Wednesday, April 29, 2015

How they breath in space?-రోదసిలో గాలి ఎలా పీలుస్తారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: శూన్యంగా ఉండే రోదసిలో అంతరిక్ష యాత్రికులు గాలిని ఎలా పీలుస్తారు?

జవాబు: వ్యోమనౌకలో ఉండే తక్కువ ప్రదేశంలో 3 నుంచి 6 మంది వ్యోమగాములు ఉండటంతో గాలి పీల్చుకునే విషయంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల అక్కడ వారు క్షేమంగా, సౌకర్యవంతంగా ఉండటానికి వ్యోమనౌకలో ECLSS (environmental control and life support systems) అనే వ్యవస్థను ముందుగానే ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థలో నీటి నిర్వహణ (వ్యర్థమైన, మూత్రరూపంలోని నీటిని తొలగించడం), కేబిన్‌లో ఉత్పన్నమయే కార్బన్‌డైఆక్సైడ్‌, అమోనియా, మీథేన్‌ లాంటి వాయువులను తొలగించడానికి కావలసిన పీడనం, ఉష్ణోగ్రత, తేమను నియంత్రించడం, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు కావలసిన ఏర్పాట్లన్నీ ఉంటాయి.

వ్యోమనౌకలో ఉన్న వారు పీల్చుకోవడానికి కావలసిన గాలి (ఆక్సిజన్‌) రెండు మార్గాలలో లభిస్తుంది. ఒకటి నీటి నుంచి విద్యుత్‌ విశ్లేషణ ద్వారా ఆక్సిజన్‌ను తయారు చేయడం. నీటిలో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ కలిసి ఉండటంతో ఈ ప్రక్రియ ద్వారా విడుదలయిన ఆక్సిజన్‌ను శ్వాసించడానికి ఉపయోగించి, హైడ్రోజన్‌ను రోదసిలోకి వదిలేస్తారు. మరో మార్గం వ్యోమనౌక వెలుపలి భాగంలో అమర్చిన టాంక్‌లో పీడనంతో ఉన్న ఆక్సిజన్‌ నుంచి కావలసిన మేరకు ఆక్సిజన్‌ను తీసుకోవడం.

వ్యోమనౌక నుంచి వెలుపలికి వచ్చి రోదసిలో ప్రయోగాలు చేసే వారికి ప్రత్యేకమైన 'స్పేస్‌ సూట్లు' ఉంటాయి. వాటిలో వారు శ్వాసించడానికి కావలసిన ఆక్సిజన్‌ను విడుదల చేసే ఏర్పాట్లు ఉంటాయి. అందులో ఉండే 'పెర్‌క్లోరేట్‌ కాండిల్స్‌' అనే పరికరంలో ఉండే లోహాలు రసాయనిక చర్యల ద్వారా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

How the Oxygen cylinders works?- ఆక్సిజన్‌ సిలిండర్ల పనితనమేంటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...








ప్రశ్న: కృత్రిమంగా అమర్చే ఆక్సిజన్‌ సిలిండర్లు ఎలా పనిచేస్తాయి?

జవాబు: కృత్రిమ శ్వాస అందించడంలో కీలకమైనవి ఆక్సిజన్‌ వెంటిలేటర్లే. మామూలు సిలిండర్లలో పెద్ద పనితనం ఏమీ లేదు. చిన్న వాల్వ్‌ పిన్నును తెరవడం, రెగ్యులేటర్ల ద్వారా సిలిండర్లలోని గాలిని ఒకే దిశలో ఆశించిన పీడనంలో బయటకు పంపడం మినహా వాటిలో మరే తతంగం లేదు. కానీ ఆక్సిజన్‌ వెంటిలేటర్లు వేరు. ఎవరికయినా అత్యవసర చికిత్స అవసరమైనపుడు, ఊపిరితిత్తుల పనితనం స్తంభించిపోయినపుడు, కోమాలోకి వెళ్లినపుడు కృత్రిమంగా శ్వాస ప్రక్రియను నిర్వహించాలి. అలాంటి సందర్భాలలో సిలిండర్లలో ఉన్న ఆక్సిజన్‌ను తగు మోతాదులో తగిన పీడనంలో రోగి ముక్కు లేదా నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి పంపుతారు. సాధారణంగా ఇలా కృత్రిమంగా పంపే ఆక్సిజన్‌ (ఒక్కోసారి నైట్రోజన్‌లో కలిసి) పీడనం బయటి వాతావరణ పీడనం కన్నా హెచ్చుగా ఉండడం వల్ల బలవంతంగానే ఆక్సిజన్‌ లోపలికి వెళ్లి రోగి ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలుస్తుంది. అదే సమయంలో అధిక పీడనం వల్ల వ్యాకోచించిన ఊపిరితిత్తుల ప్రోద్బలంతో పేషెంటు ఉదర వితానం (diaphragm)కూడా వ్యాకోచిస్తుంది. ఇది ఉచ్ఛ్వాస ప్రక్రియ (inspiration).ఈ దశకాగానే ప్రత్యేకమైన వాయు సరఫరా పద్ధతుల ద్వారా గాలిని పంపడం నిలుపు చేస్తారు. అప్పుడు ఉదరవితానం సంకోచించడం ద్వారా నిశ్వాస ప్రక్రియ (expiration)జరుగుతుంది. అపుడు విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడు, నీటి ఆవిరి మరో మార్గం ద్వారా గాల్లో కలుస్తాయి. ఇలా ఉచ్ఛ్వాస, నిశ్వాస ప్రక్రియనే కృత్రిమ శ్వాస క్రియ అంటారు. ఈ విధానంలో ఉపయోగపడే పరికరాల్ని వెంటిలేటర్లు అంటారు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--జనవిజ్ఞానవేదిక, శాస్త్రప్రచార విభాగం (తెలంగాణ)



  • ===============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Tuesday, April 28, 2015

Ash color is white why?,బూడిద తెల్లగా ఉంటుందేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద తెల్లగా ఉంటుంది. ఎందువల్ల?

జవాబు: బొగ్గులో కార్బన్‌ కణాలుంటాయి. వాటి రంగు నలుపు. బొగ్గును కాల్చినపుడు ఆ కార్బన్‌ గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌ డై ఆక్సైడ్‌గా మారుతుంది. అలా అయితే, బొగ్గు పూర్తిగా కాలిపోతే ఆ ప్రదేశంలో మరేమీ మిగిలి ఉండకూడదని, ఒకవేళ పూర్తిగా కాలకపోతే కొన్ని నల్లని కార్బన్‌ కణాలు మాత్రమే ఉండాలని అనుకుంటాం. కానీ అలా జరగడంలేదు. ఎందువల్లనంటే, బొగ్గులో నల్లని రంగులో ఉండే కార్బన్‌ కణాలే కాకుండా కార్బన్‌, హైడ్రోజన్‌ కలిసి ఉండే హైడ్రోకార్బన్‌ సమ్మేళనాలు, పొటాషియం, కాల్షియం అల్యూమినియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.

