Tuesday, December 25, 2012

What is Entaming and Grooming?,ఎంబామింగ్ మరియు గ్రూమింగ్ అంటే ఏమిటి ?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


అందము గా లేని వారు అందమైన అలంకరణలు చేసుకోవడం, ఆకర్షణీయం గా కనిపించడం కోసము చేసే పక్రియలనే ఎంటామింగ్ మరియు గ్రూమింగ్ అంటారు . ఇదే పక్రయని  చనిపోయినవారి విషములో కడసారి చూపుకోసము మృతదేహానికి సజీవముగా కనిపించేందుకు చేసే మెరుగులు. ఎఫైర్ లలో పడ్డవారు , లేదా పెట్టుకుంటున్న వారు , తమ స్వంత  వేష  ధారణా , వ్యక్తిగత గ్రూమింగ్ అంటే పోషణా , అందం, ఆకర్షణా , ఇట్లాంటి విషయాల మీద , మునుపెన్నడూ లేని శ్రద్ధ  చూపుతారు. లేటెస్టు హెయిర్ స్టయిల్ లు చేయించుకోవడం, జిమ్  కు వెళ్ళడం ,మంచి ఖరీదైన బట్టలు వేసుకోవడానికి ఉత్సాహం చూపడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.

వైద్యరంగము లో

ఎంబామింగ్ అంటే? కొన్ని సందర్భాల్లో మృతదేహాన్ని చాలా రోజులపాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు మృతదేహం కుళ్లిపోకుండా చూడాలి. శరీరం కొంతకాలంపాటు దెబ్బతినకుండా ఉండేందుకు ఎంబామింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని రసాయనాలను ధమనుల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ద్రావకాలనే 'ఎంబామింగ్ ఫ్లూయిడ్స్' అని పిలుస్తారు. ఫార్మాల్డిహైడ్, మెథనాల్, ఇథనాల్‌తోపాటు మరికొన్ని రకాల రసాయనాలను ఈ ప్రక్రియలో వాడతారు. అమెరికాలో ఏటా 2 కోట్ల టన్నుల ఎంబామింగ్ ద్రావకాలు వినియోగిస్తారని అంచనా.  అమెరికాలో ఇప్పుడు ఎంబామింగ్ పద్ధతిలో ఆత్మీయుల మృతదేహాలను వెనువెంటనే కుళ్లిపోకుండా చేయడంలో ముందంజవేశారు. అక్కడ ఏటా 2కోట్ల టన్నుల ఎంబామింగ్ ప్లూయిడ్స్, కెమికల్స్ అమ్ముడవుతున్నాయంటే, ఈ ప్రకియ అవసరం ఎంతగా గుర్తించారో అర్థంచేసుకోవచ్చు. ఎంబామింగ్ ప్లూయిడ్స్ ని ఎక్కించడం వల్ల బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అంటే, ఈ ఫ్లూయిడ్ ఏరకంగానూ బాక్టీరియాకు న్యూట్రియంట్ ఫ్లూయిడ్స్ గా పనిచేయవు.

గ్రూమింగ్ అంటే...
తమ ఆత్మీయులు మరణించినప్పుడు వారి మృతదేహాన్ని కడసారి చూసిన రూపం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ 'తుది జ్ఞాపకం' ఇబ్బందికరంగా కాకుండా, ఎప్పట్లా ఆత్మీయంగానే  ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఈ కోరికను బాడీ గ్రూమింగ్ తీరుస్తోంది. ఇది కూడా ఎంబామింగ్‌లో భాగమే. ఈ ప్రక్రియలో మరణించిన వ్యక్తి అంతకుముందు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు తీసిన ఫొటోను ఉపయోగిస్తారు. జననం ఎంత సహజమో, మరణం అంతే సహజం. కానీ ఈ రెంటినీ ఒకే మోస్తరుగా జీర్ణించుకోలేకపోవడమే సామాన్యుల నైజం. ఇంతకాలం తమమధ్యనే ఉంటూ తమకు వెన్నుదండుగా ఉండే ప్రియతమ వ్యక్తులు ఉన్నట్టుండి హఠాత్తుగా కనుమరుగైనప్పుడు వారి రూపాన్ని మనసులోనేకాకుండా, కళ్లెదుట కూడా ప్రశాంత
వదనంతో కనిపించాలని కోరుకోవడం తప్పేమీకాదు. ఈ తరహా మనోభావాలకు రూపకల్పం ఇస్తున్న `ఎంబామింగ్' ప్రక్రియ నిజంగానే ఓ ఊరట అనే చెప్పాలి

ఎంబామింగ్ నిపుణుడు ఈ ఫొటో ఆధారంగా మృతదేహానికి సాధ్యమైనంతగా మునుపటి రూపాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. బుగ్గలు బాగా లోపలికి వెళ్తే.. మైనపు పూతపూసి ఉబ్బినట్లు చేస్తారు. చాలారోజులపాటు అస్వస్థతకు గురైనవారి కనుగుడ్లు పీక్కుపోయి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్లాస్టిక్ కనుగుడ్లను సహజంగా అమర్చుతారు. శరీరంపై పడిన  ముడతలను తొలగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత... మృతదేహానికి 'సజీవ' రూపం వస్తుంది. దీనినే 'ఫేస్ లిఫ్టింగ్' అని కూడా పిలుస్తారు. అమెరికాలాంటి దేశాల్లో మరణించిన భారతీయుల మృతదేహాలను స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు చాలా రోజులు పడుతుంది. ఈలోపు శరీరాలు కుళ్లిపోకుండా ఉండటంతోపాటు, ఆత్మీయుల బాధను కాసింతైనా తగ్గించేందుకు అమెరికా అధికారులు ఎంబామింగ్, గ్రూమింగ్ చేసిన తర్వాతే మృత దేహాలను తరలిస్తుంటారు.

అమెరికాలాంటి దేశాల్లో దీనికి ప్రత్యేకమైన కోర్సు ఉంది. మన దేశంలో అతి కొద్ది మంది ప్రముఖుల విషయంలో మాత్రమే ఇవి చేస్తున్నారు. మరణానంతరం కూడా సత్యసాయి భక్తులకు  ప్రశాంత చిత్తంతో దర్శనమిస్తున్నారంటే, అందుకు ఈ ప్రక్రియలే కారణం!

  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tears flow in coryza why?-జలువు చేస్తే కన్నీళ్ళెందుకు కారతాయి?

  •  
  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : జలువు చేస్తే కన్నీళ్ళెందుకు కారతాయి?

జ : కంటిలో తేమను కాపాడేందుకు కంటిలో నీరు ఎల్లప్పుడూ ఉతపత్తి అవుతూ ఉంటాయి. ఆ నీరు అధికము గా ఉత్పత్తి అయితే ''లాక్రిమల్ డక్ట్ ''ద్వారా ముక్కులోనికి చేరుతుంది .అక్కడ తేమలో కలుస్తుంది . జలుబు చేసినప్పుడు ముక్కులోని సూక్ష్మరంధ్రాలు మూసుకుపోయి ఆ కన్నీరును ముక్కులోనికి రానీయవు . ఫలితము గా అదనము గా ఉప్తత్తి అయిన కన్నీరు కంటినుండి బయటకి వస్తుంది ... అదే కంటివెంట నీరు కారడము .
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, December 19, 2012

Do have not camel thirsy?-ఒంటెలకు దాహమేయదా?


 


  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఒంటెలు ఎడారులలో చాలా కాలం నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి?

జవాబు: ఒంటెలు తమ వీపుపై ఉండే మూపురాల్లో నీటిని నిల్వ చేసుకుంటాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. వాటి మూపురాల్లో ఉండేది కొవ్వు పదార్థమే. మండుటెండల్లో ఏమాత్రం తడిలేని ఎడారుల్లో కూడా ఒంటెలు అలసట లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకు తగిన శక్తిసామర్థ్యాలను అవి తమ మూపురాల్లో ఉండే కొవ్వు ద్వారానే పొందుతాయి. ఎక్కువ దూరం ప్రయాణించే ఒంటెల మూపురాలలో కొవ్వు కొంత కరిగిపోయి వదులవడానికి కారణం ఇదే. మొత్తం మీద ఒంటెలు ఎడారుల్లో నీరు తాగకుండా రెండు మూడు వారాల వరకు ప్రయాణించగలవు. వాటి ముక్కుల్లో ఉండే సన్నని వెంట్రుకల సాయంతో అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తూ, శరీరం నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటిని భర్తీ చేసుకోగలవు. అలా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను పది డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గించుకోగలవు. నీరు లభించినప్పుడు ఒంటెలు కేవలం కొన్ని నిముషాల్లోనే దాదాపు 100 లీటర్లు తాగగలవు. ఒంటెల రక్తంలోని ఎర్ర రక్తకణాలు గోళాకారంలో ఉండడం వల్ల ఎంత నీరు తాగినా ఆ నీరు విచ్ఛిన్నమయే ప్రమాదం లేదు. అందువల్ల వాటికి ఏ హానీ జరగదు.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Grow more if remove gray or white hair?-తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయా?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా?

జవాబు: ఈ అభిప్రాయంలో నిజం లేదనే చెప్పుకోవాలి. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్‌ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం (epidermis) కింద ఉన్న అంతశ్చర్మం (dermis)లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న సంభావ్యత తక్కువ.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sand seen at the banks of rivers and seas Why?-ఇసుక నదీగర్భాలలోను, సముద్ర తీరాలలోనే దొరుకుతుందేమి?

  •  

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: ఇసుక నదీగర్భాలలోను, సముద్ర తీరాలలోనే ఎందుకు దొరుకుతుంది? వేరే ప్రాంతాల్లో ఎందుకు లభ్యం కాదు?

జవాబు: ప్రతి ఇసుక రేణువు ముక్కలు చెక్కలైన పెద్ద బండరాళ్ల అవశేషంగా భావించాలి. నదీ ప్రవాహంలోను, సముద్రపు అలల వల్లను రాళ్లు పగిలిపోయి మొదటగా గుండ్రాళ్లుగా మారతాయి. అవి మరింతగా పగిలి చిన్న రాళ్లవుతాయి. ఇవి నీటి ఒరవడిలో కొట్టుకుపోతూ క్రమేణా అరిగిపోతూ ఉంటాయి. ఇలా ఇక ఏమాత్రం పగలలేని స్థితికి చేరుకున్నాయంటే ఇసుక రేణువులే అవుతాయి. ఇలా రాళ్లు నిరంతరం నీటి కదలికలకు, రాపిడి గురవడం ఎక్కువగా నదులు, సముద్రాల దగ్గరే జరుగుతుంది కాబట్టి ఆయా తీరాల్లోనే ఇసుక ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడే ప్రదేశాల్లో విపరీతంగా వీచే గాలుల (hot wind blows) వల్ల కూడా బండరాళ్లు నిరంతరం ఒరిపిడికి గురవుతూ ఉంటాయి. ఏళ్ల తరబడి సాగే ఈ ప్రక్రియ ఎడారుల్లో ఉంటుంది. అందుకే అక్కడ కూడా ఎటు చూసినా ఇసుకే కనిపిస్తుంది.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, December 15, 2012

What are the Eight Tourist places in India?-భారతదేశము లో అష్ట యాత్రాస్థలాలు ఏవి?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : భారతదేశము లో అష్ట యాత్రాస్థలాలు ఏవో తెలుసా?

జ : ఇండియాలో చూడవలసిన యాత్రాస్థలాలు ఎన్నో ఉన్నా పురాణాలలో ఎనిమిది స్థలాలను పవిత్రముగాను , దర్శనీయము గాను, పుణ్యప్రదమైనవిగాను చెప్పబడ్డవి . అవి ->...
1.హరిద్వారము,
2. ద్వారక ,
3. మధుర ,
4. బృందావనము ,
5. గోకులం ,
6. పూరీ జగన్నాదక్షేత్రము ,
7. తిరుపతి ,
8. ఉడిపి .
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, December 11, 2012

Sound is morelouder in empty room why?-ఖాళీ గదిలో చప్పుడు ఎక్కువేల?





