్పునీటిని మంచినీటిగా మార్చే అవకాశం శాస్త్రీయంగా ఉంది.

మనం తాగే నీరు, సాగు నీరు వర్షాల నుంచి వచ్చిందే. వర్షాలు సముద్రపు నీటి నుంచి వచ్చే మేఘాల నుంచే కాబట్టి సముద్రంపై నీరు పరోక్షంగా ప్రకృతి వరప్రసాదంగా, మంచి నీరుగా మారినట్టే కదా!

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,-జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===================================

How do fish not hitting walls ,చేపల తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: చేపల తొట్టెలో చేపలు వేగంగా తిరుగుతున్నా అవి ఆ తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి?

జవాబు: చేపలకు నీటిలో కదలికల వల్ల కలిగే ప్రచోదనాలను (Impulses) గుర్తించగల అతీంద్రయ శక్తి ఉంది. ఈ శక్తికి కారణమైన జ్ఞానేంద్రియం చేపల దేహంలో వాటి కంటి నుంచి తోక చివరి వరకు ఒక రేఖా రూపంలో వ్యాపించి ఉంటుంది. దీనిని 'పార్శ్వరేఖ' అంటారు. ఈ రేఖ అతి చిన్న రంధ్రాలు కలిగి చేపల దేహంలో ఒక పాలిపోయిన గీత రూపంలో ఉండి చేపల చర్మం కింద సన్నని గొట్టాల రూపంలో ఉండే న్యూరోమాస్ట్స్‌ అనే జీవకణాలతో కలుపబడి ఉంటుంది. ఈ కణాలు నీటిలో ఉత్పన్నమయ్యే అతి స్వల్పమైన కంపనాలను, కదలికలను చేపలు గ్రహించేటట్లు చేస్తాయి. అందువల్లే చేపల తొట్టెలో అవి ఎంత వేగంగా ఈదుతున్నా తొట్టె గోడలకు ఢీకొనకుండా ఉంటాయి. మురికి నీటిలో కూడా అవి వాటి మార్గాలకు అడ్డంకులు తగలకుండా ముందుకు పోగలుగుతాయి. ఈ అతీంద్రయ శక్తి వల్లే వాటిి సమీపానికి వచ్చే హానికరమైన ప్రాణుల లేక ఆహారానికి పనికి వచ్చే వాటి ఉనికిని, పరిమాణాన్ని అంచనా వేయగలవు.

  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ================================

Electricity in Trains?,రైళ్లలో విద్యుత్‌ ఎక్కడి నుంచి వస్తుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:
రైళ్లలో ఫ్యాన్లకు, లైట్లకు విద్యుత్తు ఎక్కడి నుంచి వస్తుంది?


జవాబు: మన ఇళ్లలో ఉన్న ఫాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు కొంత తేడా ఉంది. ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు సుమారు 230 వోల్టుల విద్యుత్‌ శక్మం ఉన్న ఆల్టర్నేటింగ్‌ కరెంటు(ac) తరహా విద్యుత్‌లో నడుస్తాయి. రైళ్లు స్టేషన్‌లో ఆగి ఉన్నా లోపలున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఫ్యాన్లు తిరగాలి కాబట్టి బ్యాటరీల ద్వారా నడిచే ప్రత్యక్ష విద్యుత్‌ (direct current)లో నడిచేలా ఉంటాయి.

వీటిని 'మోటార్లు' నడిపిస్తాయి. రైలు పెట్టెల కింద చాలా బ్యాటరీలు శ్రేణిలో కలిపి ఉంటాయి. రైలు నడుస్తున్నపుడు ఇరుసులకు సంధానించుకున్న విద్యుదుత్పత్తి సాధనాలు లేదా డైనమోలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా ఆ విద్యుత్‌తో ఎప్పటికపుడు బ్యాటరీలను ఛార్జ్‌ చేస్తారు. లైట్లు కూడా ఇదే బ్యాటరీల విద్యుత్‌తో నడుస్తాయి. ఆధునిక రైళ్లలో లెడ్‌ స్టోరేజి బ్యాటరీలకు బదులుగా ఘనస్థితి బ్యాటరీలను వాడుతున్నారు.

  • ============================

Saturday, November 08, 2014

కొయ్యను కరిగించవచ్చా?,కొయ్య ద్రవరూపంలో ఉంటుందా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... కొయ్యను

ప్రశ్న:
కొయ్య ద్రవరూపంలో ఉంటుందా?