బొగ్గును కాల్చినపుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఏర్పడడంతోపాటు అందులోని హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్‌, కార్బన్‌లుగా విడివడతాయి. కార్బనేమో ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌డై ఆక్సైడ్‌ వాయువుగా మారితే, హైడ్రోజనేమో ఆక్సిజన్‌తో కలిసి నీటి ఆవిరిగా మారుతుంది. ఇక ఖనిజ లవణాలలోని ఖనిజాలు ఆక్సిజన్‌తో కలిసి ఖనిజ ఆక్సైడ్లుగా మారుతాయి. ఈ ఆక్సైడ్‌లు ఉష్ణం వల్ల సులభంగా విడివడకపోవడంతో తెల్లని పొడి (బూడిద) రూపంలో మిగిలిపోతాయి. ఒక్కోసారి కాలకుండా మిగిలిన కార్బన్‌ కణాలు, ఖనిజ ఆక్సైడ్‌లతో ఏర్పడిన తెల్లని బూడిదతో కలవడం వల్ల ఈ పొడి బూడిదరంగులో కూడా ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

   

  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Some flowers open in nights why?.కొన్ని పువ్వులు రాత్రుల్లోనే విచ్చుకుంటాయెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...








ప్రశ్న: సన్నజాజి, విరజాజి వంటి కొన్ని పువ్వులు రాత్రుల్లోనే ఎందుకు విచ్చుకుంటాయి?

జవాబు: పుష్పాల రంగులకు, మకరందాల రుచులకు, సుగంధపు వాసనలకు కారణం వివిధ రకాల సేంద్రియ రసాయనాలే. రంగులనిచ్చేందుకు కెరోటిన్‌ పదార్థం కారణం. అలాగే గ్లూకోజు, ఫ్రక్టోజు వంటి వివిధ రకాల తేలిక పాటి చక్కెర పదార్థాల వల్లే మకరందాలు తేమగా ఉంటాయి.

పుష్పాలకున్న విశిష్టమైన సువాసనలకు కారణం ఆయా పుప్పొడి రేణువుల మీద, పుష్ప దళాల మీద ఉండి తేలిగ్గా ఆవిరయ్యే టర్పీనులు, ఎస్టర్లు, ఆల్కలాయిడ్లు కారణం. పుష్పాల రంగులు, మకరందాల రుచులు, పుష్ప సౌరభాల గుబాళింపులు వృక్షజాతుల్లో పరపరాగ సంపర్కాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి ఎంచుకున్న ఏర్పాటే. రాత్రుళ్లు సంచరించే కీటకాల ద్వారా పుప్పొడి రేణువుల వ్యాప్తి కోసమే కొన్ని పుష్పాలు రాత్రుళ్లు విచ్చుకుంటాయి. పుష్పాలలో ఉన్న మకరందాల, వర్ణాల, వాసనల రసాయనాలకు కాంతి సమక్షంలో చర్యనొందే లక్షణాలుంటాయి. కాంతి సమక్షంలో రసాయనాలు ప్రేరేపితమై పత్రదళాల్ని విప్పారించే విధంగా పగలు విచ్చుకునే పుష్పాలలో ఏర్పాటు ఉంటుంది. కాంతి ఉంటే విచ్చుకోకుండా కాంతి లేనట్లయితే చీకట్లో దళాల్ని విప్పదీసే విధంగా విరజాజి, సన్నజాజి కొన్ని మల్లె జాతుల్లో ఏర్పాటు ఉంటుంది. కాంతి గ్రాహకాల రసాయనిక లక్షణాల ఆధారంగానే పగలు లేదా రాత్రిళ్లు విచ్చుకునే తేడా ఉంటుంది.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)


  • ===============================

visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Monday, April 27, 2015

Petrole gives cool feeling on hands why?, పెట్రోల్‌ చేతిపై పడితే చల్లగా ఉంటుందెందుకు?

... 


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !




ప్రశ్న: పెట్రోల్‌ చేతిపై పడితే చల్లగా ఉంటుందెందుకు?



జవాబు: పాత్రలలో ఉంచిన ద్రవ పదార్థాలేవైనా గాలిలో పెడితే కొంత కాలం తర్వాత వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి నిదానంగా ఆవిరయిపోతాయి. ఈ ప్రక్రియను భాష్పీభవనం (Evaporation) అంటారు. ఆవిరయ్యే ఉష్ణోగ్రతను భాష్పీభవన స్థానం అంటారు. ఆవిరవుతున్నపుడు ద్రవాల్లోని అణువులు వాటిని ఒకదానిలో మరొకటి బంధించి ఉన్న బంధాలను తెంచుకొని ఆవిరి రూపంలోకి మారి అవి ఉన్న పాత్రలలో నుంచి బయటి వాతావరణంలోకి వెళతాయి. ఇలా జరగడానికి ద్రవంలోని అణువులకు కావలసిన శక్తిని వాతావరణంలోని ఉష్ణం నుంచి గ్రహిస్తాయి. ఒక్కో ద్రవానికి ఒక్కో భాష్పీభవనస్థానం ఉంటుంది. పెట్రోల్‌ భాష్పీభవనస్థానం చాలా తక్కువ. అంటే పెట్రోల్‌, తక్కువ ఉష్ణోగ్రత వద్దే ఆవిరిగా మారుతుంది.

పెట్రోల్‌ మన చేతిపై పడినపుడు అది మన శరీరం నుంచి ఉష్ణం తీసుకొని తక్కువ ఉష్ణోగ్రత వద్దే ఆవిరయి పోవడంతో, అతి తక్కువ కాలంలోనే కొంత ఉష్ణాన్ని కోల్పోయిన మన శరీర భాగం అంటే చేయిపై చల్లగా ఉంటుంది. భాష్పీభవనం చల్లదానాన్ని కలుగచేస్తుంది.

  • ======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Thursday, April 23, 2015

Cranes legs are Long why?, కొంగలకు కాళ్ళు పొడవుగా ఉంటాయెందుకు ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ఫ్ర : కొంగలకు కాళ్ళు పొడవుగా ఉంటాయెందుకు ?

జ : కొంగలకు మిగిలిన శరీరము కన్నా కాళ్ళు మూడూ-నాలుగు రెట్లు పొడవుగా ఉంటాయి. మామూలు గా ఇలా పొడవు కాళ్ళు ఉండడము ఆహారము కోసము నీళ్ళలోకి వెళ్ళే పక్షులలో కనిపిస్తుంది. మిగిలిన సమయము నేలమీద , ఆహారము కోసం నీళ్ళలో నడిచే కొంగలు , ప్లెమింగోల వండి వాటికి నీరు శరీరానికి  తగలకుండా ఉండేందుకు వాటి కాళ్ళు పొడవుగా ఉంటాయి.

పెరిగిన కాళ్ళ రూపానికి తగినట్లే ఈ పక్షులు లలో మెడపొడవు పెరుగుతుంది ... కిందికి వంగి నీటిలోని చేపలను అందుకునేందుకు ఆ మెడ అలా సాగింది .

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

What is penance and Salvation,తపస్సు - మోక్షం అంటే అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







Q : 
తపస్సు అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?మోక్షం అంటే అంటే ఏమిటి?

Ans :తపస్సు అంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాల్లో చేరాలి అని కాదు. భగవంతుని కోసం నిరంతరం తపించటాన్నే ‘తపస్సు’ అంటారు. మనోవాక్కాయకర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు. నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు. ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్ధిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు. అట్లా తపస్సు చేయటం వలన మల విక్షేప ఆవరణలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి. శ్రవణం చేత మల దోషం, మననం చేత విక్షేప దోషం మరియు నిరంతర ధ్యానమనే నిధిధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. ఈ విధంగా మనస్సుని శుద్ధి చేసుకున్న వారికి పాపాలు క్షీణిస్తాయి. వసనాక్షయం జరుగుతుంది. పూర్వ జన్మ వాసనలు క్రమేపి తోలగుతాయి. ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన రూపం మనస్సుకు చేకూరుతుంది. శారీరకమైన ఆవేదనల్ని, ఇంద్రియలోలత్వాన్ని బుద్దిపుర్వకంగా నిగ్రహించుకోవటం వలన మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కాన శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి.