  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




ప్రశ్న: ఒక వస్తువు కింద పడినప్పుడు మామూలు గదిలో కన్నా, ఖాళీ గదిలో ఎక్కువ శబ్దం వస్తుంది. ఎందుకని?

జవాబు: శబ్దం గాలిలో తరంగాల రూపంలో వ్యాపిస్తుంది. గాలిలో పీడనం, ఉష్ణోగ్రత లాంటి ఎన్నో అంశాలపై శబ్దాల తీవ్రత, వేగం ఆధారపడి ఉంటాయి. గాలిలో అణువులు కదలడం వల్ల ఏర్పడే పీడన సాంద్రతలు (dense zones), విరళీకరణలు (rarifications) క్రమపద్ధతిలో తరంగ రూపాల్లో శబ్దం ప్రయాణిస్తుంది. ఖాళీ గదిలో ఏర్పడే శబ్ద తరంగాలు అన్ని వైపులకు విస్తరించి గోడలు, పైకప్పు లాంటి అవరోధాలను తాకి తిరిగి పరావర్తనం చెంది ప్రతిధ్వనిగా గదిలో పదే పదే తరంగాలను ఏర్పరుస్తాయి. అందువల్ల శబ్దం స్పష్టంగా, తీవ్రంగా వినిపిస్తుంది. అదే మంచాలు, కుర్చీలు లాంటి సామగ్రితో నిండి ఉంటే అవి గదిలో ఏర్పడిన శబ్ద తరంగాలను శోషించుకుంటాయి. కాబట్టి ప్రతిధ్వని రాదు. పైగా సామగ్రి ఉపరితలాలు వంకరటింకరగా ఉండడం వల్ల వాటిని తాకి పరావర్తనం చెందే శబ్ద తరంగాలు చెల్లాచెదరైపోతాయి. అందువల్ల శబ్దం అస్పస్టంగా ఉంటుంది.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Monday, December 10, 2012

Where from those worms?-ఆ పురుగులు ఎక్కడివి?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: చిక్కుడు లాంటి కొన్ని కూరగాయలను వలిచినప్పుడు లోపల పొడవైన ఆకుపచ్చ పురుగులు కనిపిస్తాయి. అవి అక్కడకి ఎలా వెళ్లాయి?

జవాబు: పురుగులు కనిపించిన కాయగూరల పైభాగాన్ని నిశితంగా పరిశీలిస్తే కనీసం ఆవగింజంత రంధ్రాలైనా కనిపిస్తాయి.అలా ఏమాత్రం రంధ్రాల్లేని కాయలు, పండ్లలో పురుగులు ఉండవనే చెప్పవచ్చు. ఈ పురుగులు బయటి నుంచి లోపలికి ఈమధ్య వెళ్లినవి కావు. తల్లి పురుగు తన గుడ్లను ఆ కాయ మెత్తని ప్రదేశాల్లో, దాగుడు (hidden) ప్రాంతాల్లో పెడుతుంది. ఆ గుడ్లలోంచి వచ్చే పిల్లడింభకం(larva) మొదట్లో కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలోనే ఉంటుంది. అది తన వాడి పెదవులు(madibles)తో ఆ కాయకు రంధ్రం చేసి లోపలికి వెళ్లి అక్కడ సుష్టుగా భోంచేస్తూ శరీరాన్ని పెంచుకుంటుంది. ఆ చిన్న దారిలోంచి తన శ్వాసకు కావలసిన గాలి అందుతుంది. అక్కడే ప్యూపా దశ దాటుకుని కీటకంగా మారి బయటకి పోతుంది.

  • - ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

How can we use Lemons as battary?-నిమ్మకాయలను విద్యుత్‌ బ్యాటరీలుగా ఎలా సాధ్యం?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నిమ్మకాయలను విద్యుత్‌ బ్యాటరీలుగా మార్చవచ్చంటారు. అది ఎలా సాధ్యం?

జవాబు: మామూలు బ్యాటరీ ఎలా తయారవుతుందో పాఠాల్లో చదువుకుని ఉంటారు. జింకు, రాగి లాంటి వేర్వేరు సన్నని లోహపు పలకలను (ఎలక్ట్రోడ్లు) సజల సల్ఫ్యూరిక్‌ ఆమ్లము (ఎలక్ట్రోలైట్‌) ఉండే పాత్రలో దూరదూరంగా ఉంచి, వాటి మధ్య చిన్న విద్యుత్‌ బల్బును రాగితీగతో అనుసంధానిస్తారు. దాన్నే విద్యుత్‌ ఘటము (electric cell) అంటారు. కొన్ని విద్యుత్‌ ఘటాల అనుసంధానమే బ్యాటరీ. ఇక్కడి సూత్రం రెండు వేర్వేరు లోహాల మధ్య విద్యుత్‌ శక్తి ప్రవహించడమే.
ఒక నిమ్మకాయలో ఒక ఇనుము లేదా జింకు మేకును, కొంత దూరంలో ఒక రాగి నాణాన్ని గుచ్చి వాటి మధ్య రాగి తీగ ద్వారా ఒక చిన్న బల్బును పెట్టి నిమ్మకాయను గట్టిగా పిండితే బల్బు వెలుగుతుంది. ఇక్కడ నిమ్మరసం ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. కానీ నిమ్మకాయ తగినంత విద్యుత్‌ ప్రవాహాన్ని కలుగజేయదు. కాబట్టి బల్బు వెలిగినా ప్రకాశవంతంగా ఉండదు. అదే ఐదో, ఆరో నిమ్మకాయలను రాగి తీగ ద్వారా కలిపితే బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఆ ఏర్పాటు ఎలక్ట్రిక్‌ బ్యాటరీలాగా పనిచేస్తుంది.

  • -ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Light rays travel very speed how?-కాంతి వేగంగా ప్రయాణించడానికి కారణం ఏమిటి?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కాంతి వేగం సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్లు అని విన్నాను. కాంతి అంత వేగంగా ప్రయాణించడానికి కారణం ఏమిటి?

జవాబు: శక్తి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పలు మార్గాల్లో వెళుతుంది. శక్తి వహనం(conduction), శక్తి సంవహనం (convection), శక్తి వికిరణం (radiation) అనే పద్ధతుల్లో సాధారణంగా శక్తి అధిక ప్రాంతం నుంచి అల్ప ప్రాంతానికి స్వతఃసిద్ధం (spontaneous)గా ప్రవహించడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో మొదటి రెండు పద్ధతుల్లో ప్రయాణించడానికి దానికి ఏదైనా మాధ్యమం (medium) అవసరం. పదార్థాలలోని ఎలక్ట్రాన్లు మధ్యవర్తులుగా శక్తి వహన ప్రక్రియలో ప్రయాణిస్తుంది. సంవహనంలో అణువులు, పరమాణువుల చిందరవందర (random)కదలికల ద్వారా శక్తిని బదలాయించుకుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శక్తిని చేరవేస్తాయి. కానీ వికిరణ ప్రక్రియలో శక్తి ప్రసారానికి మాధ్యమం అవసరం లేదు. కేవలం తనలో ఉన్న విద్యుత్‌ క్షేత్రాన్ని, అయస్కాంత క్షేత్రాన్ని ఒక క్రమపద్ధతిలో కాలానుగనుణంగా మార్చుకుంటూ శూన్యంలో సైతం వెళ్లగలదు. శూన్యంలో కూడా తిర్యక్‌ తరంగాల (transverse waves) రూపంలో విద్యుదయస్కాంత క్షేత్రాల్ని కొన్ని కోట్ల సార్లు మార్చుకుంటూ వెళ్లే శక్తి రూపాన్నే మనం కాంతి అంటాము. కాంతి ప్రయాణానికి పదార్థం అవసరం లేకపోవడం వల్ల అడ్డూఅదుపూ లేకుండా ప్రయాణించే కాంతి శూన్యంలో సెకనుకు 3 లక్షల పైచిలుకు వేగాన్ని సంతరించుకుంటుంది. ఇంత వేగంగా ప్రయాణించేది ఈ విశ్వంలో ఇంకేదీ లేదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;  -రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tears without weaping?-ఏడవకుండా కన్నీళ్ళు వస్తాయా?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


Q : ఏడవకుండా కన్నీళ్ళు వస్తాయా?

A : కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి, వాటిని (lubricate చేసి) తడిగా ఉంచడానికి స్రవించే ద్రవాన్ని అశ్రువులు, కంటినీరు లేదా కన్నీరు అంటారు. ఇలా కన్నీరు స్రవించే ప్రక్రియను వైద్యశాస్త్ర పరిభాషలో lacrimation అంటారు. సాధారణ పదజాలంగా "ఏడవటం" అనే చర్యను ఇది సూచిస్తుంది. దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినపుడు ఇది జరుగుతుంది. చాలా జంతువులలో lacrimation కు అవుసరమైన వ్యవస్థ (శరీర భాగాలు, గ్రంధులు) ఉన్నాయి. అయితే భావోద్వేగాల కారణంగా ఇలా కన్నీరు కార్చే క్షీరదం జాతి జీవి... మానవుడే అని భావిస్తున్నారు.

కనురెప్పలు  కొట్టకుండా టెలివిజన్‌  లేదా కంఫ్యూటర్  తెరవైపు చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇవి ఏడుపుకు సంబంధించి నవి కావు . కనుగుడ్డు తేమకోసము కంటి నీరు ఉత్పత్తి అవుతుంది.  కనురెప్పలు వేయడం ద్వారా ఆనీరు ఒక పలుచని పొరలాగా కనుగుడ్డు పైన విస్తరిస్తుంది . సాధారనము గా నిమిషానికి 10-12 సార్లు మూసి తెరిచే కనురెప్పలు దీక్షగా చూస్తున్నప్పుడు 3-4  సార్లే కొట్టుకోవడము వల్ల కనుగుడ్డు మీద తేమ విస్తరించక కన్నీళ్లుగా కిందికి కారుతాయి.
  • ========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Who are apsarasas?-అప్సరసలు ఎవరు

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




స్వర్గంలో దేవతలను నాట్యగానాలతో అలరించేందుకు నియనించబడీనవారు అప్సరసలు. వీరు సప్త గణాలలో ఒక వర్గము. ఆ సప్తగణాలు: 1. ఋషులు. 2. గంధర్వులు. 3. నాగులు. 4. అప్సరసలు. 5. యక్షులు. 6. రాక్షసులు. 7. దేవతలు. స్వర్గం: ఇది ఎక్కడో ఆకాశంలో ఉందట, దేవుని నమ్మి జీవితమంతా మతాన్ని పాటిస్తూ పాపకార్యాలు చెయ్యకుండా ఉండి, చనిపోయినవారికి మాత్రమే స్వర్గం దొరుకుతుంది. స్వర్గంలో ఆకలి, దప్పులు, ముసలితనము, మరణమూ ఉండవు. వావి, వరుస లాంటి బంధాలు ఉండవు, నిత్య యౌవనంతో అమృత తాగుతూ, రంభ, ఊర్వశి,మేనకా లాంటి, అప్సరసల పొందుతో హాయిగా గడపవచ్చు.

మొత్తము అప్సరసలు ఎంతమందో నాకు తెలియదు గాని పురాణాలలో అందము గా ఉన్న స్వర్గలోక  స్త్రీలను ఇంద్రుడు అప్సరసలు గా బావించే వాడని అంటారు. ఇక్కడ కొంతమంది పేర్లు వ్రాయడము జరిగినది.
  1.     రంభ 
  2.     ఊర్వశి
  3.     మేనక
  4.     తిలోత్తమ
  5.     ఘృతాచి
  6.     సహజన్య
  7.     నిమ్లోచ
  8.     వామన
  9.     మండోదరి
  10.     సుభోగ
  11.     విశ్వాచి
  12.     విపులానన
  13.     భద్రాంగి
  14.     చిత్రసేన
  15.     ప్రమోచన
  16.     ప్రమ్లోద
  17.     మనోహరి
  18.     మనోమోహిని
  19.     రామ
  20.     చిత్రమధ్య
  21.     శుభానన
  22.     సుకేశి
  23.     నీలకుంతల
  24.     మన్మదోద్దపిని
  25.     అలంబుష
  26.     మిశ్రకేశి
  27.     ముంజికస్థల
  28.     క్రతుస్థల
  29.     వలాంగి
  30.     పరావతి
  31.     మహారూప
  32.     శశిరేఖ
తప్పులుంటే సరిచేయండి -- email. . seshagirirao_vandana@yahoo.com

  • మూలము : వికీపెడియా తెలుగు .
  • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, December 09, 2012

Why do stars sparkling?-ఆకాశంలోని నక్షత్రాలు మిలమిలా మెరుస్తుంటాయెందుకు?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఆకాశంలోని నక్షత్రాలు మిలమిలా మెరుస్తుంటాయి. ఎందుకు?