జవాబు: ప్రకృతి సహజమైన కొయ్యను కరిగించడానికి వీలు లేదు. అది మామూలు ద్రావకాలలో కూడా కరగదు. కానీ ఈ మధ్య ద్రవరూపంలో ఉండే కొయ్యను శాస్త్రజ్ఞులు రూపొందించారు. దీనితో లౌడ్‌ స్పీకరు పెట్టెల నుంచి పెన్సిళ్లు, తుపాకీ మడమలే కాకుండా అనేక వస్తువులను తయారు చేస్తారు. ఈ పదార్థంలో ఉండే ప్రధాన అంశం కొయ్యలో ఉండే 'లిగ్నిన్‌' అనే పాలిమర్‌. లిగ్నిన్‌ మొక్కలలో ఉండే కణాలకు స్థిరత్వాన్ని సమకూరుస్తుంది. కాగితపు పరిశ్రమలో వాడే కొయ్య నుంచి లిగ్నిన్‌ను వ్యర్థపదార్థం కింద తీసేస్తారు. ఎందుకంటే ఇది కాగితానికి అవసరం లేని పసుపు రంగును ఇస్తుంది. అలా తీసేసిన లిగ్నిన్‌ను ప్రకృతి సహజమైన నారు, పీచు, వివిధ రంగులతో కలపడంతో అది ఒక జిగురు పదార్థంగా ఏర్పడుతుంది. అదే ద్రవరూపంలో ఉండే కొయ్య.

  • - ప్రొ|| ఈవీ.సుబ్బారావు,-హైదరాబాద్ఎ
  • =========================

How pus is formed?,చీము ఎందుకు వస్తుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •   

  •  
ప్ర : Why do pus come out?,చీము ఎందుకు వస్తుంది?

: గాయము తగిలితే రక్తము కారుతుంది . తదుపరి రక్తము గడ్డకట్టి రక్తప్రవాహము ఆగిపోయేలోగానే గాయమైన ప్రాంతము లోకి పలు సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. ఆ సూక్ష్మజీవులు శరీరములో చేరి దెబ్బతీయకుండా చూసే బాద్యత రక్తములోని తెల్లరక్తకణాలది. ఇవి సూక్ష్మజీవులతొ చేసే పోరాతములో కొన్ని తెల్లరక్త కణాలు మరణిస్తాయి. వీటితోపాటు గాయం ప్రాంతములోని మృతకణాలు జతకూడుతాయి. ఇదంతా బయటకు పోయే ప్రయత్నమే చీము కారడము . లిక్విడ్ ప్యూరిన్‌(liquid purin) అనే ద్రవముతో పాటు మృతకణాలు బయటికి పంపబడతాయి. ఆ ద్రవము పసుపు రంగులో ఉంటుంది. . కాబట్టి చీము పసుపు రంగులో ఉండును .
  • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, November 07, 2014

Brahma and brahmachari relation?,బ్రహ్మ కు బ్రహ్మచారులకు సంబంధమేమిటి?.

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : బ్రహ్మ కు బ్రహ్మచారులకు సంబంధమేమిటి?.

 జ : త్రిమూర్తులలోని వాడు , సరస్వతీ నాధుడు అయిన బ్రహ్మదేవునికీ , బ్రహ్మచారికి సంబంధము లేదు. వేద , ఉపనిషత్ .. ప్రతిపాధిత మయిన  బ్రహ్మపదార్ధమనే  మహాతత్వానికి  సంబంధించి ఈ బ్రహ్మచారి అనే శబ్ధాన్ని వాడడము జరిగింది.  ఆ బ్రహ్మపదార్ధాన్ని తెలుసుకొనే అన్వేషణా మార్గములో ఉన్నాడనే అర్ధముతో బ్రహ్మచారి అనే పదప్రయోగము చేశారు.
  • ==================

Thursday, October 30, 2014

కార్తీకం లో ఎక్కువ చలిలో కూడా చల్నీటి స్నానాలు ఎందుకు చేస్తారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  
ప్ర : కార్తీకం లో ఎక్కువ చలిలో కూడా చల్నీటి స్నానాలు ఎందుకు చేస్తారు? ,స్నానాలు ఎన్ని రకాలు?.