మోక్షం అంటే మనస్సుని, శరీరాన్ని అత్మనుంచి శరీరం ఉండగానే, చైతన్యం ఉండగానే వేర్పాటు చేయడం అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమే కాని మరొకటి కాదు. అదే మోక్షం.

లోకంలో తానే గొప్పవాడినని గర్వించే గుణం ఉండరాదు. అహింస, క్షమాగుణం, మాటలో సరళత, శ్రద్ధతో పెద్దలను పూజించుట, గౌరవించుట, స్థిరబుద్ధి, మనసు-ఇంద్రియ నిగ్రహం వంటి లక్షణాలున్నవాడే తపోనిష్ఠుడు.

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Wednesday, April 22, 2015

Lunar (Moon) eclipse how?,చంద్రగ్రహణం పౌర్ణమి రోజే ఏర్పడడానికి కారణం ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...








 ప్రశ్న: చంద్రగ్రహణం పౌర్ణమి రోజే ఏర్పడడానికి కారణం ఏమిటి?

జవాబు: భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటే, ఆ భూమి చంద్రునితో సహా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలా తిరిగే భూమిపై సూర్యకాంతి నిరంతరం పడుతూనే ఉంటుంది. మరి సూర్యకాంతి పడినపుడు భూమి వెనక నీడ ఏర్పడుతుంది. కానీ అక్కడ అంతా అంతరిక్షం కాబట్టి ఆ నీడ కనపడదు. ఆ నీడపడే ప్రాంతంలోకి చంద్రుడు వచ్చాడనుకోండి. ఆ చంద్రుడే ఓ గోడలా ఉండటంతో భూమి నీడ దానిపై పడుతుంది. ఆ నీడ పరుచుకున్నంతమేర చంద్రుడు కనబడదు. కాబట్టి దాన్నే మనం 'చంద్రగ్రహణం' అంటాం. భూమి నీడలోకి రావడానికి ముందు చంద్రునిపై కూడా సూర్యకాంతి పడుతుంది. అంటే, భూమిపై నుంచి చంద్రుడు గుండ్రంగా, పూర్తిగా కనిపిస్తుంటాడు. అదే పౌర్ణమి. పౌర్ణమి నాడు చందమామగా కనిపిస్తున్నపుడే చంద్రుడు క్రమంగా భూమి నీడలోకి రాగలడు. అపుడే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Tuesday, April 21, 2015

Solar Winds ?-సౌర పవనాలు అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...





  • ప్రశ్న: సౌర పవనాలు అంటే ఏమిటి?

    జవాబు: సౌర పవనాలు విద్యుదావేశంతో కూడిన పరమాణువుల ప్రవాహం. ఈ పవనాల్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, కొంత నిష్పత్తిలో బరువైన కేంద్రకాలు ఉంటాయి. ఇవి సూర్య వాతావరణంలో ఉండే అయస్కాంత క్షేత్రం నుంచి వెలువడుతాయి. సూర్యుని భాగమైన 'కరోనా'లోని అత్యధిక ఉష్ణం వల్ల ఉత్పన్నమయే అధిక పీడనం వల్ల అక్కడ నుంచి వెలుపలకు అంటే గ్రహాంతర ప్రదేశాల్లోని అన్ని దిశలకు ప్రవహించే గాలులే సౌర పవనాలు. సౌర పవనాలు 1,00,000 డిగ్రీల కెల్విన్‌ ఉష్ణోగ్రతతో సూర్యుని నుంచి సెకనుకు 500 కిలోమీటర్ల వేగంతో సూర్యుని క్రియాశీలతని బట్టి వెలువడుతాయి.

    సౌర పవనాలలోని కణాలు భూమిని చేరుకోవడానికి 4, 5 రోజులు పడుతుంది. ఈ పవనాలను అధ్యయనం చేయడం ద్వారా సూర్యునిలో ఏర్పడే అరోరా, అయస్కాంత తుపాను లాంటి దృగ్విషయాలను శాస్త్రజ్ఞులు విశ్లేషించగలుగుతారు.

    - ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Monday, April 20, 2015

Birds migrate how?-పక్షులు ఎలా వలస పోతాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న : పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో చోటికి ఎలా వలస పోతాయి?


జవాబు : ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత కాలంలో పక్షులు ఒకే ప్రదేశానికి వలస పోవడానికి ఎన్నో కారణాలు దోహదపడతాయి. భూమిపై ఉండే నదులు, సముద్ర తీరాలు, పర్వత శ్రేణుల లాంటి భౌగోళిక పరిసరాలను అవి గుర్తు పెట్టుకోగలుగుతాయి. సముద్రాలను దాటి వలసపోయే ముందు పక్షులు సముద్ర తీరంలో ఒక నిర్ణీత ప్రాంతంలో గుమిగూడుతాయి. తర్వాత వాటి దృష్టి వ్యవస్థ ఆధారంగా సముద్రాలను దాటుతాయి. వాటి తలలో మాగ్నటైట్‌ అనే సూక్ష్మకణాలు అయస్కాంత సూచికలాగా పనిచేయడంతో ఆ ప్రభావం వల్ల భూ అయస్కాంత క్షేత్రాన్ని పసిగడుతూ, దానికి అనుగుణంగా దృష్టి వ్యవస్థను అనుసంధానించుకుని ముందుకు సాగుతాయి. ఆపై సూర్యుడు, నక్షత్రాలను గమనిస్తూ పక్షులు తాము వలసపోయే ప్రాంతానికి సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =============================

visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Electric Power from waste- చెత్త నుంచి కరెంటును ఎలా ఉత్పత్తి చేస్తారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







 ప్రశ్న: చెత్త నుంచి కరెంటును ఎలా ఉత్పత్తి చేస్తారు? ఇది ఎన్ని దేశాల్లో అమల్లో ఉంది?

జవాబు: చెత్త అంటే పనికిరాని పదార్థాల సముదాయం. కానీ చెత్తతో కూడా ఉపయోగం ఉందన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ మధ్య అన్ని దేశాల్లో ఘనవ్యర్థ పదార్థాల కార్యకలాపం (solid waste management) ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఉదాహరణకు... తినగా మిగిలిన పదార్థాలు కుళ్లిపోవడం వల్ల కానీ, మనం పారేసిన చెత్త పదార్థాలు కానీ అన్నీ కూడా సేంద్రియ రసాయనాలే. వాటిల్లో ఎంతో శక్తి దాగి ఉంటుంది. అలాంటి వ్యర్థ కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్కులు, పేపర్లు, ఆకులు, పాచీ వగైరా పదార్థాల్ని ఎండబెట్టి వాటిని మండించడం ద్వారా విడుదలయ్యే ఉష్ణశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చగలం.

వ్యర్థ కాగితాల్ని తిరిగి నానబెట్టి గుజ్జుగా మార్చి కొత్తగా కాగితాన్ని తయారు చేయవచ్చు. ఇలా ఎన్నో వ్యర్థ పదార్థాల్ని తిరిగి పునర్వినియోగం చేసే కార్యకలాపం మన దేశంతో సహా అన్ని దేశాల్లో ఉంది.

- ప్రొ ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; --కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)


  • ===========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Ozone bad effects-ఓజోన్‌ కీడు కూడా చేస్తుందా?




  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 






ప్రశ్న: ఓజోన్‌ వాయువు వల్ల మేలేకాకుండా కీడు కూడా ఉందని అంటారు. నిజమేనా?