జవాబు: రాత్రిపూట నక్షత్రాలు స్థిరముగా కాక మినుకు మినుకు మంటూ మెరుస్తూఉంటాయి. చంద్రుడు స్పస్టము గా కనిపిస్తున్నప్పుడు నక్షత్రాలు మాత్రము మెరవడానికి కారణము అవి చంద్రుడుకన్నా దూరములో ఉండడమే .     'ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌...' అని పాడినట్టే ఆకాశంలో నక్షత్రాల కేసి చూస్తే అవి మినుకు మినుకుమని మెరుస్తుంటాయి. అయితే భూమి నుంచి చూసినప్పుడే వాటి మిలమిలలు కనిపిస్తాయి. అదే భూవాతావరణాన్ని దాటి అంతరిక్షం నుంచో లేక వాతావరణం లేని చంద్రుడి మీద నుంచో చూస్తే నక్షత్రాలు మెరవవు. అంటే నక్షత్రాల మెరుపులకు కారణం వాతావరణంలో జరిగే మార్పులే.
ఎంతో దూరంలో ఉన్న నక్షత్రాల నుంచి వెలువడే కాంతి కిరణాలు మన కంటిని చేరుకోవడం వల్లనే అవి మనకు కనిపిస్తున్నాయనేది తెలిసిందే. అయితే ఈలోగా అవి మన భూమి వాతావరణంలోని అనేక పొరలను దాటుకుని రావలసి ఉంటుంది. ఈ వాతావరణ పొరలు వివిధ ఉష్ణోగ్రతలు కలిగి ఉండడమే కాకుండా అల్లకల్లోలమైన కదలికలు కలిగి ఉంటాయి. ఆ పొరల గుండా ప్రయాణించే కిరణాలు వికృతీకరణం (distortion) చెందడంతో మన కంటికి మిలమిల లాడుతూ కనిపిస్తాయి.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is induction stove?-ఇండక్షన్‌ స్టౌ అంటే ఏమిటి?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: ఇండక్షన్‌ స్టౌ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?

జవాబు: విద్యుత్‌, అయస్కాంత తత్వాల గురించి పాఠాల్లో చదువుకుని ఉంటారు. ఏదైనా ఇనుప ముక్క చుట్టూ అమర్చిన తీగల్లోకి విద్యుత్‌ను ప్రవహింపజేస్తే ఆ ఇనుప ముక్క అయస్కాంత తత్వాన్ని సంతరించుకుంటుంది. ఇలా అయస్కాంత తత్వాన్ని పొందిన ఇనుప ముక్కపై మరో చోట రాగి తీగను చుట్టినట్లయితే అందులో విద్యుత్‌ క్షేత్రం ప్రేరేపితం అవుతుంది. మరోలా చెప్పాలంటే మారే విద్యుత్‌ ప్రవాహం అయస్కాంత క్షేత్రాన్ని, మారే అయస్కాంత క్షేత్రం విద్యుత్‌ క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే విద్యుదయస్కాంత ప్రేరణ (Electro magnetic Induction) అంటారు. ఈ సూత్రం ఆధారంగానే మన ఇళ్లలో ఫ్యాన్లు, పంటపొలాల్లో మోటార్లు పని చేస్తున్నాయి. ఇండక్షన్‌ స్టవ్‌ కూడా ఇదే సూత్రంపై పనిచేస్తుంది. స్టవ్‌ లోపల విద్యుత్‌ వలయం ఉన్న ఓ ఇనుప కోర్‌ (ఇనుప ప్లేట్ల సముదాయం) ఉంటుంది. విద్యుత్‌ ప్రవహించినప్పుడు ఆ కోర్‌ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. స్టవ్‌ మీద పాత్ర పెట్టే ప్లాట్‌ఫారం మీద కూడా ఈ క్షేత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇనుప పాత్రను స్టౌ పై పెడితే అందులో విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుంది. అయితే ఈ పాత్రకు నిరోధం (resistance) ఉండడం వల్ల అందులో విద్యుత్‌ ప్రవాహం ఉష్ణంగా మారుతుంది. అందువల్ల పాత్ర వేడెక్కి అందులోని పదార్థాలు ఉడుకుతాయి. ఈ స్టౌ మీద కేవలం స్టీలు లేదా ఇనుప పాత్రలనే ఉపయోగించాలి.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; -రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
  • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, December 07, 2012

What is Panchagavyala Treatment?-పంచగవ్యలు చికిత్స అంటే ఏమిటి ?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ర్
 ప్ర : పంచగవ్యలు చికిత్స అంటే ఏమిటి ?

జ : ఆయుర్వే ఔషదులలో పంచగవ్యలను విరివిగా ఉపయోగిస్తారు . పంచ అనగా ఐదు (5)
1.పాలు ,
2.పెరుగు,
3.నెయ్యి ,
4.గోవు మూత్రము ,
5.గోవు  పేడ ,
భారతీయులు  గోవును  మాతృభావము తో " గోమాత" గా ఆరాధిస్తారు. గోవు నుండి వచ్చే ఈ 5 ను  ఆయుర్వేద గ్రంధాలు .. " చరక సంహిత " , " సుశ్రుత సంహిత " , "వాగ్బట సంహిత "  లలో కొన్ని చర్మ వ్యాధులు , బొల్లి , మూత్రవ్యాధులు , కీళ్ళవ్యాధులు , కడుపు మంట  వంటి పలురకాల వ్యాధుల నివారణకు పంచగవ్య  చికిత్స గా చెప్పబడి ఉంది. నవీన వైద్యులు , శాస్త్రజ్ఞులు దీనిని అంతగా నమ్మరు.
  • ==================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, November 30, 2012

What about Salt Hotel?- ఉప్పు హోటలు సంగతేమిటి ?




  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  
Q  : ఉప్పు హోటలు సంగతేమిటి ?
A :    అదొక హోటల్‌... 12 పడక గదులున్నాయి... మంచాలు, కుర్చీలు ఉన్నాయి... ఇందులో ప్రత్యేకత ఏముంది? ఇవన్నీ ఉప్పుతో కట్టినవే!
ఆ హోటల్‌లో మీరు తింటున్న పదార్థంలో ఉప్పు తక్కువైందనుకోండి. గోడను కాస్త గీరి కలుపుకుని తినేయచ్చు. ఎందుకంటే ఆ హోటల్‌ మొత్తాన్ని ఉప్పుతోనే చేశారు మరి! ప్రపంచంలో ఉప్పు దిమ్మలతో కట్టిన హోటల్‌ ఇదొక్కటే! అయితే ఇందాకా చెప్పినట్టు గోడలు గీకడాలు  చేయకూడదు. ఈ హోటల్‌లోకి ఎవరైనా వెళ్లవచ్చు కానీ, ఒకటే షరతు! అదేంటో తెలుసా? 'ఇచ్చట గోడలు నాకరాదు!' అని ముందే చెబుతారు.

బొలివియా దేశంలోని ఉయుని పట్టణం దగ్గర ఈ 'లవణ మందిరం' ఉంది. విశాలమైన 12 గదులు, మంచాలు, కుర్చీలు, ఇతర వస్తుసామగ్రి మొత్తాన్ని ఉప్పుతోనే చేశారు. దీని పేరు 'పాలాసియో డి సాల్‌'. అంటే స్పానిష్‌ భాషలో ఉప్పు ప్యాలెస్‌ అని అర్థం. దీని నిర్మాణానికి 15 అంగుళాల ఉప్పు ఘనాలను ఏకంగా 10 లక్షలు తయారు చేసి వాటితో కట్టారు. ఇందులో అలంకరణ కోసం పెట్టిన శిల్పాలు, కళాఖండాలు కూడా ఉప్పుతో మలిచినవే. ఇందులోని ఈతకొలనులో ఉప్పు నీరే ఉంటుంది. హోటల్‌ బయట గోల్ఫ్‌ కోర్స్‌ కూడా ఉప్పు మయమే.

అసలు దీన్నెందుకు కట్టారంటే ఆ ప్రాంతం గురించి చెప్పుకోవాలి. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉండే అక్కడి ప్రదేశమంతా ఎటుచూసినా ఉప్పే. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉప్పు క్షేత్రం. దీని మొత్తం విస్తీర్ణం 10,582 చదరపు కిలోమీటర్లు. అంటే హైదరాబాద్‌ నగరానికి 20 రెట్లు పెద్దదన్నమాట! కనుచూపుమేర ఎటుచూసినా అంతులేని ఉప్పు మేటలతో, ఉప్పు ఎడారిలా ఉంటుంది. దీన్ని చూడ్డానికి నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. వాళ్ల వసతి కోసమే ఈ ఉప్పు హోటల్‌ను కట్టారు.

దీన్ని నిజానికి 1993లోనే కట్టినా రెండేళ్లలోనే మూసివేశారు. తిరిగి 2007లో సకల సౌకర్యాలతో నిర్మించారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు గోడల్ని నాకకుండా సిబ్బంది పరిశీలిస్తూ ఉంటారు.

  • Courtesy with : Eenadu Hai bujji.
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, November 23, 2012

No oily stikyness on Tounge Why?నాలుకపై జిడ్డుండదేం?



  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 



ప్రశ్న: మన శరీరం మీద నూనె, నెయ్యి తదితర తైల పదార్థాలు పడితే జిడ్డు అంటుకుని సబ్బుతో కడిగితే కానీ పోదు. కానీ మనం నూనె వస్తువులను ఎప్పుడు తిన్నా నాలుక మీద జిడ్డు అంటదు. ఎందుకని?

జవాబు: మన శరీరంలో చర్మపు ఉపరితలం సేంద్రియ (ఆర్గానిక్‌) పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. నూనె, నెయ్యి లాంటి తైలాలు కూడా సేంద్రియ ద్రవాలే. కాబట్టి చర్మం మీద నూనెలు పడితే వాటి మధ్య తేలికపాటి రసాయనిక బంధాలు ఏర్పడి చర్మానికి అంటుకుంటాయి. సబ్బుతో కడిగితే కానీ పోవు. కానీ నాలుక ఎపుడూ తడిగా ఉంటుంది. ఉపరితలం అంతా లాలాజలంతో కప్పుకుని ఉంటుంది. అంటే ఒక విధంగా నాలుక ఉపరితలం నిరింద్రియ (ఇన్‌ఆర్గానిక్‌) పదార్థమయం. నూనెలకు, నీటికి పడదు. కాబట్టి నూనెల్ని జలవిరోధ (hydrophobic) పదార్థాలు అంటాము. నూనెలు కలిసిన ఆహార పదార్థాలను నమిలినప్పుడు నోటిలో ఎక్కడ చూసినా లాలాజలపు చెమ్మ ఉండడం వల్ల ఆ నూనెలు నాలుకకు అంటుకోవు.


-ప్రొ.ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Metalic vessles shining fades Why?-గిన్నెల మెరుపుకొన్నాళ్లు వాడిన తర్వాత ఉండదేం?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: లోహపు పాత్రల మెరుపు కొన్నప్పుడు ఉన్నట్టుగా కొన్నాళ్లు వాడిన తర్వాత ఉండదేం?

జవాబు: లోహపు పాత్రలను తయారు చేసిన తర్వాత ఒక రకం పొడితో రుద్దడం ద్వారా వాటిని తళతళా మెరిసేటట్టు చేస్తారు. ఇలా రుద్దడం వల్ల ఆ పాత్రల ఉపరితలం మొత్తం ఒకే రీతిగా చదును అవుతుంది. అందువల్ల ఆ పాత్రపై పడిన కాంతి కిరణాలన్నీ ఒకే విధంగా ఒక నిర్దిష్ట దిశలో పాత్ర ఆకారాన్ని బట్టి పరావర్తనం (reflection) చెందుతాయి. అందువల్లనే అవి మెరుస్తూ కనిపిస్తాయి.

