Tuesday, September 29, 2015

ధ్రువాల వద్ద ఉండే ఎలుగుబంటి ఒంటిపై వెంట్రుకలు తెల్లగా ఉంటాయి. ఎందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

  ప్రశ్న: ధ్రువాల వద్ద ఉండే ఎలుగుబంటి ఒంటిపై చర్మం నల్లగా ఉండి, దానిపై వెంట్రుకలు తెల్లగా ఉంటాయి. ఎందుకు?


జవాబు: సామాన్యంగా అడవుల్లో ఉండే ఎలుగు బంటి దేహంపై ఉండే చర్మం రంగు, దానిపై గుబురుగా ఉండే వెంట్రుకల రంగూ నల్లగానే ఉంటుంది. అదే ధ్రువ ప్రాంతాల్లో ఉండే ఎలుగుబంటి దేహంపై చర్మం నల్లగా ఉంటే, దానిపై గుబురుగా ఉండే వెంట్రుకలు (బొచ్చు) రంగు తెల్లగా మెరుస్తూ ఉంటుంది. మామూలు ఎలుగుబంటి చర్మంపై ఉండే మందమైన, గుబురైన వెంట్రుకలు శీతాకాలంలో చలి బారిన పడకుండా ఒక కవచంలా, ఉష్ణ బంధకంలా పనిచేస్తుంది. అదే ధ్రువ ప్రాంతంలో పరిసరాలను గడ్డ కట్టించే చలి బారి నుంచి అక్కడి ఎలుగుబంట్లను కాపాడడానికి వాటి చర్మం, దానిపై ఉండే తెల్లటి వెంట్రుకలు బోలుగా ఉండి, వాటిలో గాలి నిండి ఉండడంతో అవి ఉత్తమ ఉష్ణ బంధకరూపంలో పని చేస్తాయి. గాలి ఉత్తమ ఉష్ణ బంధకం.

ధ్రువపు ఎలుగుబంట్ల చర్మం తెల్లగానో లేక లేత పసుపు రంగులోనో కనబడుతుంది. కారణం బోలుగా ఉండే వెంట్రుకల ద్వారా పయనించే సూర్యరశ్మి దాని చర్మంపై ప్రతిఫలించడమే. నిజానికి వాటి చర్మం రంగు నలుపు. అందువల్ల బోలుగా ఉండే వెంట్రుకలగుండా పయనించే సూర్య రశ్మి రంగులు  బాగా శోషించడంతో వాటి రంగు తెల్లగా మెరుస్తూ ఉంటుంది.
Polar bear hair looks white because the air spaces in the hairs scatter light of all colors. When something reflects all of the visible wavelengths of light, we see the color white.



చలి ఎక్కువగా లేని జూలో ("zoo") పెరిగే పోలార్ బే్ర్స్ కొన్ని నల్ల రంగులొనూ కొన్ని గోధుమ రంగులోనూ  ఉంటాయి

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు--హైదరాబాద్‌
  • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  



ప్రశ్న: పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా?

జవాబు: పిడుగు అనేది రెండు వేర్వేరు ధ్రువత్వం గల విద్యుదావేశాలతో నిండుకున్న మేఘాల మధ్య జరిగే విద్యుదుత్సర్గం. ఒక వేళ ఒక మేఘానికి దగ్గర్లో మరో మేఘం లేనట్లయితే మేఘంలో ఏ ధ్రువత్వం గల విద్యుదావేశం పోగు పడిందన్న విషయంలో సంబంధం లేకుండా ఆ స్థిర విద్యుత్తు భూమి వైపు ప్రసరిస్తుంది. ఆ సమయంలో మేఘానికి దగ్గరగా ఎవరున్నా (చెట్లు, భవనం, విద్యుత్సంభం, వ్యవసాయదారుడు లేదా దారిన పోయే దానయ్య, పశువు) వారు విద్యుత్ప్రవాహి అయినట్లయితే వారి గుండా ఈ అధిక విద్యుత్తు ప్రవహించి మరణానికి దారి తీస్తుంది.