జవాబు: ఓజోన్‌ వాయువు భూ వాతావరణంలో పై భాగంలో ఉంటేనే మేలు. అదే కింది భాగంలో ఉంటే కీడు.
భూమి వాతావరణాన్ని వివిధ ఆవరణాలుగా విభజించారు. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్లు దాటాక 50 కిలోమీటర్ల లోపు వ్యాపించి ఉండే ప్రదేశాన్ని నిశ్చలావరణం అంటారు. ఈ ఆవరణలోని మిలియన్‌ భాగాల్లో ఆరు భాగాలు ఓజోన్‌ పొరను కలిగి ఉంటుంది. ఈ పొర సూర్యుని నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలను పీల్చుకోవడం ద్వారా జీవకోటికి మేలు చేస్తుంది. అందుచేత ఇది అక్కడుంటేనే మేలన్నమాట.

మనం పీల్చుకునే గాలిలో కూడా ఓజోన్‌ ఉంటే అది మన వూపిరితిత్తులకు చాలా హాని చేకూరుస్తుంది. మనకేకాక జంతువులకు, మొక్కలకు కూడా నష్టం కల్గుతుంది. దురదృష్టవశాత్తూ మన రోడ్లపై తిరిగే మోటారు వాహనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే కాలుష్యాల్లో ఉండే రసాయనిక పదార్థాలు, కాంతితో సంయోగం చెందితే ఓజోన్‌ ఉత్పత్తి అవుతుంది. అలాంటప్పుడు అది అపకారే మరి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No injury to Ants why ?-చీమలకు దెబ్బ తగలదేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...








ప్రశ్న: చీమల్లాంటి చిన్న జీవులు ఎంత ఎత్తు నుంచి నేలపై పడినా వాటికి దెబ్బ తగలదు ఎందువల్ల?


జవాబు: ఎత్తు నుంచి వస్తువులు నేలపై పడడానికి కారణం భూమి వాటిపై ప్రయోగించే గురుత్వాకర్షణ బలమేనని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్‌ న్యూటన్‌ కనుగొన్నారు. ఆ బలం ఆ వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. తేలికైన వస్తువు కన్నా బరువైన వస్తువుపైనే గురుత్వాకర్షణ బలం ఎక్కువగా పనిచేస్తుంది. భూమి వస్తువును తన వైపునకు ఆకర్షించే బలానికి వ్యతిరేక దిశలో వాతావరణంలోని గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పనిచేస్తుంది. గాలి ప్రయోగించే ఈ నిరోధక బలం వస్తువు ఉపరితల వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటే నిరోధక బలం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇక ఎత్తు నుంచి పడే చీమల లాంటి జీవుల విషయంలో వాటిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం, గాలి నిరోధక శక్తి చాలా వరకు సమానంగా ఉండటం వల్ల అవి సమ వేగంతో నేలను చేరుతాయి. అందువల్ల వాటికి హాని జరగదు. ఒకవేళ ఆ సమయంలో గాలి తీవ్రంగా వీస్తే, చీమల్లాంటి కీటకాలు ఆ గాలి వాటులో కొట్టుకుపోతాయి కూడా.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Sunday, April 19, 2015

Deer skin for yoga?-జింక చర్మము మీద కూర్చుని గతమ్లో తపస్సు చేసేవారు ఎందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్ర : జింక చర్మము మీద కూర్చుని గతమ్లో తపస్సు చేసేవారు ఎందుకు?

జ : వేదాలలో ఋఉగ్వేదము రంగు "  తెలుపు " , సామవేదము రంగు " నలుపు " . ఆ రెండు వేధాల రంగులే ..... పగలూ ,రాత్రి . అందుకే పూర్వము ఆ వర్ణాలు గల జింక చర్మము మీద తపస్సు చేసేవారు.  జింక చర్మము మీద తపస్సు అనేక వ్యాధులను దూరము చేస్తుందని ఆయుర్వేద శాస్త్రాల సారాంశము ద్వారా తెలుస్తోంది.

ఈ కాలములో జింక చరమము మీద తపస్సు చాలా పెద్ద నేరము . పూరం కాలము లో కాలం చెల్లిన జింక చర్మాలను మాత్రమే ఋషులు ఉపయోగించేవారు .
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tea is Good or Bad ?-తేనీరు మంచిదా- కాదా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: కొందరు టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని, కొందరు హానికరమని అంటున్నారు. ఏది నిజం?

జవాబు: ప్రపంచవ్యాప్తంగా మంచినీరు తర్వాత అత్యధికంగా మానవుడు సేవించే పానీయం టీనే. ఆ తర్వాత కాఫీ, ఆపై ఇతర పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు, శీతల పానీయాలు ఉన్నాయి. తేయాకు చెట్ల ఆకుల్ని క్రమబద్ధీకరణ పద్ధతిలో వేడి చేసినపుడు పెళుసైన టీ ఆకులు వస్తాయి. వాటిని దంచితే వచ్చేదే టీ పొడి. ఆకుల కాలం, ఏ ఉష్ణోగ్రతలో వేడి చేశాం, ఏ ప్రాంతంలో పెరిగే తేయాకు తోటలు అన్న విషయాల మీద టీ లోని ధాతువుల స్వరూపం, సంఘటనం ఆధారపడతాయి.

తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో చైనా, ఆ తర్వాత మన భారత దేశం ఉండగా, ఈ రెండు దేశాల ఉత్పత్తి ప్రపంచపు ఉత్పత్తిలో సగం కన్నా ఎక్కువే ఉంది. టీలో ప్రధాన ధాతువు కెఫిన్‌. ఇది ఒక ఆల్కలాయిడ్‌. టీని పరిమిత మోతాదులో తీసుకుంటే హృదయ సంబంధ వ్యాధుల నివారణకు సహకరిస్తుందని పరిశోధనలు రుజువు చేశాయి. కానీ ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, -శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

టీ లో 3% వరకు కెఫిన్‌ ('caffeine) ఉంటుంది. . ఇంకా కొంది మోతాదులో 'theobromine , 'theophylline ,xanthines   ఉంటాయి . ఇవన్నీ మెదడును ఉత్తేజపరచును . ఎక్కువగా తీసుకుంటే నిద్రాభంగము కలుగును.

టీ తక్కువ మోతాదులో తీసుకుంటే 'polyphenols , 'flavonoids ఉన్నందున ఊబకాయము , ఆల్జిమెర్ డిసీజ్ నుందు రక్షణ కలిగించును. 'cholesterol తగ్గించుటలోనూ టీ సహకరించును. -

-- డా. శేషగిరిరావు



  • ===========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Fruits crop in some seasons only why?- పండ్లు ఆయా కాలాల్లోనే కాస్తాయెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







 ప్రశ్న: పండ్లు ఆయా కాలాల్లోనే కాస్తాయెందుకు?