వాడుతున్న కొద్దీ పాత్రలపై ఎగుడు దిగుడు గీతలు ఎర్పడి వాటి ఉపరితలం గరుకుగా మారుతుంది. దాంతో ఆ పాత్రలపై పడే కాంతి కిరణాలు ఒక క్రమ పద్ధతిలో కాకుండా చిందరవందరగా పరిక్షేపణ (scattering) చెందుతాయి. అందువల్ల కొన్నప్పటి మెరుపును అవి కోల్పోతాయి. పాత్రలపై ఏర్పడిన గీతలలో చేరిన మురికి, వాతావరణంలోని ఆక్సిజన్‌ వల్ల లోహాలు ఆక్సీకరణం (oxidation) చెందడం వల్ల కూడా పాత్రలు మెరుపును కోల్పోతాయి. స్టెయిన్‌లెస్‌ స్టీలు పాత్రలు వాటిలో ఉండే క్రోమియం వల్ల అంత తొందరగా మెరుపును కోల్పోవు.

-ప్రొ.ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Nitrous Oxide gas produce Laughter?-నైట్రస్‌ ఆక్సైడు వాయువు పీలిస్తే నవ్వు వస్తుందా?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: నైట్రస్‌ ఆక్సైడు వాయువును నవ్వు పుట్టించే వాయువు అంటారు. దాన్ని పీలిస్తే నిజంగా నవ్వు వస్తుందా?

జవాబు: నైట్రస్‌ ఆక్సైడు (N2O)వాయువుకి రంగు ఉండదు. పీలిస్తే హాయిగా అనిపిస్తుంది. రుచికి తీయగా ఉంటుంది. నవ్వు పుట్టించే వాయువు (లాఫింగ్‌ గ్యాస్‌) అనే పేరున్నప్పటికీ దీన్ని పీలిస్తే ఎవరికీ నవ్వు రాదు. అయితే దీన్ని పీల్చినప్పుడు మత్తు కలుగుతుంది. అందుకే వైద్యులు రోగులకు శస్త్రచికిత్స చేయడానికి ముందు ఈ వాయువును ఉపయోగించి మత్తు కలిగిస్తారు. ఆందోళన, నొప్పి భావనలతో కాకుండా ఆహ్లాదకరమైన భావనతో మత్తులోకి పోయేలా చేయడం వల్ల దీనికా పేరు వచ్చింది. అంతేతప్ప దీన్ని పీల్చినవారంతా విరగబడి నవ్వుతారని అనుకోకూడదు.

-ప్రొ. ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, November 22, 2012

How to solve Differences in a Couple -ఆలుమగల మధ్య అంతరాలు నివారించికోవడం ఎలా?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : -ఆలుమగల మధ్య అంతరాలు నివారించికోవడం ఎలా?
జ : -ఆలుమగలు ఎలాంటి అరమరికలు, అపార్థాలు లేకుండా అన్యోన్యంగా జీవించే ఇల్లు భూతల స్వర్గంగా ఉంటుంది. అయితే ఆలుమగలు ఎంత అనురాగంతో ఉన్న ఏదో ఒక సందర్భంలో కలతలు మూమూలుగానే వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లోనే భార్యాభర్తలు తెలివిగా మసలుకోవాలి, ప్రేమలు రెట్టింపు కావడానికి, మనస్పర్థలు పెరిగిపోవడానికి అవే మూలం. మనస్పర్థలు, భేదాలు వచ్చినపుడే కొంచెం సేపు లేదా కొన్ని గంటలు ఎడమొఖం పెడముఖంగా ఉన్నా, ముందు ఉక్రోషాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని తప్పెవరిదో కూల్‌గా ఆలోచించుకోవాలి. తప్పెవరిదైనా ఎవరో ఒకరు పట్టుదల సడలించుకుని రాజీకి ప్రయత్నించాలి. ఎవరెక్కడ పుట్టిపెరిగినా గతంలో పరిస్థితులు ఎటువంటివైనా ఆలుమగలుగా సంసారం మొదలుపెట్టిన తరువాత ఇద్దరూ వేరు కాదనే నిజాన్ని అన్ని కోణాలనుంచి అర్థం చేసుకోవాలి. భార్యదగ్గర భర్తకు, భర్తదగ్గర భార్యకు భేషజం అనేది ఉండకూడదు. ఎవరెంత ఆత్మాభిమానం కలవారైనా ఆలుమగలు ఒకరిదగ్గర మరొకరు ఆత్మాభిమానం ప్రదర్శించుకోవడం అర్థం లేనిపని, అందుకే అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడే రాజీకి చొరవతీసుకుంటే అదేదో లొంగిపోయినట్టు, ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టినట్టుకాదు. రాజీకి చొరవ తీసుకుని పట్టు వీడి ఆనంద సామ్రాజ్యంలో మునిగి తేలుతున్నవేళ అవసరమనుకుంటే అప్పుడే తమ ఉక్రోషాన్ని, దు:ఖాన్ని బయట పెట్టుకోవచ్చు.ఇలా చేయడం వలన కోపతాపాలు పోయి అభిమానం రెండింతలవుతుంది. అలా కాకుండా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడే ఎవరికివారే తమ వాదాన్ని బలపరుచుకుని ఆత్మాభిమానంతో మొండిగా కూర్చుంటే ఆ పట్టుదలలు పెరిగి, స్పర్థలు అధికమై పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

ఆలు మగల మధ్య ఏర్పడే అభిప్రాయ బేధాలు వినేవారికి, చూసేవారికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఇవి భార్యాభర్తలకు అగ్నిపర్వతాల్లా అనిపిస్తాయి.చివరికి అగ్ని పర్వతం బద్దలైనట్టు అవుతుంది. ముఖ్యమైన విషయమేమిటంటే ఆలుమగల సంబంధాలు ఒక్క గొడవ మూలంగానో, ఒక్క కారణం చేతనో దెబ్బతినవు. కాబట్టి తరచూ ఏర్పడే గొడవలకు ఇద్దరూ కారణమవుతారు. మనస్పర్థలు ఏర్పడిన ఆలు మగలు ఒకరిపై ఒకరు చేసుకొనే ప్రధాన ఫిర్యాదు ”అస్సలు మాట వినిపించుకోరని”. ఈ సమస్యకు పరిష్కారం చాలా తేలిక. ఒక మాట చెప్పినపుడు వినిపించుకోనప్పుడు కోపం తెచ్చుకోకుండా సరైన సందర్భం చూసుకుని అలవోకగా అదే మాట చెప్తే పాజిటివ్‌ రిజల్ట్‌ వస్తుంది. ఈ సైకాలజీని ఆలుమగలు గ్రహించాలి. స్త్రీ, పురుష అహంకారాలు, పుట్టింటి వారి ఆర్థిక బేదాలు, శరీర రంగులు తేడాలు, ఇతర హోదాలు అలుమగలు పోల్చుకోవటమంత బుద్ది తక్కువ తనం మరొకటి ఉండదు. స్వీట్‌ హోంలా పోల్చదగ్గ కాపురంలో వాటికి తావుండకూడదు. ఏదో ఒక సందర్భంలో భార్యను భర్త విసుక్కున్నా, భర్తని భార్య విసుక్కున్నా ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని, మనస్సు కష్టపెట్టుకోకుండా సరిపెట్టుకోవాలి. అవసరమైతే సహకరించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే కష్టపెట్టినందుకు తమకు తామే ఎంతో నొచ్చుకుని మరింత దగ్గరవుతారు. అలానూ గాకుండా ప్రతిమాట పట్టించుకుని పంతం ప్రదర్శించే వారైతే ఆ చిన్న సమస్య పెరిగి పెద్దదవుతుంది. ఆలుమగలు పరస్పర భావోద్రేకాలను, శారీరక మానసిక అవసరాలను గురించి అవగాహన గలిగినప్పుడే ఆ సంసారంలో అనురాగమే తప్ప, అపార్థానికి తావుండదు. ఏమైనా చిన్న చిన్న చికాకులు ఏర్పడినా వాటంతటవే సర్దుకుపోతాయి. ప్రేమ సామ్రాజ్యంలో లొంగిపోవటమే గొప్ప తప్ప, ఆధిక్యత ప్రదర్శించటం ఏమాత్రం గొప్పకాదనేది ప్రాథమిక సూత్రం. ఈ సూత్రాన్ని పాటించిన ప్రతి ఇల్లూ స్వీట్‌ హోమ్‌ అవుతుంది. అటువంటి అభిప్రాయం ఒకరికి ఉండి మరొకరిని మార్చటం సాధ్యం కానప్పుడు, ఆ విషయం బయట పెట్టకుండా ఒక మంచి సందర్భం చూసుకుని, ఇరువురూ చర్చించుకుని కౌన్సిలింగ్‌లో సలహా తీసుకోవచ్చు. ఇలాంటి కౌన్సిలింగ్‌ ఏమాత్రం తప్పుకాదు. ఆలుమగలు madhya అనురాగానికి, ఆగ్రహానికి తేడా చాలా తక్కువ . ఆలుమగల మధ్య ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే ప్రసక్తి ఉండకూడదని గ్రహించిన నాడే అది తప్పక స్వీట్‌ హోమ్‌ అవుతుంది. జీవపరిణామ క్రమములో మగవాడు ముందు ... తరువాత ఆడుది పుట్టినవి అయినందున మూర్ఖత్వము  కొన్ని జంతులక్షణాలు మగవారికే ఉంటాయి. కావున స్త్రిలే సర్దుకు పొవాలి. భర్తకు ఇత్ష్టము లేనిది భార్యకు ఎంత ఎష్టమైనా వదుకోవడమే ఉత్తమము మరియు అలా గ్రహించిన నాడే అది తప్పక స్వీట్‌ హోమ్‌ అవుతుంది.

ఫలప్రదమైన అనుబంధాలు చాలా వరకు అర్థవంతమైన సంభాషణల మీదే ఆధారపడి ఉంటాయి. అయితే సంభాషణలు సహజంగా, దాపరికం లేకుండా సాగాలి. అలా చర్చించుకోవలసినవి.
-కెరీర్ : దంపతులు ఇరువురూ ఉద్యోగాలు చేస్తున్నా, కొంతమంది జీవిత భాగస్వామికి తమ సమస్యేమిటో చెప్పే ప్రయత్నమే చేయరు. నిజానికి సంస్థలు వేరు వేరయినా, చాలా సార్లు ఆ సమస్యలు ఒకేలా ఉంటాయి. అందుకే జీవిత భాగస్వామి నుంచే ఒక గొప్ప పరిష్కార మార్గం లభిస్తుందనే విషయాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదు.
-ఆర్థిక విషయాలు : కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఉమ్మడిగా చర్చించుకోవడం ద్వారా, ఎన్నో సమస్యలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయవచ్చు. కుటుంబానికి సంబంధించి, అప్పులు, ఆదాయాలు ఇలా అన్ని విషయాలూ ఇద్దరికీ పూర్తిగా తెలిసి ఉండడం వల్ల, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా వాటిని అధిగమించడం సులువవుతుంది.
-కుటుంబ బంధాలు : దంపతులిద్దరూ పరస్పరం రెండు కుటుంబాల విషయాల్లో బా«ధ్యతగానే ఉండాలి. ఇది దంపతుల మధ్య ఒకరి పట్ల మరొకరికి గౌరవ భావం పెరిగేందుకు కూడా తోడ్పడుతుంది.
-హాబీలూ ముఖ్యమే : ఎంతసేపూ కుటుంబ నిర్వహణ విషయాలకే పరిమితం కాకుండా, తమ తమ హాబీల విషయంలోనూ పరస్పరం చర్చించుకోవడం ఎంతో మేలు. దీనివల్ల ఒకరి పురోగతికి మరొకరు తోడ్పాటును, ప్రోత్సాహాన్నీ అందించినట్లు అవుతుంది.
-భవిష్యత్తు పై ఒక భరోసా : కొందరిని భవిష్యత్తు గురించిన ఒక అభద్రతా భావం కుదిపేస్తూ ఉంటుంది. ఒక పక్కా ప్రణాళిక ఏదీ లేకపోవడమే దీనికి కారణం. అందుకే,భవిష్యత్తు గురించిన ఒక నిశ్చింత ఏర్పడే ఆలోచనా క్రమం నిరంతరం సాగాలి. అందుకే భవిష్యత్తు విషయాలపై కూడా దృష్టి నిలపడం ఏ జంటకైనా ఎంతో ముఖ్యం.
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, November 19, 2012

Who are the five mothers in Hindu epics?-హిందూ పురాణాలలో పంచమాతలు అని ఎవరిని అంటారు ?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ఫ్ర : హిందూ పురాణాలలో పంచమాతలు అని ఎవరిని అంటారు ?