జ : స్నానము అనేది శరీర శుభ్రతకోసము . అది ఏకాలమౌలో చేసినా ఏవిధముగా చేసినా అంతిమ ఉపయోగము ఆరోగ్యము కాపాడుకోవడమే.

ఉదయానే దేహాన్ని శుభ్రం చేసుకోడానికి స్నానం చేస్తాం. నిజానికి శుచితో బాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న ఉష్ణశక్తి ని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి ఉష్ణశక్తి ని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి ఉష్ణశక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది.

మనలో నిరంతరం విద్యుత్తు(ఉష్ణశక్తి) ప్రవహిస్తూ, విద్యుచ్ఛక్తి(ఉష్ణశక్తి) కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి(ఉష్ణశక్తి) ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న విద్యుచ్ఛక్తి(ఉష్ణశక్తి) ఎక్కువగా బయటకు పోతుంది. శరీరంలో విద్యుచ్ఛక్తి కొత్తగా తయారౌతూ, బయటకు పోతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "electro-magnetic activity” అంటారు.

భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు ... సముద్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. కార్తీక మాసంలోను ... పుష్కారాల సమయంలోను నదీ స్నానాలు పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదనే నియమం కనిపిస్తోంది. అలాగే నదుల్లో కూడా స్నానం చేయునప్పుడు పాటించవలసిన నియమాలను కూడా శాస్త్రం చెబుతోంది.

రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో గానీ ... సముద్రాలలో గాని స్నానం చేయకూడదు. ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించిన తరువాతే స్నానం చేయవలసి వుంటుంది. స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ ... పిండటంగాని చేయకూడదు. అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు. శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి. లేదంటే కొత్త పాపాలు తలకెత్తుకోవలసి వస్తుందనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు.

కార్తీకములో పుణ్యమకోసము స్నానాలు చేసే స్నాన విధాలు ;

1 . దివ్య స్నానం:-
ఉత్తరాయణం లో ఎండ తో పాటు , వాన కురుస్తున్నప్పుడు నిలిచి స్నానం ఆచరించటం .

2. ధ్యాన స్నానం :-
గంగ, యమున , సరస్వతి మొదలైన పుణ్య నదులను తలచుకొని ఆ జలంతో స్నానం చేయటం .

3. మంత్ర స్నానం :-

మంత్రాలను ఆచరించే స్నానం మృత్తికా స్నానం అంటే మంత్రాలు పఠిస్తూ పవిత్ర ప్రదేశాలనుండి తెచ్చిన మృత్తిక తో ఆచరించిన స్నానం .

4 . మాన స్నానం :-

విభూతిని శరీరం మొత్తం పూసుకొని స్నానం చేయటం దీన్ని మహేశ్వరున్ని స్మరిస్తూ చేస్తారు .

5.వారుణ స్నానము : గోవిందా , హర హర అనో దేవుని తలచుకొని స్నానము చేయుట .

6.కాపిల స్నానము : శరీరము పైబాగాన ఏదైనా గాయము , పుండు ఉన్నచో ... బొడ్డు దిగువ భాగము పాదాలవరకు నీటితో స్నానము చేసి , బొడ్డు పై శరీరభాగాన్ని తడిగుడ్డతో తుడుచు కోవడము .

7.ఆతప స్నానము : శరీరము ఏవిధముగానైనా తడపనీయకుండా అనారోగ్యము చుట్టిముట్టి ఉన్నవారు .. లేదా తీవ్రమైన నీటికొరత ఉన్నప్పుడు .. ఎండలో గోవిందనామము ఉచ్చరిస్తూ కొంతసేపు ఉంటే అది ఆతప స్నానము అవుతుంది.

8. మానస స్నానము : పై స్నాన విధాలు ఏవిధంగాను సహకరించని వారు ... నేను స్నానము చేస్తున్నాను అని భావించి , శరీరము అలా తడుపుతున్న భావనతో ఉండి కొంతసేపయ్యేక పరమేశ్వరుని స్నానము చేస్తూన్న ఓ దృశ్యాన్ని కళ్ళలో ఊహించుకొని చూడగలిగితే చాలు అది మానస స్నానము అవుతుంది.

  • మూలము : డా. మైలవరపు శ్రీనివాసరావు @ స్వాతి వారపత్రిక 31-10-2014.
ఇలా స్నానము చేస్తే పుణ్యము వస్తుందో లేదో గాని . చర్మవ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువే. 