జవాబు: వేర్వేరు పండ్లకు వేర్వేరు రుచులు రావడానికి కారణం ఆయా పండ్లలో ఉండే జన్యు సంకేతాలే (Genetic code).ఆ జన్యు సంకేతాన్ననుసరించే పండ్లలో ప్రత్యేక రుచుల్ని, వాసనలను, ఇచ్చే పదార్థాలే ఉత్పత్తి అవుతాయి. ఏ పదార్థమూ శూన్యం నుంచి ఏర్పడదు. అంటే ఫలాల్లో ఉన్న పదార్థాల తయారీకి కావలసిన ముడి పదార్థాలు చెట్టుకు అందుబాటులో ఉండాలి. పైగా పండ్ల రుచుల, వాసనల తయారీ సమయంలో తగిన విధంగా వాతావరణంలోనూ, నేలలోనూ అనువైన భౌతిక (ఉష్ణోగ్రతగల పీడనం, గాలిలో తేమ, వెలుతురు మొ||వి), రసాయనిక లక్షణాలు ఉండాలి. ఒకే ప్రాంతంలో సంవత్సరం పాటు ఒకే విధమైన భౌతిక, రసాయనిక లక్షణాలు నేలలోను, వాతావరణంలోనూ ఉండవు. అందువల్లే ఆయా ప్రాంతాలకు, ఆయా రుతువులకు అనుకూలంగా వివిధ పండ్ల మొక్కలు పుష్పించి ఫలిస్తాయి. వివిధ పంటలు పండుతాయి. ఎప్పుడూ కాయలనిచ్చే చెట్లున్నాయి, ఏడాదికోసారి ఫలాలనిచ్చేవి ఉన్నాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Saturday, April 18, 2015

Fingers are more cold in winter?-చలికాలంలో చేతివేళ్లు చల్లగా ఉంటాయేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: చలికాలంలో మన చేతివేళ్లు ఇతర దేహ భాగాల కన్నా చల్లగా ఉంటాయి. ఎందుకు?

జవాబు: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక భిన్న ప్రయోగం చేద్దాం. బాగా వేడిగా ఉన్న నీటిని రెండు సమాన పరిమాణం గల గిన్నెలలో తీసుకోండి. వాటిలో ఒకదాని మూతి చిన్నదిగానూ, మరొక దాని మూతి వెడల్పుగానూ ఉండాలి. కొంతసేపటికి జాగ్రత్తగా గమనిస్తే, వెడల్పు మూతి ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్లబడుతుంది. ఈ పరిశీలన బట్టి తెలిసేదేమంటే, నీటి ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండే... అంటే మూతి వైశాల్యం ఎక్కువగా ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్ల బడుతుంది. అంటే వేడిని త్వరగా కోల్పోతుంది అని అర్థం.

ఇప్పుడు ప్రశ్న విషయానికి వస్తే, మన శరీరంలో ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణ పరిమాణం దేహంలోని ప్రతి ఘన సెంటిమీటరులో సమానంగా ఉంటుంది. కానీ ప్రతి ఘన సెంటిమీటరుకు చేతివేళ్లు, ముక్కు ఉపరితల వైశాల్యం మిగతా భాగాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చేతి వేళ్లు, ముక్కు వాటి ఉపరితలం నుంచి వేడిని త్వరగా కోల్పోయి చల్లబడతాయి. మిగతా దేహ భాగాలు నిదానంగా వేడిని కోల్పోవడంతో, అవి చేతివేళ్ల కన్నా కొంచెం వెచ్చగా ఉంటాయి.

- ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • ======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

How can parrots talk like human?-చిలుకలు ఎలా మాట్లాడగలుగుతాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: చిలుకలు ఎలా మాట్లాడగలుగుతాయి?

జవాబు: చిలుకలు పలికే పలుకులు వాటి స్వర సంబంధిత అనుకరణ వల్లనే కానీ, వాటికి ఉండే ఏదో ప్రత్యేకమైన పదజాలం వల్ల మాత్రం కాదు. మానవుల, పక్షుల ప్రవర్తన చాలా వరకు గాత్రం వెలువరించే శబ్దాలు, దృష్టి సంకేతాలపై ఆధారపడి
ఉంటుంది.

పక్షుల స్వరపేటిక (voice box)ను సిరింక్స్‌ అంటారు. ఇది మానవుల స్వరపేటికలా కాకుండా అతి సామాన్యంగా ఉంటుంది. అందువల్ల అవి శబ్దాలను సులువుగా వెలువరించగలవు.
పక్షుల్లో స్వరపేటిక శ్వాసనాళం కింద ఉంటుంది. స్వరపేటికలో ఉత్పన్నమయిన శబ్ద తీవ్రతను శ్వాసనాళంలోని కండరాలు నియంత్రిస్తాయి. ఆ శబ్దాలు అంతగా హెచ్చుతగ్గులు లేని స్వరభేదంతో వాటి నోటి నుంచి వెలువడుతాయి.

చిలుకలు, మైనాలు వాగుడుకాయలు. ఇవి ఒక పర్యాయం 50 పదాల వరకు అనుకరణ రూపంలో శబ్దాలను వెలువరించగలవు. వీటిలో శబ్దాల విడుదలను నియంత్రించే మెదడు ముందు భాగం మగ పక్షులలో ఎక్కువ పరిమాణంలో ఉండటం వల్ల అవి శబ్దాలను సంగీత రూపంలో కూడా వెలువరిస్తాయి.

మానవులలో శబ్దాలు పక్షులలో వలె కాకుండా శ్వాసనాళంపై ఉండే స్వరపేటిక నుంచి వెలువడుతాయి. స్వరపేటిక వివిధ భాగాలతో సంక్లిష్టంగా నిర్మితమయి ఉండటంతో శబ్దాలు స్పష్టమైన మాటల రూపంలో వెలువడుతాయి. నాలుక, బుగ్గలు, నోరు, పెదాలు స్వరస్థానాలను తగురీతిలో మార్చడమే కాకుండా నియంత్రిస్తాయి.

ఆవిధంగా చిలుకలు మనం చేసే శబ్దాలను అనుకరిస్తాయే కానీ, అవి స్వతంత్రంగా తమకై తాము మాట్లాడలేవు. అందుకనే చిన్న పిల్లలు మనలను అనుకరిస్తూ నంగినంగిగా, ముద్దు ముద్దుగా మాట్లాడే ముద్దు మాటలను 'చిలక పలుకులు' అంటారు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌


  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Wednesday, April 15, 2015

children brain sharp under five yrs?-ఐదేళ్ల లోపు పిల్లల మెదడు చురుగ్గా ఉంటుందంటారు.నిజమేనా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: ఐదేళ్ల లోపు పిల్లల మెదడు చురుగ్గా ఉంటుందని, ఏది చెప్పినా బాగా గుర్తుపెట్టుకుంటారని అంటారు. నిజమేనా?
జవాబు: ప్రతి జీవికి పరిసర పరిజ్ఞానం పొందడానికి జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవి మానవుడిలో పరిణామక్రమంలో బాగా అభివృద్ధి చెందాయి. మనం చర్మం (స్పర్శ), కళ్లు (దృష్టి), చెవులు (శ్రవణం), ముక్కు (ఘ్రాణం), నాలుక (రుచి) అనే పంచేంద్రియాల ద్వారా మాత్రమే ప్రకృతి జ్ఞానం పొందుతాం. ప్రకృతి పరిజ్ఞానానికి, తెలివి తేటలకు ఇంతకు మించి మరే ద్వారమూ లేదు.
మన మెదడులోనే మనం సంతరించుకున్న జ్ఞాన ముద్రలు, సమాచారం భద్ర పరిచి ఉంటాయి. ఆసక్తి అనేది మానవుడికే ఉంది. ఆసక్తి అంటే తెలుసుకోవాలనే కుతూహలం. పుట్టినప్పట్నించి పెరిగే క్రమంలో తొలి దశల్లో ఆసక్తి అమితంగా ఉంటుంది. క్రమేపీ మెదడులో కూడా సమాచారం నిల్వ అవుతూ ఉంటుంది. ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికే మనకు తెలిసిన సమాచారంలో సుమారు 60 శాతం పోగవుతుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. అభ్యసనం చర్చలు తదితర సామూహిక కార్యకలాపాలు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.


- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, --శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Cats jump down with fourlegs how?-ఎత్తు నుంచి పిల్లులు అలానే ఎందుకు దిగుతాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: కొంత ఎత్తు నుంచి పిల్లులను వదిలితే అవి ఎపుడూ తమ నాలుగు కాళ్లపైనే నేలపై దిగుతాయి. ఎందువల్ల?

జవాబు: కొంత ఎత్తు నుంచి పిల్లులు కిందికి పడేటప్పుడు అవి గిర్రున తిరుగుతూ చక్రభ్రమణాలు చేస్తున్నా చివరికి నేలను తాకేముందు రెండు కాళ్లపైనే దిగుతాయి. వాటి శరీర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. నేలను తాకే ముందు వాటి నాలుగు కాళ్లు కింది వైపునకే తిరిగి నేలను నిదానంగా, నిటారుగా తాకుతాయి. ఇలా దిగడం వల్ల నేలను ఢీకొనేటపుడు ఉత్పన్నమయే అధిక తాకిడి ప్రభావం నుంచి ప్రాణాపాయం లేకుండా పిల్లులు తప్పించుకోగలుగుతాయి. అందువల్లనేమో 'పిల్లులకు తొమ్మిది జన్మలుంటాయనే' నానుడి ప్రాచుర్యంలో ఉంది.
కొంత ఎత్తు నుంచి కిందికి ఏ వస్తువునైనా వదిలితే, భూమ్యాకర్షణ శక్తి వలన దాని వేగం కాలంతో పాటు హెచ్చుతూ, నేలను తాకే ముందు వేగం గరిష్ఠం అవుతుంది. దీనిని త్వరణ వేగం అంటారు. కానీ ఎత్తు నుంచి కిందికి పడే పిల్లి తన శరీర భాగాలను నేలకు ఎంత సమాంతరంగా చాస్తుందంటే, అపుడు అది గాలిలో ఎగిరే ఉడుతను పోలి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గాలి నిరోధం దాని శరీరంపై పనిచేయడంతో అది కిందికి పడే వేగం తక్కువగా, సమంగా ఉంటుంది. శరీరాన్ని బాగా చాచడం వల్ల పడేటపుడు ఉత్పన్నమయే అభిఘాత తీవ్రత దాని శరీరంలోని కణజాలం గుండా చెల్లాచెదరవుతుంది. చివరగా పిల్లి పేరాచూట్‌లాగా నేలపైకి నిదానంగా దిగుతున్నట్లు నాలుగు కాళ్లపై నేలపైకి సురక్షితంగా దిగుతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Yello color to all school buses Why?-బడి బస్సులకు రంగునే వేస్తారెందుకు ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

ప్రశ్న: స్కూలు బస్సులకు పసుపు రంగునే వేస్తారు. ఎందుకు?



జవాబు: స్కూలు బస్సుల రంగు నిమ్మకాయల వంటి స్వచ్ఛమైన పసుపూ కాదు, నారింజ లాంటి పసుపూ కాదు. ఈ రెండింటి మిశ్రమంగా పండిన మామిడి పండు రంగును పోలి ఉంటుంది.
మనం ఎంత దూరం నుంచైనా పసుపు రంగు వస్తువును కంటి మూలల నుంచి కూడా స్పష్టంగా గుర్తించగలం. ఇలా గుర్తించడంలో మనకు ఎరుపు రంగు కన్నా పసుపు విషయంలో 1.24 రెట్ల స్పష్టత ఉంటుంది. అలాగే మంచు పడుతున్న వాతావరణంలో కానీ, తెల్లవారు జామున, సాయం సమయాల్లో మసక చీకట్లో కానీ పసుపురంగును మిగతా వాటికన్నా బాగా చూడగలుగుతాం.

వర్ణదృష్టిలోపం ఉన్నవారికి రంగులు సరిగా కనపడవు. ముఖ్యంగా ఎరుపు రంగు అలాంటి వారికి నల్లగా, చీకటి రంగులో కనిపిస్తుంది. అదే పసుపు రంగు విషయంలో ఈ దృష్టి లోపం ఉండదు. ఈ విషయాల దృష్ట్యా పసివాళ్లు పయనించే బస్సులకు పసుపురంగు వేయాలని 1939లో ఉత్తర అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఫ్రాంక్‌ సైర్‌ ఒక సమావేశంలో వివరించారు. డాక్టర్‌సైర్‌ 'Father Of Yellow School Bus'గా ప్రసిద్ధిగాంచారు. స్కూలు బస్సులకు వేసే పసుపు రంగు సీసం కలిపిన క్రోమ్‌ఎల్లో.

- ప్రొ ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sounds on Sun not hearing why?-సూర్యుడిపై జరిగే పేలుళ్ల శబ్దాలు వినిపించవేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

ప్రశ్న: సూర్యుడిపై జరిగే పేలుళ్ల శబ్దం మనకు ఎందుకు వినపడదు?


జవాబు: సౌరమండలంలో సూర్యుడు కేంద్ర బిందువు. సౌర శక్తే మనం వాడే అన్ని రకాల శక్తులకు మౌలిక ఆధారం. సూర్యుడిలో ఉండేది కేవలం రెండే వాయువులు. ఇందులో సుమారు 75 శాతం హైడ్రోజన్‌, మిగిలింది హీలియం. కేంద్రక సంలీన చర్య వల్ల ప్రతి సెకనుకు సుమారు 60 వేల టన్నుల హైడ్రోజన్‌ పరమాణువులు, హీలియం పరమాణువులుగా మారుతుంటాయి. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంత సూత్రమైన E = mc2 ప్రకారం అందులో నుంచి సుమారు 420 టన్నుల ద్రవ్యరాశి శక్తిగా మారుతుంటుంది.
సూర్యుడి గోళ వ్యాసార్థం ఏడు లక్షల కిలోమీటర్లకు పైనే ఉంటుంది. సూర్యుడి కేంద్రక సంలీన చర్య అంతర్భాగం లోపల రెండు లక్షల కిలోమీటర్ల లోపే పూర్తవుతుంది. ఆ తర్వాతి పదార్థంలో ఈ శక్తి సంవహనం, వికిరణం పద్ధతుల్లో ఉపరితలానికి వ్యాపిస్తుంది. ఆ వేడి తాకిడికి మరుగుతున్న గంజిలాగా సూర్యుడి ఉపరితలంపై భీకరమైన పొంగులు వస్తుంటాయి. వీటినే సౌర జ్వాలా కీలలు అంటారు. అయితే అక్కడ బ్రహ్మాండం బద్ధలైనట్టుగా శబ్దం వస్తున్నా అది మన భూమి వరకు వినిపించదు. ఎందుకంటే సూర్యుడికి భూమికి మధ్యన దూరం 15 కోట్ల కిలోమీటర్లు. ఈ ప్రదేశమంతా కేవలం శూన్యం. శూన్యంలో కాంతి ప్రసరిస్తుందిగానీ శబ్దం ప్రయాణించలేదని మీరు వినే ఉంటారు.
సూర్యుడికి భూమికి మధ్య విస్తారంగా శూన్య ప్రదేశం ఉండడం వల్లనే మనం భీకరమైన సూర్యుడి శబ్దాల్ని వినలేము.

- ప్రొ ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,--శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

All seeds not germinate why?-నాటిన విత్తనాలన్నీ మొలకెత్తవేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

ప్రశ్న నాటిన అన్ని గింజలూ మొలకెత్తవు, ఎందుకు?