జ : మాత అంటే అమ్మ అని అర్ధము . జన్మనిచ్చేదానిని అమ్మ అంటాము . ప్రతిజీవికి అమ్మ ఉంటుంది . అమ్మను ప్రేమించని జీవి అంటూ ఉండదు . బిడ్డను నిస్వార్ధము గా ప్రేమించేది అమ్మే . అటువంటి అమ్మను ప్రతివారు శ్రద్ధతో , అమూల్యముగా కాపాడు కోవడము వారి బాధ్యతగా తీసుకోవాలి. ఇక్కడ హిందూ పురాణాలలో పంచమాతలు అనగా :

1.విశ్వమాత : - వాతావరణ కాలుష్యము నుండి కాపాడుకోవాలి.
2.పృధ్వీమాత : విధ్వంశకర శక్తులనుండి భూమాతను కాపాడుకోవాలి,
3.దేశమాత : మన దేశాన్ని ఇతరదేశాల నుండి  మనమే కాపాడుకోవాలి .
4.జన్మనిచ్చిన మాత : తల్లి ఋణము తీరేదాకా కడదాకా కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
5.గోమాత : బహు ప్రయోజనకారి , ఆరోగ్యప్రదాయని అయిన గోమాతను కాపాడుతూ ఉండాలి .
  • =================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, November 17, 2012

what is Phantom vibration Syndrome?-ఫాంటం వైబ్రేషన్‌ సిండ్రోం అంటే ఏమిటి ?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
Q : what is Phantom vibration Syndrome?-ఫాంటం వైబ్రేషన్‌ సిండ్రోం అంటే ఏమిటి ?

జ : నేటి నవీన యుగము లో సెల్ ఫోన్‌ వాడకము బాగా పెరిగిపోయినది. మానవ జీవితము ఏపని అయినా , అలవాటు నైనా , వస్తువునైనా అతిగా వాడడాన్నే వ్యసనముగా భావిస్తారు. వ్యసనాలు ఉండడము మామూలే అయినా దానికి బానిస అయిపోవడమే అనారోగ్యము . ఇదే కోవకు చెందినది ఎక్కువగా సెల్ ఫోన్‌ వాడకము . నెలకు సుమారు 3000 నుండి 4000 వరకూ మెసేజ్ అందుకోవడమో , పంపడమో చేస్తూ ఉంటారు . కొంతమంది అవసరమున్నా ... లేకపోయినా కాల్ చేస్తూ ఉంటారు ... కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు . ఇలా మెసేజ్ లు , కాల్స్ వలన ఒకరకమైన శబ్దము వినిపిస్తుంది.  ఈ శబ్దము పదే పదే వినడము మూలము గా మన మెదడు లోని వినికిడి కేంద్రము ఒకరమైన భ్రమకు లోనై ఫోన్‌ రాని సమయములో కూడా ఎదో ఒక రకమైన సెల్ఫోన్‌ ధ్వని వినిపిస్తున్నట్లు భావన కలుగుతుంది. దీనినే " ఫాంటం వైబ్రేష్‌ సిండ్రోం " అంటారు. సుమారు 10 శాతము మంది ఈ మానసిక వ్యాధికి గురి అవుతున్నారు. బాత్ రూం లోస్నానము చేస్తున్నా , టి.వి.చూస్తున్నా , పాటలు వింటున్నా , పనిలో మునిగి ఉన్నా , సినిమా చూస్తున్నా , ఫంక్షన్‌ లో ఉన్నా వారి "స్పెసిఫిక్ రింగ్ టోన్‌ " వినిపిస్తున్నట్లు గా ఫీలవుతారు.  వీరిలో వినికి లోపాలు తల ఎత్తే అవకాశము ఎక్కువ .

చికిత్స :
  • క్రమేపీ సెల్ ఫోన్‌ వాడకము తగ్గించాలి.
  •  రింగ్ టోన్‌ మార్పు చేస్తూ ఉండాలి .
  • అవసరమున్నపుడే కాల్ చేయాలి . కాల్ తక్కువ సమయము లో ముగించాలి .
  • నిద్రపోయేటప్పుడు సెల్ ఆఫ్ లో ఉంచితే మంచిది.

  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, November 16, 2012

Why do doctors get more value in the Society?-సమాజములో వైద్యులకు ఎందుకంత విలువ ?

doctor
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : Why do doctors get more value in the Society?-సమాజములో వైద్యులకు ఎందుకంత విలువ ? 

జ : మన దేశము లో వృత్తిచిద్య ల గురించి కొన్ని చులకనైన అభిప్రాయాలు ఉన్నాయి. నీళ్ళు రాకపోతె రిపేరు చేసే " ప్లంబరు" , కరంటు రిపేరు చేసే " ఎలక్ట్రీషియన్‌" , ఫర్నిచర్ బాగుచేసే " కార్పెంటర్ " , కారును రిపేరు చేసే " మెకానిక్ " వీరంతా రోజూకూళీవాళ్ళని , వీరికంటే ఆఫీసులో నెలకి మూడు , నాలుగు వేలు తెచ్చుకునే గుమాస్తా ఉద్ద్యోగము మర్యాదగా ఉంటుందని ఓక రకమైన తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి.

లండన్‌ లో ప్లంబర్ కు ఉన్న పలుకుబడి  డాక్టర్ కి ఉండదు . ఇంటికి వెళ్ళి వైద్యం చేసే డాక్టరు సంపాదన కంటే పంపు రిపేరు చేసే ప్లంబరు ఎక్కువ సంపాదిస్తాడట . అతనికి కాఫీ ఇచ్చి తమతో సమానము గా చూస్తారట . అందుకనే ఒక భారతీయ వైద్యుడు M.D పాసై లండన్‌ లో ప్రాక్టీస్ పెట్టి రోజుకి రెండు కేసులు కూడా రాక ప్లంబర్ పని నేర్చుకొని ... ఆ పనిలో పదిరెట్లు ఎక్కువ సంపాదించుకుంటున్నాడు . " డాక్టర్ మానవదేహాన్ని రిపేరు చేస్తే , తాగే మంచినీళ్ళ పంపుల్ని బాగుచేసి పలంబర్ గా ఎక్కువ సంపాదించుకుంటున్నాను " అని అంటున్నాడట .

మన దేశములో నాలుగో వంతు జనాభా పాతికేళ్ళలోపువారు ఉన్నారు . అందులో 80 శాతము మంది చదువు మధ్యలోనే మానేసి స్కూల్ డ్రాప్ అవుట్స్ గా ఉన్నారు. ఇటువంటి వారికి ఎలక్ట్రీషియన్‌ , కంప్యూటర్ మెకనిక్ , ప్లంబ్లింగ్ , కార్ మెకానిజం వంటి శాఖల్లో ట్రైనింగ్ స్కూల్సు పెట్టి ... ప్రతిభావంతులైన మెకానిక్స్ గా శిక్షణ యిస్తే వారు నెలకి 40-50 వేలు వరకు సంపాదించుకోవచ్చును.  మనము వృత్తిని గౌరవించడము నేచుకోవాలి. డాక్టర్ ని ఆహ్వానించినట్లే ఎలక్ట్రీషియన్‌ ని  ప్లంబర్ ని , మెకానిక్ ని ఆహ్వానించగలిగితే పరిస్థితులు బాగుపడతాయి.

డాక్టర్ వృత్తిలో మానవ చావు .. పుట్టుకల్తో సంబంధము ఉంటుంది కావున ... సమాజము లో ఆ మాత్రము గౌరవము ఉండడము న్యాయమే కదా !.

మూలము : మాలతీచందూర్ జవాబులు
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, November 13, 2012

What is the specialty of finger-prints? -వేలి ముద్రల ప్రత్యేకత ఏమిటి?

  • image courtesy with Wikipedia.org.
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : వేలి ముద్రల ప్రత్యేకత ఏమిటి? -What is the specialty of finger-prints?

జ : వేలిముద్రలు అనేవి సూక్ష్మాతిసూక్ష్మమైన ఎత్తుపల్లాల వంటి నిర్మాణాలతో ఏర్పడినవి.  వేళ్ళ మీద ఉండే ముద్రలు ఏ ఇద్దరు మనుషులకూ ఒకలా ఉండవు . అచ్చుగుద్దినట్లు ఒకేలా పుట్టిన కవలపిల్లలకూ వేలిముద్రలలో తేడా ఉంటుంది. వేలి ముద్రలు పుట్టినప్పటినుండీ మరణిచేవరకూ మారవు . ఈ ప్రత్యేకత వల్ల వేలిముద్రలను మనుషులను  గుర్తించేందుకు ఉపయోగిస్తారు.
  • సాధారణముగా ఎడమ చేయి బొటన వేలిముద్రలను తీసుకుంటారు. ఆడ , మగ తేడాను  గుర్తించేందుకు కొంతమంది ఆడువారికి కుడి చేయి బొటన వేళి ముద్రలను తీసుకుంటారు. 

  • ================== 
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, November 05, 2012

కృష్ణుడి తల పైన " నెమలి పించం " ఎందుకుంటుంది ?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




ప్ర : కృష్ణుడి తల పైన " నెమలి పించం " ఎందుకుంటుంది ?

జ : కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు. అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగి గా కనిపించే యోగి.

ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది. అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి  జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది. పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పించం తలపై ఉండి  శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.

  •     గోపికలు ఉన్నా అత్యంత పవిత్రుడు అనే కంటే అసలు విషయం ఏంటంటే.. కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. అంటే స్కలనం అనేది ఎరుగడు. నెమలి పరవశించినపుడు మగనెమలి అశ్రు ధారను ఆడ నెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందగలదట. అంతేకాని అవి సంభోగించవు. అందుకే కృష్ణుడు తల  పై నెమలీక ధరిస్తాడు. మరో ముఖ్య విషయం. పిల్లన గోవిని గోవిందుని పెదవుల వద్ద స్థానం ఎలా సంపాదించావని ఒక మహర్షి అడిగాడట. అప్పుడు పిల్లనగ్రోవి ఇలా చెప్పిందట. ఇలా చూడు నాలో ఏముందని అడిగిందట. నాలో ఏమీ లేదు. ఏ కల్మషమూలేదు. ఏ కోరికలూ లేవు.. ఈ కామ, క్రోధ,లాభ, మోహ , మధ, మాత్సర్యాధి హరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకుంటే జీవితం చక్కని స్వరంలా సాగిపోతుంది. తనదంటూ ఏదీ కోరని వారినే దేవుడు తన మధుకలశాల వద్ద ఉంచుకుంటాడని చెప్పిందట పిల్లనగ్రోవి.
   
  •  మనవి : పైన ఇచ్చిన జవాబు  పురాణ పురుషుల ఊహాగానాలే . ప్రతీ జీవి లోనూ సంపర్కము వలనే పురరుత్పత్తి జరుగుతుంది. అది ప్రకృతి సహజము .పురుష బీజకణాలు , స్త్రీ బీజ కణాలు కలయిక వలనే పిండోత్పత్తి జరుగుతుంది. పురుష ఇంద్రియం నోటిద్వారా త్రాగడము ద్వారా పిండోత్పత్తి ఏజీవిలోనూ జరుగదు. జీవపరిణామ క్రమమములో క్లోయకా ద్వారా నెమళి లో గర్భోత్పత్తి జరుగుతుంది.