  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do we sneez?,తుమ్ములు ఎందుకు వస్తాయి?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

  •  
ప్రశ్న: తుమ్ములు ఎందుకు వస్తాయి?

జవాబు: మనం నిరంతరం శ్వాసిస్తుంటాం. గాలిలోని ఆక్సిజన్‌ను లోనికి తీసుకుని దానితో మన ఆహారం ద్వారా లభించే గ్లూకోజ్‌ను ఆక్సీకరణం చేయగా విడుదలయ్యే శక్తితోనే మనం అనుక్షణం జీవిస్తున్నాం. ఇంతటి సునిశితమైన శ్వాస ప్రక్రియలో ఊపిరితిత్తులు ప్రధాన పాత్రధారులు.

ఊపిరితిత్తుల్లోకి సాధారణ గాలికి బదులు అవాంఛనీయమైన దుమ్ము, ధూళి, కారపు బిందువులు, నీటి తుంపరుల వంటివి వెళితే అవి ఊపిరితిత్తుల గోడల మీద తిష్టవేసి శ్వాసక్రియకు ఎంతో కొంత భంగం కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి అవాంఛనీయ పదార్థాలు ఊపిరితిత్తుల్ని చేరకుండా చేసే విధంగా మన శ్వాసనాళ నిర్మాణం అమరి ఉంటుంది. పొరపాటున ఏవైనా పదార్థాలు శ్వాస కోశంలోకి వెళ్లినా వాటిని బయటకి పంపేసే వ్యవస్థ ఉంటుంది. ముక్కు ద్వారా గాలివెళ్లే సమయంలో ముక్కు లోపల ఉండే రోమాలు చాలా మట్టుకు అవాంఛనీయమైన దుమ్ముకణాల్ని ఫిల్టర్‌ చేస్తాయి. ఇది దాటి కూడా లోపలికి వెళ్లే పదార్థాలను బయట పడేసేందుకు ఊపిరితిత్తులు బలమైన నిశ్వాసంతో ప్రయత్నిస్తాయి.అదే తుమ్ము.

  • - ప్రొ|| ఎ.రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, -జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =========================

Tuesday, October 28, 2014

ఐస్‌వాటర్‌ గ్లాసు బయట బిందువులేల?

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

ప్రశ్న: గ్లాసులో ఐస్‌వాటర్‌ పోస్తే గ్లాసు బయటి వైపు నీటి బిందువులు ఏర్పడతాయి. ఎందువల్ల?

జవాబు: అతిచల్లగా ఉండే ఐస్‌వాటర్‌ను గ్లాసులో పోసినపుడు ఆ గ్లాసు బయట కనిపించే బిందువులు గాలిలోని నీటి ఆవిరి వల్ల ఏర్పడినవి. గ్లాసులో ఉన్న ఐస్‌వాటర్‌ వల్ల గ్లాసు లోపలి భాగమే కాకుండా దాని ఉపరితలం కూడా చల్లబడుతుంది. ఆ చల్లని ఉపరితలాన్ని గ్లాసు చుట్టూ ఉన్న గాలి తాకినపుడు ఆ గాలిలో ఉండే నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. అలా ఘనీభవించిన నీటి బిందువులు గ్లాసు ఉపరితలాన్ని అంటుకొని ఉంటాయి.

కారులో వెళ్తునప్పుడు వర్షం వచ్చినా ఈ విషయం గమనించవచ్చు. మూసి ఉన్న గాజు తలుపుల మీద చల్లని వర్షం నీరు పడటంతో కారు లోపలివైపు ఉన్న గాజు తలుపుల పై కూడా నీటి బిందువులు ఏర్పడతాయి. కారులో ఉన్న గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించడమే ఇందుకు కారణం.

  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ========================

What happen if seasand used in construction, సముద్రపు ఇసుకతో ఇల్లు కడితే ఏమవుతుంది?

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

ప్రశ్న:
సముద్రపు ఇసుక భవన నిర్మాణానికి పనికి రాదంటారు. ఎందుకు?