ఈ విపత్పరిణామాన్నే మనం పిడుగు పాటు అంటాం. పిడుగు పడే సమయంలో విద్యుత్తు ఉన్న మేఘానికి, భూమికి మధ్య కొన్ని లక్షల వోల్టుల విద్యుత్తు పొటన్షియల్‌ ఉంటుంది. ఈ విద్యుదుత్సర్గం లిప్తపాటు మాత్రమే ఉంటుంది. అదే పనిగా గంటల తరబడి కొనసాగదు. అంత తక్కువ వ్యవధిలో అంత అధిక మోతాదులో ఉన్న విద్యుత్తును నిల్వ చేయగల పరికరాలు, సాధనాలు లేవు. ప్రవహించే విద్యుత్తును దాచుకొని ఆ తర్వాత వాడుకోగలిగిన వ్యవస్థలు భౌతికంగా కెపాసిటర్లు, రసాయనికంగా ఛార్జబుల్‌ బ్యాటరీలు మాత్రమే! కానీ పిడుగు పడే సమయంలో వాటిని పిడుగు మార్గంలో ఉంచితే అవి కాలిపోవడం మినహా విద్యుత్తు నిల్వ ఉండటం దాదాపు అసంభవం.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

ఏ పాలు మనం తాగవచ్చు? ఏయే పాలు హానికరం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
  ప్రశ్న: ఏ పాలు మనం తాగవచ్చు? ఏయే పాలు హానికరం?

జవాబు: పాలు జంతువులనుండి , కొన్ని చెట్లనుండి లభిస్తాయి. జంతువు ఏదైనా పాలు వాటి శిశువులకు పోషణ ఇచ్చేందుకే ప్రకృతి సిద్ధంగా క్షీరదాలలో ఉన్న ప్రక్రియ. క్షీరదం ఏదైనా దాని ప్రతి కదలికకు, జీవన చర్యలకు కావాల్సింది గ్లూకోజు మాత్రమే! మనలాగే వాటికీ పెరుగుతున్న దశలో కాల్షియం వంటి లవణాలతో పాటు చక్కెరలు, పోషక విలువలున్న ఆహారం అవసరం. అది పాల ద్వారా శిశు దశలో లభిస్తుంది. కాబట్టి ఏ జంతువు పాలూ మనకు విషతుల్యం కాదు. పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి గేదె పాలయినా, ఆవు పాలయినా, గాడిద పాలు, మేక పాలు అయినా పాలను మరగబెట్టి తాగితే ఆరోగ్యానికి మంచిది. జిల్లేడు పాలు, మర్రిచెట్టు పాలు, రబ్బరు పాలు, రావి చెట్టు పాలు, గన్నేరు చెట్టు పాలు పోషక విలువలున్న పాలు కావు. ఆ పాలు ఆయా చెట్లకు రక్షణనిచ్చే విష ద్రవాలు. తెల్లనివన్నీ పాలు కావన్న సామెత ఇక్కడే అమలవుతుంది. చెట్ల పాలు తాగకూడదు కానీ జంతువుల పాలు వేడి చేసుకుని తాగితే ఏదీ హానికరం కాదు.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, September 16, 2015

హిందూ మతం లో ఎవరెవరిని పుత్రులు గా పరిగనిస్తారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  
ప్ర : హిందూ మతం లో ఎవరెవరిని పుత్రులు గా పరిగనిస్తారు?

జ : 
  •  ధర్మార్ధ కామమోక్షాలకు బాసటగా ఉన్న తాళికట్టిన భార్యకు జన్మించినవాడు -పుత్రుడు లేక కన్నపుత్రుడు ..
  • తన గోత్రపువారినుండి వచ్చినవాడు -క్షేత్రజ్ఞపుత్రుడు .
  • తమకి సంతానము లేకపోవడము వలన ఇంకొ దంపతులనుండి స్వీకరించిన వాడు - దత్తపుత్రుడు .
  • తన భార్యకి తననుంచి కాకుండా.. బలత్కారమువల్లా, భయపెట్టి లొంగదీసుకున్నప్పుడు పుట్టినవాడు - గూఢోత్పన్నపుత్రుడు.
  • కని రోడ్డుమీద వదిలేసినవాణ్ణి పెంచుకుంటే - ఆపద్ధర్మపుత్రుడు .
  • వివాహానికి ముందు పుట్టినవాడు - క్షేత్రజ పుత్రుడు.
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-