శ్రీకృష్ణుడి కుటుంబము
శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు. కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది. మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యల ద్వారా కూడా ఒక్కొక్కరికి పది మంది సంతతి కలిగింది. --Source : Wikipedia.org
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, November 01, 2012

Earth rotation not known why?-భూమి తిరుగుడు తెలియదేం?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమ్మీద ఉన్న మనము, ఇతర జీవులు ఎందుకు తిరగరు?



జవాబు: భూమి ఆత్మప్రదక్షిణం చేస్తూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నమాట నిజమే. ఆ భూమితో పాటు ఇతర జీవులు మనం కూడా తిరుగుతూనే ఉన్నాయి. మనం ఏదైనా బస్సులాంటి వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు కదులుతున్న భావన మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ సమయాల్లో వాహనం మీద ప్రోద్బలమో (forwarding force), లేదా వ్యతిరేక బలమో (force of resistance), భూమ్యాకర్షణకు వ్యతిరేకంగానో, అనుకూలంగానో కొన్ని బలాలు పనిచేస్తూ ఉంటాయి. ఏ బలమూ పనిచేయని వాహనంలో సమవేగంతో మనం ప్రయాణిస్తుంటే మనకు ఎలాంటి కుదుపులు తెలియవు. భూమి మీద అపలంబ బలము, అపకేంద్ర బలము, సూర్యుడు గ్రహాల వల్ల కలిగే గురుత్వబలము కలగలిపి పనిచేసినా వాటి నికర బలం(effective force) శూన్యం. అందువల్ల భూమి భ్రమణ, పరిభ్రమణాల ప్రభావం మన మీద పడదు. అందువల్ల మనం కదలనట్టే భావిస్తాము.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, October 28, 2012

వాహనాల వెనుకవైపున రెండేసి టైర్లు ఉంటాయి

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: లారీ, బస్సుల్లాంటి వాహనాల వెనుకవైపున రెండేసి టైర్లు ఉంటాయి. కానీ వాటి ముందువైపు మాత్రం కేవలం ఒక టైరు మాత్రమే ఉంటుంది. ఎందుకని?

జవాబు: బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు సాధారణంగా డీజిలు ఇంజనుతో నడుస్తాయి. పెట్రోలు ఇంజను కన్నా డీజిలు ఇంజను సామర్థ్యాన్ని భారీ వాహనాల తరలింపులో బెల్టులు, పుల్లీల ద్వారా సాధిస్తారు. భారీ వాహనాల సైజు బాగా ఎక్కువగా ఉండడం వల్ల పృచ్ఛ చోదక పద్ధతి (back wheel pushing)లో వాహనాన్ని నడుపుతారు. సాధారణ కార్లు, చిన్నపాటి వ్యాను తదితర మధ్య, కౌటుంబక(domestic)వాహనాలను ముఖచోదక పద్ధతి (front wheel pulling)లో నడుపుతారు. దీనర్థం ఏమిటంటే భారీ వాహనాలలో ఇంజనుకున్న చోదక శక్తిని వెనుక ఉన్న చక్రాల మీదకు ప్రసరింప చేస్తారు. అంటే వాహనాన్ని నెట్టే పద్ధతి ఇది. కానీ కార్లలాంటి చిన్న వాహనాలలో ఇంజను బలాన్ని ముందు చక్రాలకు సంధానిస్తారు. అంటే వాహనాన్ని లాగడం ద్వారా నడిపే పద్ధతి ఇది. వాహనం పెద్దదైనా, చిన్నదైనా యంత్రపు బలాన్ని గైకొనే చక్రాలు రోడ్డు మీద ఒత్తిడి, ఘర్షణల ద్వారా రోడ్డును వెనక్కు నెట్టేటట్టు పని చేసే బలానికి ప్రతి బలాన్ని న్యూటన్‌ మూడో సూత్రం ఆధారంగా పొందడం వల్ల స్వయం చోదకతను సాధిస్తాయి. అంటే రోడ్డు మీద ఎంత ఎక్కువ ఒత్తిడి కలిగిస్తే అంత మంచిది. రెండు చక్రాలు ఉండడం వల్ల అదనపు పట్టు(grip) వస్తుంది. ముందే రెండు చక్రాలుంటే మలుపులు తిరగడం కష్టమవుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
=========================================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Polished shoes shining Why?-పాలిష్‌ చేస్తే బూట్లు మెరుపేల?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: పాలిష్‌ చేయగానే బూట్లు తళతళా మెరుస్తాయి. అంతకు ముందు అవి మెరుపులేకుండా ఉంటాయి. ఎందుకని?

జవాబు: బూట్లను తయారు చేయడానికి వాడే చర్మపు ఉపరితలం సమంగా ఉండదు. ఎత్తుపల్లాలు, ఎగుడుదిగుడులుగా ఉండే ఆ ఉపరితలంపై పడిన కాంతి కిరణాలు వేర్వేరు దిశల్లో చెల్లాచెదరైపోతాయి. అందువల్ల బట్ల ఉపరితలం మాసినట్టుగా కనిపిస్తుంది. అదే బూటుకు పాలిష్‌ పూసి, బ్రష్‌ చేసినప్పుడు బూటు ఉపరితలంలోని ఎగుడుడిగుడులలో పాలిష్‌ పరుచుకుంటుంది. అలా చదునుగా మారిన ఉపరితలం, కాంతికిరణాలకు ఒక నునుపైన అద్దంలాగా పనిచేస్తుంది. ఆ కిరణాలు ఒక క్రమపద్ధతిలో పరావర్తనం (reflection)చెంది మన కంటికి చేరడంతో బూటు ఉపరితలం తళతళ మెరుస్తున్నట్టు కనిపిస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why donot we remember Childhood memories?- చిన్నప్పటి విషయాలు గుర్తుండవేం?

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మనకు బాల్యంలో జరిగిన విషయాల గురించి అంతగా జ్ఞాపకం ఉండదు. ఎందుకని?

జవాబు: బాల్యంలోని విషయాలు ముఖ్యంగా పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల వయసు వచ్చే వరకు జరిగిన అనుభవాల గురించి జ్ఞాపకం ఉండకపోవడానికి కారణాలు రెండు.
ఒకటి, పిల్లలు పుట్టినప్పుడు వారి మెదడులోని కార్టెక్స్‌ అనే భాగం అంతగా ఏర్పడకపోవడం. ఇది మెదడుకు చేరిన సంకేతాలను ఒక క్రమపద్ధతిలో అమరుస్తుంది. ఈ పెరుగుదల ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి కానీ పూర్తవదు. ఆ తర్వాతి అనుభవాలను మెదడులోని హిప్పోకాంపస్‌ అనే భాగం గ్రహించడం, ఆపై కార్టెక్స్‌ను చేరడం జరుగుతాయి. ఈ భాగాలు చిన్న పిల్లల్లో పూర్తిగా వికసించకపోవడం వల్ల వారి మెదడులో అప్పటి అనుభవాలు నమోదు కావు.

ఇక రెండో కారణం, మనకు ఏదైనా విషయం జ్ఞాపకం ఉండాలంటే దానికొక అర్థం, సందర్భం ఉండాలి. చిన్నపిల్లల్లో ఆ వయసులో తాము జీవిస్తున్న విషయాన్ని గురించిన పరిజ్ఞానం, అవగాహన అంటూ ఏమీ ఉండవు. దాంతో అపుడు జరిగిన విషయాల గురించి అంతగా ఆలోచించకపోవడంతో ఆ జ్ఞాపకాలను వారి మెదడు నిల్వ చేసుకోలేదు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Do Earth moves if we move up or down?-ఒక్కసారిగా పైకెగిరి దూకితే భూమి తన కక్ష్య నుండి తప్పుకుంటుందా?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ప్రపంచంలోని అందరూ కూడబలుక్కుని ఒక్కసారిగా పైకెగిరి దూకితే భూమి తన కక్ష్య నుండి తప్పుకుంటుందా?

జవాబు: భూమి సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరగడానికి కారణం సూర్యుడు భూమిని ఆకర్షించడం, భూమికి గల ద్రవ్యవేగం (momentum). ఒక వస్తువు ద్రవ్యవేగం దాని ద్రవ్యరాశి(mass), వేగం (velocity) పై ఆధారపడి ఉంటుంది. భూమి ద్రవ్యరాశి ఎంత అధికంగా ఉంటుందంటే దానిపై ఉండే వస్తువుల ద్రవ్యరాశిలోని మార్పులు, చేర్పులు దానిపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. అంటే దాని ద్రవ్యరాశిలో కానీ, వేగంలో కానీ ఎలాంటి మార్పులు ఏర్పడవు. అంతేకాకుండా న్యూటన్‌ మొదటి గమన సూత్రం ప్రకారం ఒక వస్తువు గమనంలో మార్పు తీసుకురావాలంటే ఆ వస్తువుపై బలాన్ని (force) ప్రయోగించాలి. ఇది బాహ్య బలమై ఉండాలి. అంటే వస్తువు వెలుపల నుండి కలగాలి. గమనంలో ఉన్న బస్సులోని ప్రయాణికులు వారి ముందుండే సీట్లను బలంగా నెట్టడం ద్వారా బస్సు వేగాన్ని పెంచలేరు కదా. అలాగే భూమి ఉపరితలం నుండి దాని గురుత్వాకర్షణ శక్తి పనిచేసే 'పై వాతావరణం' వరకు ఒక సంవృత వ్యవస్థ (closed entity) మొత్తాన్ని ఒక బస్సులాగా ఉహిస్తే, అందులోని ప్రాణుల, వస్తువుల కదలికలు భూమి గమనంలో ఏ మార్పునూ తీసుకురాలేవు. అందువల్ల భూమిపై ఉండే మనుషులందరూ ఒకేసారి పైకెగిరి దూకినా ఏమీ జరగదు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Can not we survive a dead person with Oxygen?-చనిపోయినవారికి ఆక్సిజన్‌ ఇచ్చి బతికించలేమా?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: మనిషి జీవించడానికి ఆక్సిజన్‌ అవసరం కదా? మరి చనిపోయినవారికి ఆక్సిజన్‌ ఇచ్చి బతికించలేమా?

జవాబు: ప్రపంచంలోని మరణాలన్నీ ఆక్సిజన్‌ లేకపోవడం వల్లే జరగడం లేదు కదా? కాబట్టి మరణానికి, ఆక్సిజన్‌ లేమి కారణం కాదు. మనిషులు కానీ, జీవులు కానీ బతికి ఉండడానికి ఆక్సిజన్‌ ఒక్కటే కారణం కాదు. మనం బతికి ఉండాలంటే మనకు ఆక్సిజన్‌తోపాటు నీరు, ఆహారం, రోగనిరోధక శక్తి, సరైన రక్తప్రసరణ, సరైన జీవభౌతిక ధర్మాలు, సరైన వాతావరణం కావాలి. ఇందులో కొన్ని బాహ్యకారకాలు కాగా, కొన్ని అంతర కారకాలు. బయట నుంచి ఎంత మంచి ఆక్సిజన్‌, ఆహారం, వాతావరణం లాంటివి కల్పించినా కాలక్రమేణా శరీరంలోనే కొన్ని కార్యకలాపాలు మందగించడం మొదలెడతాయి. ఆ స్థితినే మనం వృద్ధాప్యం లేదా అవసాన దశ అంటాము. మరికొన్ని రోజుల తర్వాత ఆ శరీర కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోతాయి. అదే మరణం. ఒకసారి మరణం సంభవించాక ఏ విధంగానూ బతికించడం సాధ్యం కాదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌ ,రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Curry leaves Tree before house is bad?-ఇంటిముందు కరివేపాకు చెట్టు దోషమా?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మా ఇంటి గుమ్మం ముందు కరివేపాకు చెట్టుంది. ఎవరెవరో ఏదేదో చెప్పి భయపెడుతున్నారు.అది ఉంటే తప్పా?
జ ; ఇది వాస్తుశాస్త్రం నకు సంభందినది . ఒక గృహాన్ని వాస్తుశాస్త్ర ప్రకారము నిర్మించుకోవాలని అంటారు . మనము నివసించే ఇల్లు మంచి గాలి , వెలుతురు వచ్చేదిగాను , కాలుష్యరహితం గాను ... ముఖ్యము గా శబ్ద కాలుష్యము లేనిదిగాను ఉండాలి . ఇక్కడ కరివేపాకును అందరూ కూరలలో వేసుకునే సుగంధద్రవ్యము గా వాడుతారు . ఆ ఆకులు కోసము ఇరుగు పొరుగు వారు రావడము జరుగుతుంది ... ఇది ఇంటిలో ఉన్న కుటుంబసభ్యులకు చిరాకు కలిగించేదిగా ఉంటుంది.. మరియు   గుమ్మం ముందు చెట్టుంటే నడకకి ఇబ్బంది, వస్తువుల్ని తీసుకురావడం, పోవడం కష్టం. అదీ కాక ఆ వేళ్లు ఇంటిలోనికి పాకి నేలకి పగుళ్లు తెస్తాయి. అన్నిటికీ మించి పెద్ద గాలికి విరిగి పడితే ఇంట్లో వారికి ప్రమాదమని భావించిన పెద్దలు ఇంటి గుమ్మానికి ముందు చెట్లు వద్దన్నారు. ఈ దృష్టితో ఆలోచించుకుని గుమ్మానికి బాగా దూరంగానైతే... కరివేపాకు అనేది పెద్ద చెట్టు కాదు కాబట్టి ఉంచుకోండి. శాస్తప్రరంగానైతే ఇది వనస్పతి వృక్షం (పువ్వులు, పళ్లు లేనిది) కాబట్టి దోషం లేదు ఉంచినట్లయితే...

--డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు , రామాయణ సుధానిధి
  • ============================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, October 26, 2012

What are the 14 worlds? -14 లోకాలు అనేవి ఏవి?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్‌పురుషుని (విశ్వరూపుని) శరీరంలోని అవయవాలుగా భావించారు. మహాభాగవతం రెంవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం పదునాలుగు లోకాలనీ, వాటిలో ఊర్ధ్వలోకాలు (పైనున్నవి) ఏడు, అధోలోకాలు (క్రిందనున్నవి) ఏడు అనీ చెబుతారు.

లోకాల విభజన గురించి భాగవతంలో ఇలా చెప్పబడింది.--- బ్రహ్మాండంలో కొన్ని అంతరాలున్నాయి. తత్వ పదార్ధాల సూక్ష్మ, సూక్ష్మతర అవస్థలనుబట్టి ఈ భేదాలు ఏర్పడుతున్నాయి. క్రింది లోకాలకంటే పై లోకాలలో తత్వ పదార్ధాలు సూక్ష్మతరంగా ఉంటాయి. లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు, పదునాల్గని కొందరు అంటుంటారు.

  • లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే--

    మొదటి భావన ప్రకారం కటి(మొల)నుండి పైభాగం ఏడు అవయవాలుగా, క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు.
    రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, సువర్లోకం హృదయం, మహర్లోకం ఉరోభాగం, జనలోకం కంఠం, తపోలోకం పెదవులు, బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి.
    మూడవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి.

బ్రహ్మాండపురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు, పోషిస్తాడు, తనలో లయం చేసుకొంటాడు.

ఊర్ధ్వలోకాలు

  1.     భూలోకం
  2.     భువర్లోకం
  3.     సువర్లోకం
  4.     మహర్లోకం
  5.     జనలోకం
  6.     తపోలోకం
  7.     సత్యలోకం

అధోలోకాలు

  1.     అతలం=మయుడి కుమారుడైన బలుడి వినోద స్థానం.
  2.     వితలం=హాఠకేశ్వరుడు భవానీ అమ్మవారితో వినోదిస్తుంటాడు.హాఠకి నదీ జలాలతో తయారైన సువర్ణంతో అసుర స్త్రీలు అలంకరించుకొంటుంటారు.
  3.     సుతలం=బలి చక్రవర్తి స్వర్గంలో ఉండే ఇంద్రుడు అనుభవించే భోగాలకన్నా ఎక్కువ భోగాలను అనుభవిస్తూ వైభవంగా పాలిస్తుంటాడు.
  4.     రసాతలం= మయుడు రాక్షసులుండే పట్టణాలను నిర్మిస్తుంటాడు. దానవ దైత్యులు, నివాతకవచులు, కాలకీయులు ఉంటారు. వీరంతా మహా సాహసవంతులు.
  5.     మహాతలం=కద్రువకు జన్మించిన సర్పాలుంటాయి. కుహుడు, తక్షకుడు, కాళేయుడు, సుషేణుడులాంటి గొప్ప గొప్ప సర్పాలన్నీ గరుత్మంతుని భయంతో బయటకు రారు.
  6.     తలాతలం=రుద్రుడి రక్షణలో ఉంటుంది.
  7.     పాతాళం=నాగజాతి వారుంటారు. వాసుకి, శంఖుడు, కులికుడు, ధనుంజయుడులాంటి మహా నాగులన్నీ గొప్ప గొప్ప మణులతో ప్రకాశిస్తుంటాయి. ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడుండేది. ముఫ్పై వేల యోజనాల కైవారంలో చుట్టచుట్టుకుని ఉంటాడు. ఆదిశేషుడి పడగ మీద ఈ భూమండలం అంతా ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. ప్రళయకాలంలో ఆ ఆదిశేషుడే ఏకాదశ రుద్రులను సృష్టించి సృష్టి అంతా లయమయ్యేలాగా చేస్తుంటాడు.

ఈ ఏడు అథోలోకాలు ఒక్కోక్కటి పదివేల యోజనాల వెడల్పు అంతే లోతు కలిగి ఉంటాయి. వీటిని బిలస్వర్గాలు అని కూడా అంటారు. ఈ లోకాల్లో కూడా కామ, భోగ, ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్టే ఇక్కడి వారికి లభిస్తుంటాయి. ఈ లోకాలన్నిటినీ మయుడు నిర్మించాడు.అంతులేని కామభోగాలను నిరంతరం అనుభవిస్తూ ఉండటమే ఈ లోకవాసుల పని. ఊర్ధ్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడి వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు. అయితే సర్పాల మణులు దేదీప్యంగా కాంతులీనుతూ ఈ లోకాలలో వెలుగును ప్రసరింప చేస్తుంటాయి. ఇక్కడి వారంతా వ్యాధులకూ, వార్ధక్యానికీ, మానసిక బాధలకూ దూరంగా ఉంటారు.
  • లోకాల తత్వం : ప్రాణిలోకం ఎల్లప్పుడూ సుఖాన్ని కోరుకుంటుంది. అయితే వారికి లభించే సుఖం తత్వం లోకాన్నిబట్టి మారుతుంది. భూర్భువస్వర్లోకాలలో లభించే సుఖం నిత్యమైనది కాదు. నాల్గవదైన మహర్లోకం క్రమముక్తికి స్థానం కాని కల్పాంత సమయాలలో అక్కడా తాపం తప్పదు. మహర్లోకం పైన జనలోకం ఉన్నది. ఆ లోక ప్రవేశం మొదలుకొని శాశ్వత సుఖం ఆరంభమవుతున్నది. అది అమృతరూపం. జనలోకంపైన ఉన్న తపోలోకంలోని సుఖం శాస్వతమైనదే కాక క్షేమరూపంలో ఉంటున్నది. తపోలోకం పైన ఉండే సత్యలోకంలో సుఖం శాశ్వతము. మోక్షప్రదము కూడాను.

వనరులు---శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదు @ తెలుగు వికీపిడియా.

  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, October 25, 2012

How does vacume cleaner work?-వ్యాక్యూమ్‌ క్లీనర్‌ ఇదెలా సాధ్యం?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఆన్‌ చేసినప్పుడు దుమ్ము, ధూళి అన్నీ అందులోకి వెళ్లిపోతాయి. ఇదెలా సాధ్యం?

జవాబు: కూల్‌డ్రింక్‌ సీసాలో స్ట్రాను పెట్టి పీల్చితే ఏం జరుగుతుందో వ్యాక్యూమ్‌ క్లీనర్‌లో కూడా అదే జరుగుతుంది. స్ట్రాను పీల్చినప్పుడు అందులోని మొత్తం గాలి ఖాళీ అవడం వల్ల అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ప్రదేశంలోకి బయటి గాలి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నంలో సీసాలోని కూల్‌డ్రింక్‌ను కూడా అందులోకి తోస్తుంది. అలా డ్రింక్‌ నోట్లోకి చేరుతుంది. గాలి ఎక్కువ పీడనం ఉన్న ప్రదేశం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి ప్రవహిస్తుందనే సూత్రం ఇందులో ఇమిడి ఉంది. విద్యుత్‌ శక్తితో పనిచేసే వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఆన్‌ చేసినప్పుడు అందులోని మోటారు పనిచేసి ఒక ఫ్యాన్‌ గిరగిరా తిరుగుతుంది. అది క్లీనర్‌ గొట్టంలో ఉండే గాలిని బయటకు పంపేస్తుంది. ఫలితంగా అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి బయట ఉండే గాలి వేగంగా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ గాలితో పాటే అక్కడ ఉండే దుమ్ము, ధూళి లోపలికి చేరడంతో ఆ ప్రదేశం శుభ్రపడుతుంది. అలా వ్యాక్యూమ్‌ క్లీనర్‌ లోపలికి చేరిన వ్యర్థాలను ఆ తర్వాత దులిపేసి తిరిగి దానిని వాడకానికి సిద్ధంగా ఉంచుతారు.


-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why hissing sounds at Ear?-చెవి దగ్గర ఆ హోరేమిటి?


  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: చెవి దగ్గర అరచేతిని దొప్పలా చేసి పెట్టినా, ఏదైనా గ్లాసును పెట్టినా సముద్రపు హోరులాగా శబ్దం వినిపిస్తుంది. ఎందుకని?

జవాబు: కాంతి ఏ యానకమూ లేకుండా ప్రయాణిస్తుంది కానీ, శబ్దానికి విధిగా యానకం కావాలి. మన భూమ్మీద ఉన్న వాతావరణంలోని గాలిలో కలిగే కంపనాల ద్వారానే మనం శబ్దాలను వినగలుగుతున్నాం. గాలి అణువులను సంపీడినీకరణం (densities),విరళీకరణం (rarification) చేసే విధంగా గాలిలో అనుదైర్ఘ్య తరంగాలు (longitudinal waves) ఏర్పడతాయి. ఇవే శబ్దతరంగాలు. శబ్ద తరంగాలు గాలిలో వెళ్తున్న క్రమంలో తమ తరంగ శక్తిని కోల్పోతూ ఉంటాయి. అందువల్లనే మనం దగ్గర శబ్దాలను స్పష్టంగాను, దూరం శబ్దాలను అస్పష్టంగాను వింటాము. దీనినే తరంగ పతనం (wave dissipation) అంటాము. సాధారణంగా గాలిలో అనేక రణగొణ ధ్వనులు ప్రసరిస్తూ ఉంటాయి. అయితే అవి మన చెవి వినగలిగిన మోతాదులో ఉండకపోవడం వల్ల మనకు అవి అంతగా వినిపించవు. కానీ చెవి దగ్గర చెంబునో, గ్లాసునో, అరచేతి దొప్పనో పెట్టినప్పుడు ఆ లోపలి భాగంలోకి వెళ్లిన ధ్వని తరంగాలు పదేపదే అక్కడికక్కడే తిరుగాడడం వల్ల శబ్ద తీవ్రత పోగుపడి చెవిలోకి వినిపిస్తుంది. అది హోరులాగా ఉంటుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How does vacume cleaner work?-వ్యాక్యూమ్‌ క్లీనర్‌ ఇదెలా సాధ్యం?


  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఆన్‌ చేసినప్పుడు దుమ్ము, ధూళి అన్నీ అందులోకి వెళ్లిపోతాయి. ఇదెలా సాధ్యం?