జవాబు: భవన నిర్మాణంలో ఇసుక, సిమెంటు, ఇటుకల్ని గోడల నిర్మాణానికి వాడతాం. భవనానికి నిలకడను, ఆయుర్దాయాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చే చట్రంగా పిల్లర్లు, శ్లాబులు ఉపకరిస్తాయి. ఇందుకోసం ఇసుక, సిమెంటుతోపాటు కంకర, ఇనుప కడ్డీలను వాడతాం. ఇవన్నీ సరైన పద్ధతిలో, తగుపాళ్లలో కలిపితేనే భవనానికి దృఢత్వం, ఆయుష్షు సిద్ధిస్తాయి. కంకర, ఇనుప కడ్డీలు కఠినంగా ఉండటం వల్ల స్తంభాలకు, శ్లాబులకు గట్టిదనం వస్తుంది. వాటిని కలిపి బంధించే జిగురు లాంటి పదార్థమే సిమెంటు. కానీ ఇసుక లేకుండా సిమెంటును మాత్రమే వాడినట్లయితే తేలికపాటి ఉష్ణసంకోచవ్యాకోచాలు జరిగినట్లు సిమెంటులో బీటలు ఏర్పడే ప్రమాదం ఉంది.

తద్వారా భవనం కూడా కూలిపోగలదు. అంతేకాదు ఇసుక లేనట్లయితే సిమెంటును చాలా అధికంగా అదనంగా కూడా వాడవలసి ఉంటుంది. కానీ ఇసుకను కలిపినట్లయితే ఆ ఇసుక రేణువులు గట్టిపడిన సిమెంటుతోను, స్తంభాలు, శ్లాబుల్లో ఉన్న కంకర, ఇనుప రాళ్లతోను సంధానమై ఉష్ణవ్యాకోచసంకోచాలు సంభవించినపుడు షాక్‌అబ్సార్బర్స్‌లాగా కుషన్లుగా ఉపకరిస్తాయి. మరి ఆ ఇసుక రేణువుల ఉపరితలం ఎంతగరుగ్గా ఉంటే అంత సమర్థవంతంగా అవి రాడ్లను, కంకరను, సిమెంటును పట్టుకోగలవు. సముద్రపు ఇసుక సైజులో చాలా తక్కువగా ఉండటమే కాకుండా నునుపుగా ఉంటుంది. కాబట్టి సమర్థవంతంగా సిమెంటును సంధానించుకోవు. అందువల్ల ఆ ఇసుక భవన నిర్మాణాలకు వాడరు.

  • - ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,
  • =====================

Difference in tearing paper.why? పేపర్‌ చించడంలో తేడాలేల?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: న్యూస్‌ పేపర్‌ను అడ్డంగా చించడం కంటే నిలువుగా చించడం తేలిక. ఎందుకని?

జవాబు: కాగితం తయారీలో వాడే గుజ్జు రూపంలో ఉండే పీచు, నార, ఖనిజాల వడపోతను మొదటగా ఒక బల్లపై పోస్తారు. ఆ బల్ల ఉపరితలంపై కృత్రిమ పదార్థంతో తయారుచేసిన బోలగా ఉండే తీగ ఒకటుంటుంది. అది యంత్ర సహాయంతో బల్లపై అతి వేగంగా ఒక చివర నుంచి మరో చివరకు తిరుగుతూ ఉంటుంది. బల్లపై పోసిన గుజ్జు తీగ కదలిక వల్ల సన్నని పొరలాగా సమంగా పరుచుకొంటుంది. ఈ పొరపై వేడిగా ఉన్న స్తూపాకారపు రోలర్లను దొర్లించడం ద్వారా ఒత్తిడిని కలుగ జేయడంతో ఆ పొర గట్టిపడి పొడిగా ఉండే సన్నని కాగితంలా తయారవుతుంది.

గుజ్జులాంటి ద్రవాన్ని కొంత ఎత్తులో ఉన్న ఫ్లోబాక్స్‌ ద్వారా బల్లపై వేగంగా కదిలే తీగపై పోయడం వల్ల ఆ గుజ్జులో స్తూపాకారంలో ఉండే పదార్థాల పోగులు తీగ కదిలే దిశలోకే సమంగా పరుచుకొంటాయి. ఈ దిశను యంత్ర దిశ అంటారు. కాగితం పటిష్టత దాని తయారీలో వాడే పదార్థాలు అమరిన దిశపై ఆధారపడి ఉంటుంది. కాగితంలో ఉండే పదార్థాలు యంత్ర దిశలోకే అమరి ఉండడం వల్ల ఈ దిశలో కాగితాన్ని తేలికగా చించవచ్చు. ఈ దిశకు అడ్డంగా ఉండే దిశలో కాగితంలోని పదార్థాలు పక్కలకు ఉండడంతో చించడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాగితం తయారీలో ఎక్కువశాతం ఖనిజాలకన్నా తేలికైన పీచు, నారను వాడడం వల్ల పుస్తకాలను ముద్రించే కాగితాలకంటే సులభంగా యంత్ర దిశలో చించవచ్చు.