జవాబు: కూల్‌డ్రింక్‌ సీసాలో స్ట్రాను పెట్టి పీల్చితే ఏం జరుగుతుందో వ్యాక్యూమ్‌ క్లీనర్‌లో కూడా అదే జరుగుతుంది. స్ట్రాను పీల్చినప్పుడు అందులోని మొత్తం గాలి ఖాళీ అవడం వల్ల అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ప్రదేశంలోకి బయటి గాలి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నంలో సీసాలోని కూల్‌డ్రింక్‌ను కూడా అందులోకి తోస్తుంది. అలా డ్రింక్‌ నోట్లోకి చేరుతుంది. గాలి ఎక్కువ పీడనం ఉన్న ప్రదేశం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి ప్రవహిస్తుందనే సూత్రం ఇందులో ఇమిడి ఉంది. విద్యుత్‌ శక్తితో పనిచేసే వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఆన్‌ చేసినప్పుడు అందులోని మోటారు పనిచేసి ఒక ఫ్యాన్‌ గిరగిరా తిరుగుతుంది. అది క్లీనర్‌ గొట్టంలో ఉండే గాలిని బయటకు పంపేస్తుంది. ఫలితంగా అందులో శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి బయట ఉండే గాలి వేగంగా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ గాలితో పాటే అక్కడ ఉండే దుమ్ము, ధూళి లోపలికి చేరడంతో ఆ ప్రదేశం శుభ్రపడుతుంది. అలా వ్యాక్యూమ్‌ క్లీనర్‌ లోపలికి చేరిన వ్యర్థాలను ఆ తర్వాత దులిపేసి తిరిగి దానిని వాడకానికి సిద్ధంగా ఉంచుతారు.


-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is the age of Universe?-విశ్వం వయసెంత?



  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 



ప్రశ్న:మొత్తం విశ్వం వయసెంత? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు ఈ విశ్వం ఉంటుంది?

జవాబు: విశ్వం ఆవిర్భావం గురించి చాలా వాదనలు ఉన్నాయి. అన్నింటికీ ఎంతో కొంత శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మూడు. అవి: 1. స్టడీ స్టేట్‌ థియరీ (Steady State Theory) 2. ఆస్లేటింగ్‌ థియరీ (Oscillating Theory) 3. బిగ్‌బ్యాంగ్‌ థియరీ(Big Bang Theory).

ఈ మూడింటిలో అత్యధిక శాస్త్రీయ రుజువులున్న మహావిస్ఫోట సిద్ధాంతం (బిగ్‌బ్యాంగ్‌) ప్రకారం మనం ఉన్న ఈ విశాల విశ్వం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం కేవలం ఓ రాగిగింజ కన్నా తక్కువ పరిమాణంలో ఉండేది. అది ఒక్కపెట్టున పేలిపోయి అత్యధిక సాంద్రతర రూపం నుంచి చెల్లాచెదురై మొదట చాలా చిన్న చిన్న ప్రాథమిక కణాల (fundamental particle) వాయువుగా ఉండేది. ఆ కణాలు తిరిగి పునర్వ్యవస్థీకరించుకునే క్రమంలో పరమాణువులు, అణువులు, ఘన, వాయు, ద్రవ రూపాలుగా ఉన్న పదార్థాల మయమైన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలుగా రూపొందాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్యం వ్యాకోచిస్తూ ఉంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. అయితే హరాత్మక విశ్వ సిద్ధాంతం(oscillating universe Theory ప్రకారం విశ్వం సంకోచవ్యాకోచాల మయం. సంకోచించి చిన్న రూపమైనందువల్లే మహావిస్ఫోటం జరిగిందని దీని వాదన. కాబట్టి ఇది వ్యాకోచించి ఆ తర్వాత తిరిగి గురుత్వాకర్షణ(gravitational forces) వల్ల దగ్గరై మళ్లీ మరో విస్ఫోటానికి దారి తీస్తుంది. ఇక స్టడీ స్టేట్‌ థియరీ ప్రకారం ఈ విశ్వానికి ఆది, అంతం అంటూ ఏమీ లేవు. వివిధ గతులు, దశలు (Stages and Phases) ఉంటాయి. ఒక గతిలో కొంత కాలం ఉంటుంది. అది ఒక దశ. అది కొనసాగి మరో గతికి చేరుకుని అక్కడ మళ్లీ కొంత కాలం సాగుతుంది. ఇది మరో దశ. ఇలా పదే పదే దశలు, గతులు మార్చుకుంటూ అవిశ్రాంతంగా అనాదిగా, అనంతంగా ఈ విశ్వం కొనసాగుతుంది. అలాంటి గతి మార్పుల్లో ఒకటే మహావిస్ఫోటమనేది ఈ సిద్ధాంతం వాదన. నేడు శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది ఈ సిద్ధాంతానికే మద్దతు తెలియజేస్తున్నారు. ఇదే నిజమైతే మన విశ్వం ఇంకెంత కాలమైనా ఉంటుంది.


- ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Handle in a Clock movement-గడియారంలో మూడుముళ్లు తిరగడం

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: గడియారంలో మూడుముళ్లు వేర్వేరు వేగాలలో ఎలా తిరుగుతాయి?

జవాబు: ఒకప్పుడు 'కీ' ఇవ్వడం ద్వారా ఒక సర్పిలాకార స్ప్రింగ్‌లోకి శక్తిని నింపినపుడు, అది తిరిగి యధాస్థితికి చేరే క్రమంలో విడుదల చేసే యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని గడియారపు ముళ్లు తిరగేవి. నేడు ఎలక్ట్రానిక్స్‌ పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ద్వారా ప్రత్యేకమైన విద్యుత్‌ సర్క్యూట్‌ ద్వారా క్వార్ట్‌ ్జ(Quartz) స్ఫటికానికి విద్యుత్‌ను పంపినప్పుడు అది జరిపే సంకోచ వ్యాకోచాల యాంత్రిక శక్తితో గడియారపు ముళ్లను నడిపిస్తున్నారు.
ఈ సర్క్యూట్‌కు కావలసిన శక్తిని చిన్న బొత్తాము ఘటం(button cell) ద్వారా సమకూరుస్తారు. కాబట్టి పాత 'కీ' గడియారమైనా కొత్త క్వార్ట్‌ ్జ గడియారమైనా మొదట తన శక్తిని ఓ చక్రానికి బదలాయిస్తుంది. ఇది ఓ పళ్ల చక్రం (toothwheel). దీనికి వివిధ వ్యాసార్థాలు ఉన్న మూడు వేర్వేరు పళ్ల చక్రాలను అనుసంధానిస్తారు. ప్రధాన చక్రానికి ఉండే పళ్లకు అనుగుణంగా అనుసంధాన చక్రాలకు ఉన్న పళ్ల సంఖ్యను మార్చడం ద్వారా అవి వేర్వేరు వేగాలతో తిరిగేలా చేస్తారు. ఆ చక్రాలకే గడియారం డయల్‌పై తిరిగే ముళ్లను కలుపుతారు. ఆయా చక్రాల వేగాన్ని బట్టి గడియారంలో ఒక ముల్లు గంటలను, ఒక ముల్లు నిమిషాలను, మరో ముల్లు సెకన్లను సూచించేలా వేర్వేరు వేగాలతో తిరుగుతాయి. ఇలా అవసరాన్ని బట్టి మరిన్ని చక్రాలను, ముళ్లను కూడా అనుసంధానించుకోవచ్చును.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, -వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is that God Particle?-ఏమిటా దైవకణం?


  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: కొన్నాళ్ల క్రితం శాస్త్రవేత్తలు దైవకణం కనుగొన్నారని విన్నాము. అసలా కణం ఏమిటి?

జవాబు: సుమారు 13 బిలియన్ల సంవత్సరాల క్రితం సంభవించిన బిగ్‌బ్యాంగ్‌ (మహా విస్ఫోటం) వల్ల మన విశ్వం ఏర్పడిందని శాస్త్రవేత్తల అంచనా. పీటర్‌ హిగ్స్‌ అనే బ్రిటిష్‌ కణ భౌతిక శాస్త్రవేత్త ప్రకారం అలా ఏర్పడిన విశ్వం మొత్తాన్ని కంటికి కనిపించని ఒక అపూర్వశక్తి స్వరూపం ఆవరించుకుని ఉంది. ఈ క్షేత్రమే విశ్వంలో ఉండే ద్రవ్యం (matter)లోని మౌలిక కణాలతో సంపర్కం చెందడంతో 'హిగ్‌ బోసాన్లు' అనే కణాలు ఏర్పడ్డాయి. ఇవే పదార్థాలలో ఉండే పరమాణువుల నిర్మాణానికి దోహదపడే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు మొదలైన కణాలకు ద్రవ్యరాశి (mass)ను సమకూరుస్తాయి. ఆ ద్రవ్యరాశి లేకపోతే అణువులూ, పరమాణువులూ ఏవీ లేవు. నక్షత్రాలు, గ్రహాలు అంటూ ఏవీ ఏర్పడేవి కావు. జీవం అంటే ప్రాణికోటి మనుగడే లేదు. అసలు విశ్వమే లేదు. ఆ విధంగా సృష్టిలోని ప్రతి అణువుకూ నారూ నీరూ పోస్తున్న ఈ అద్భుత కణం 'హిగ్‌బోసాన్‌'ను శాస్త్రవేత్తలు దైవకణం (God Particle) అన్నారు.

గ్రాములో ఐదువేల బిలియన్‌ బిలియన్‌ బిలియన్ల వంతు ఉండే ఈ కణాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ సరిహద్దులోని భూగర్భంలో పదేళ్ల పాటు శ్రమించి ప్రపంచంలోనే పెద్దదైన, ఖరీదైన 'లార్జ్‌ హార్డాన్‌ కొలైడర్‌' అనే యంత్రాన్ని నిర్మించారు. ఈ యంత్రంలో కాంతి వేగంతో పయనించే ప్రోటాన్లు ఒకదానికొకటి ఢీకొని విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా ఉత్పన్నమయ్యే అతి సూక్ష్మకణాల నుంచి శాస్త్రవేత్తలు దైవకణాన్ని గుర్తించారు. ఆ సమయంలో ఆ కణాన్ని ప్రతిపాదించిన పీటర్‌హిగ్స్‌ అక్కడే ఉండడం విశేషం!

ఈ ప్రయోగం ద్వారా బిగ్‌బ్యాంగ్‌ నాటి పరిస్థితులను తిరిగి ప్రయోగశాలలో సృష్టించడమే కాకుండా ఇప్పటికీ శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్న కృష్ణద్రవ్యం (Dark matter), కృష్ణబిలాలు(Black holes) గురించి సాధ్యమైనన్ని వివరాలన్నో తెలుసుకోవచ్చు.


-ప్రొ||ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Do Earth energy diminishes?- భూమి శక్తి అయిపోతుందా?

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మనం చేసే ప్రతి పనికీ కొంత శక్తి అవసరం. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తోంది కదా, ఆ శక్తి భూమికి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వేళ ఆ శక్తి అయిపోతే భూమి తిరగడం ఆగిపోతుందా?

జవాబు: ఒక వస్తువును నిరోధ బలాన్ని (resistant force) అధిగమిస్తూ కొంత దూరం జరపవలసినప్పుడే శక్తి అవసరం అవుతుంది. ఒక పదార్థపు ఉష్ణోగ్రతను లేదా శక్తిస్థాయి (energy level)ని తక్కువ విలువ నుంచి ఎక్కువ విలువకు చేర్చడానికీ శక్తి కావాలి. భూమి తన చుట్టూ తాను తిరిగే భ్రమణ (spin) ప్రక్రియలో కానీ, సూర్యుడి చుట్టూ తిరిగే పరిభ్రమణ(revolution) ప్రక్రియలో కానీ భూమి ఎదుర్కొనే ఘర్షణ (friction) లేదా అవరోధ బలం (opposing force) అంటూ ఏవీ లేవు. అంటే భూమి తన భ్రమణ, పరిభ్రమణ ప్రక్రియల్లో శక్తిని ఖర్చు పెట్టవలసిన అగత్యం ఏమీ లేదు. అంటే భూమి కదలికల వెనుక శక్తి పనిచేయడం లేదని కాదు అర్థం. భూమి కదలికలకు అవసరమైన శక్తి తన పుట్టుకతోనే విశ్వజనీనంగా లభ్యమైంది. అలా లభ్యమైన శక్తి ఎంత మాత్రం ఖర్చు కావడం లేదు. అందువల్ల భూమి శక్తి అయిపోవడమనే ప్రశ్నగాని, భూమి ఆగిపోతుందనే భయంగాని అవసరం లేదు.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-