  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
==================================

How do we measure purity of milk?,పాల స్వచ్ఛతను ఎలా కొలుస్తారు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : పాల స్వచ్ఛతను ఎలా కొలుస్తారు?

జ :  పాల స్వచ్ఛతను కొలిచే సాధనాన్ని లాక్టో మీటర్‌ అంటారు. ఇది సిలిండర్‌ ఆకారంలో ఉంటుంది. ఒక అంచును బల్బులా ఉండే కొద్దిగా సన్నపాటి ట్యూబ్‌తో ఊదుతారు. ఈ ట్యూబ్‌ రెండో వైపు మూసి ఉంటుంది. దాని పైన ఎం, డబ్ల్యు అనే అక్షరాలు వాటి మధ్య 1, 2, 3, 4 అంకెలు ఉంటాయి. ఈ ట్యూబ్‌ను పాలు ఉన్న సీసాలో ముంచుతారు. దీని పాయింటర్‌ పైకి తేలితే స్వచ్ఛమైన పాలుగా గుర్తిస్తారు.స్వచ్ఛమైన పాలు బరువుగా ఉంటాయి. తర్వాత దీన్ని నీటిలో ముంచుతారు. అపుడు నీటిలో సమాంతరంగా ఉండకుండా డబ్ల్యూ వైపు మొగ్గితే పాలలో నీరు ఉన్నట్టు స్పష్టమవుతుంది. పాలలో పాలు, నీటిశాతం వివరంగా తెలుసుకోవడానికి ట్యూబ్‌పై ఉన్న అంకెలను పరిశీలిస్తారు. పాలలో ముంచినపుడు పాలసీసాలో ఈ ట్యూబ్‌ 'ఎం' దాటి మునిగితే .. అంటే 3 అంకె వరకూ మునిగితే పాలల్లో 75శాతం పాలు స్వచ్ఛమైనవిగా గుర్తిస్తారు. అదే 2 లేదా 1కి స్థాయి చేరితే పాలు స్వచ్ఛమైనవి కాదని నీరు కలిసినట్టుగా గుర్తిస్తారు. లాక్టో మీటర్‌ ను తరచూ ఉపయోగిస్తూ వుంటారు గానీ దీన్ని ఆధారంగా చేసుకుని పాల స్వచ్ఛతను నమ్మడం అనేది అంతగా ఉండదు. సాధారణ పాలు కంటే స్కిమ్‌డు  పాలు ఎక్కువ బరువుగా ఉంటాయి. వీటి విషయంలో స్వచ్ఛతను ఈ పరికరం స్పష్టం చేయలేదు.

  • =======================

Thursday, October 23, 2014

coconut oil solidify in winter why?,చలికాలములో కొబ్బరి నూనె గడ్డకడుతుందెందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : చలికాలములో కొబ్బరి నూనె గడ్డకడుతుందెందుకు?

జ : ఇళ్ళ లో పలురకాల నూనెలు వాడుతుంటాం ... వీటిలో ముఖ్యమైనది తలమీద రాసుకునే కొబ్బరి నూనె , వంటలకు ఉపయోగించే శనగనూనె . వీటిలో కొబ్బరి నూనె చలికాలములో గడ్డకడుతుంది. కారణము అయా నూనెలలో ఉండే కొవ్వు ఆమ్లాలు. కొబ్బరి నూనె లో సంతృప్త కొవ్వు ఆమ్లాలు 90 శాతము వరకు ఉన్నందున ఉష్ణోగ్రత తగ్గగానే గడ్డకడుతుంది. శనగ నూనె లో అసంతృప్త కొవ్వులు అధికము కాబట్టి గడ్డకట్టవు . అసంతృప్త కొవ్వులకు తక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత ఉండగా సంతృప్త కొవ్వులకు ఎక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత ఉండును . నూనెలలో ఈ తేడా కనిపిస్తుంది.
  • ============================