జవాబు: నాటిన గింజ మొలకెత్తాలంటే ఆ గింజలో ఫలజీవం సజావుగా ఉండాలి. సాధారణంగా పూర్తిస్థాయి క్రోమోజోములున్న సంయుక్త జీవ కణం (Zygote) విత్తనంలో ఉంటుంది. విత్తనం మొలకెత్తగానే కిరణజన్య సంయోగక్రియ జరపలేదు కాబట్టి సొంతంగా ఆహారం తయారు చేసుకునేంతవరకు తన ఎదుగుదలకు సహాయ పడేలా విత్తనంలో పోషణ ఉండాలి. అందుకే విత్తనాలలో సంయుక్త బీజకణ లక్షణాలతోపాటు పప్పు, కొబ్బరి, ముట్టె వంటి భాగాల్లో ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవి క్షీణించి ఉన్నాగానీ, రసాయనిక కారణాల వల్లగానీ, జన్యులోపం వల్ల గానీ అధిక వేడివల్లగానీ తదితర కారణాల వల్ల విత్తనంలో ఉన్న జీవం నశించి ఉంటే అలాంటి విత్తనాలు మొలకెత్తవు.
అందుకే రైతులు విత్తనాల కోసం ప్రభుత్వాన్ని అర్థిస్తుంటారు. తాము పండించిన విత్తనాలు తిరిగి పంటకొచ్చే అవకాశం లేకపోవచ్చు లేదా, టెర్మినేటర్‌ సీడ్స్‌ అనే విత్తనాల్లో అన్నీ బాగున్నాగానీ, వీటి క్రోమోజోముల్లో కంపెనీల వాళ్లు కావాలనే జన్యు నిర్మాణం చేయడం వల్ల మొలకెత్తవు కాబట్టి జన్యులోపం లేకుండా, ఆహార సమృద్ధి బాగా ఉంటూ సజీవంతో ఉన్న విత్తనాలే మొలుస్తాయి. ఒక్కోసారి విత్తనాలు బాగున్నా నేలలో ఉండే సారం విత్తనం మొలకెత్తేందుకు అనువుగా లేకున్నా ఆ ప్రాంతాల్లో విత్తనాలు మొలకెత్తవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, April 13, 2015

Morning walk is good for health How?-ఉదయం వేళ నడక ఆరోగ్యానికి మంచిదని అంటారెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



 ప్రశ్న: ఉదయం వేళ నడక ఆరోగ్యానికి మంచిదని అంటారు. ఎందుకు?

జవాబు: రాత్రి వేళల్లో మనం నిద్ర ద్వారా విశ్రాంతి పొందుతాము. ఆ దశలో చలన సంబంధ అవయవాలు (కాళ్లు, చేతులు మొదలైనవి) సేదదీరి ఉంటాయి. నిద్రలో సేద తీర్చుకున్న తర్వాత అవయవాల్ని, కండరాల్ని పనికి పురికొల్పేందుకు నడక ఉత్తమ మార్గం. పైగా నడక సమయంలో గుండె శరీర భాగాలకు రక్తాన్ని బాగా ప్రసరింపజేస్తుంది. తద్వారా మెదడు, తదితర అంతరంగావయవాలకు సరియైన మోతాదులో రక్తం చేరడం వల్ల అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి. తేలికపాటి నడకవల్ల గుండెకు కూడా మంచిదని వైద్యులు అంటున్నారు. అంతేకాదు, నడక సమయంలో చర్మంలోని స్వేద గ్రంథులు ఉత్తేజం పొంది చర్మంపై పొర మీదకు స్వేదాన్ని స్రవించడం వల్ల చర్మపు పై పొర ఆరోగ్యవంతంగా ఉంటుంది. శరీరంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తాం. 'నవ్వు నాలుగు విధాల చేటు' అన్న సామెత మాటేమోగానీ 'నడక నలభై విధాల మేలు' అనేది ఇప్పుడు గుర్తుంచుకోవాలి.

-- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Energy from inside of Sun travel time?-సూర్యుని అంతర్భాగంలో శక్తి ప్రయాణానికి అన్నేళ్లు ఎందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: సూర్యుని అంతర్భాగంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి కొన్ని వందల సంవత్సరాలకు గానీ సూర్యుని ఉపరితలంపైకి రాదు. ఎందువల్ల?

జవాబు: సూర్యుడు భూమికన్నా సుమారు 3,30,000 రెట్లు ఎక్కువ బరువుంటాడు. సూర్యుడిలో 3/4 భాగం హైడ్రోజన్‌ ఉంటే మిగతాది హీలియం. సూర్యుడు అంత బరువుగా ఉండబట్టే అక్కడ గురుత్వాకర్షణ శక్తి అత్యధికంగా ఉండి అందులోని వాయువులను ఒకే చోట పట్టి ఉంచడమే కాకుండా గ్రహాలన్నిటినీ తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు.

సూర్యుని అంతర్భాగం కేంద్రం నుంచి 25 శాతం వ్యాసార్థం మేర వ్యాపించి ఉంటుంది. ఇక్కడ సూర్యునిలోని ద్రవ్యాన్ని (వాయువు) అంతా గురుత్వశక్తి కేంద్రంవైపు ఆకర్షించడంతో విపరీతమైన పీడనం (ఒత్తిడి) ఉత్పన్నమవుతుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటుందంటే, హైడ్రోజన్‌ వాయువు పరమాణువులు ఒక చోటకు చేరి కేంద్రక చర్యలు ప్రారంభమవుతాయి. రెండు హైడ్రోజన్‌ పరమాణువులు కలుసుకొని, హీలియం పరమాణువులతో పాటు కొంత శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ దశలో ఉష్ణోగ్రత 15 మిలియన్‌ డిగ్రీల సెంటిగ్రేడుకు చేరుకుంటుంది. ఈ శక్తి కిరణాలు, నీలలోహిత కిరణాలు, కంటికి కనిపించే కాంతి, పరారుణ కిరణాలు, మైక్రో తరంగాలు, రేడియో తరంగాల రూపంలో వెలువడుతుంది. సూర్యుడు శక్తిమంతమైన న్యూట్రాన్లు, ప్రోటాన్లతో కూడిన 'సౌర పవనాలు' వెలువరిస్తాడు. ఈ శక్తి వికిరణ, సంవాహన మండలాలు దాటి సూర్యుని ఉపరితలానికి చేరుకుంటుంది. సూర్యుని అంతర్భాగం నుంచి 55 శాతం మేర వ్యాపించి ఉండే వికిరణ మండలంలో అంతర్భాగం నుంచి వెలువడే శక్తి 'ఫోటాన్ల' ద్వారా రవాణా అవుతుంది. ఫోటాన్ల నుంచి వాయుకణాలు శక్తి సంగ్రహించి వేడెక్కడంతో కొత్త ఫోటాన్లు ఆవిర్భవిస్తాయి. అవి మళ్లీ వాయుకణాలను వేడెక్కించడం ద్వారా శక్తి సంవాహన మండలాన్ని చేరుకుంటుంది. సంవాహన మండలం మిగతా 20 శాతం సంవాహన ప్రక్రియ ద్వారా క్రమేణా సూర్యుని ఉపరితలానికి చేరుకుంటుంది. ఈ మండలంలోని కొన్ని పొరలలో వేడెక్కిన వాయు ప్రవాహం పైకి లేస్తుంది. ఈ ప్రవాహం తక్కువ ఉష్ణోగ్రత ఉన్న పొరల వాయువులతో ఉష్ణాన్ని పంచుకుంటుంది. చల్లారిన పొరలు మళ్లీ కిందికి పయనిస్తాయి. ఈ విధంగా ఫోటాన్లకు, వాయుకణాలకు మధ్య జరిగే పరస్పర చర్యల ద్వారా ఉష్ణ, కాంతి శక్తులు వికిరణ, సంవాహన మండలాల్ని దాటి సూర్యుని ఉపరితలానికి చేరుకుంటాయి. సూర్యుడు సెకనుకు 400 మిలియన్‌ టన్నుల హైడ్రోజన్‌ను పూర్తి శక్తిరూపంలోకి మారుస్తాడు. సూర్యుని వికిరణ మండలం నుంచి ఒక ఫోటాన్‌ సూర్యుని ఉపరితలానికి చేరుకోవడానికి పట్టే కాలమే సుమారు లక్ష నుంచి రెండు లక్షల ఏళ్ల వరకు ఉంటుంది.

ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, April 09, 2015

How wireless mic is working?-వైర్‌లెస్‌ మైకులు ఎలా పనిచేస్తాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: వైర్‌లెస్‌ మైకులు ఎలా పనిచేస్తాయి?

జవాబు: వైర్లతో కూడుకున్న మైక్రోఫోన్లు (మైకులు) ఎప్పటినుంచో వాడుతున్నారు. ఈ మైక్రోఫోన్లు ట్రాన్స్మిటర్‌, రిసీవర్‌ లౌడ్‌స్పీకర్‌ అనే మూడు పరికరాలు కలిగి ఉండే వ్యవస్థ. వీటిని తీగల ద్వారా అనుసంధానిస్తారు.

ఈ తీగల ప్రమేయం లేకుండా వివిధ భాగాలను ఒక అనువైన గొట్టంలో అమర్చి ఉన్న సాధనమే వైర్‌లెస్‌ మైక్రోఫోన్‌ (నిస్తంత్రీ శబ్ద ప్రసారిణి). ఈ మైక్రోఫోన్‌ను సులువుగా చేతిలో పట్టుకుని వక్తలు, గాయకులు వేదికపై ఏ మూలకైనా వెళ్లొచ్చు. అవసరమైతే ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లి మాట్లాడినా ఇది శబ్దాన్ని ప్రసారం చేస్తుంది. కాకపోతే వైర్‌లెస్‌ మైక్‌ ఖరీదు కాస్త ఎక్కువ.

వైర్‌లెస్‌ మైక్రోఫోన్‌లో స్వల్ప పరిమాణంలో ట్రాన్స్మిటర్‌ రిసీవర్‌ PA సిస్టం లేక హెడ్‌సెట్‌ ఒక గొట్టంలో అమర్చి ఉంటాయి. ట్రాన్స్మిటర్‌ పనిచేయడానికి కావలసిన 9 ఓల్టుల బ్యాటరీ కూడా అందులోనే ఉంటుంది. ట్రాన్స్మిటర్‌ ఏ ఎలక్ట్రానిక్‌ తరంగ దైర్ఘ్యాన్ని ప్రసారం చేస్తుందో రిసీవర్‌ కూడా ఆ తరంగా దైర్ఘ్యానికే ట్యూనై ఉంటుంది. మైక్రోఫోన్‌లోకి ప్రవేశించిన శబ్ద తరంగాలను ట్రాన్స్మిటర్‌ విద్యుత్‌ తరంగాలుగా మార్చి అక్కడే ఉన్న ఏంటినా ద్వారా ప్రసారం చేస్తుంది. ఆ తరంగాలను గ్రహించిన రిసీవర్‌ అక్కడే అమర్చిన PA సిస్టమ్‌ లేక హెడ్‌సెట్‌ సాయంతో శబ్ద తరంగాలుగా మార్చి ఆ శబ్దాన్ని ఎక్కువ తీవ్రతతో ప్రేక్షకులకు అందచేస్తుంది. శబ్దం వెలువడే నోటికి, మైక్రోఫోనుకు మధ్యగల దూరాన్ని చేతి కదలికల ద్వారా మార్చి, వైర్‌లెస్‌ మైక్రోఫోన్‌ నుంచి వెలువడే శబ్ద తీవ్రతను స్వచ్ఛతను నియంత్రించవచ్చు.


- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, April 08, 2015

Is God female or male?-దేవుడు స్త్రీయా పురుషుడా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

ప్ర :  దేవుడు స్త్రీయా పురుషుడా?

జ : ఈ చరాచర సృష్టిని నడిపించేదీ , మానవులు తాము చేసిన పాప-పుణ్యాలకు ఫలితాలుగా కష్ట-సుఖాలను పొందడానికి  కారణమైనదీ అయిన మానవాతీతశక్తినే ... ఎవరికి తోచిన రూపము లో వారు పూజిస్తున్నారు. ఆ శక్తే దేవుడు. నిర్వికార, నిర్గుణ, ప్రరబ్రహ్మమైన  పరమాత్మ స్వరూపానికి స్త్రీ-పురుష భేదాలుండవు. చూసే వారి దృష్టిని బట్టి . . . దేవుడు వారికి ఆ రూపములో దర్శన్మిస్తాడు. 

  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Releif from restless with small sleep?-చిన్న కునుకు(నిద్ర)తో అలసట ఎలా పోతుంది ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్ర :How do we ger Releif from restlessness with small sleep?-చిన్న కునుకు(నిద్ర)తో అలసట ఎలా పోతుంది ?

జ : అలసట రెండు రకాలు. ఒకటి  శరీర కండరాలు చేసే పనితో కలిగే అలసట , రెండెవది మెదడు అలసట . శారీరక్ శ్రం చేసే శ్రామిక వర్గము వారు మఖ్యాహ్నము వేళ ఒక అరగంట సేపు అలా పడుకుని ఇలా లేచి తిరిగి ఉత్సాహము గా పనిచేయగలుగుతారు . మెదడుతో పనిచేసినవారికి ఆ కునుకు సరిపోదు,. శారీరక సలసట లో ఉత్పత్తి అయ్యే రసాయాల గాఢత తగ్గిపోవడానికి ఓ చిన్ని కునుకు సమయము సరిపోతుంది. మెదడు లేదా మానిసిక అలసటకి ఎక్కువసేపు నిద్రకావాలి. దీనికి కారణము మెదుడులో ' సెరిటోనిన్‌' హార్మోన్‌ స్థాయిలు భాగా తగ్గిపోవడమే కారణము .


  • =========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, April 07, 2015

Swan is vehicle of Saraswati devi how?-హంస సరస్వతీ దేవికి వాహనం ఎందుకయ్యింది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



 ప్ర : హంస సరస్వతీ దేవికి వాహనం ఎందుకయ్యింది?

జ : సరస్వతీ దేవి వాహనం హంస . నీరు కలసిన పాల నుంచి పాలను మాత్రమే గ్రహించగల శక్తి హంసకు ఉంది. అలాగే మానవులు ప్రపంచములో నిత్యం జ్ఞానసత్యాన్ని గ్రహించగలగాలి. . . అప్పుడే వారు హంస ధర్మము గలవారవుతారు. సరస్వతీదేవి  అలాంటివారినే ఆదరిస్తుంది. . . కనుకనే ఆ తల్లి హంసవాహినిగా పేరొందింది.  విద్యకు అధిపతి సరస్వతి విద్యను పొందాలనుకునే వారు తప్పక సరస్వతీదేవిని  ప్రార్ధించి అనుసరించాలి.
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sea water colors changes prequently?-సముద్రపు నీటి రంగులు మారుతూ ఉంటాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
 ప్ర : సముద్రపు నీటి రంగులు మారుతూ ఉంటాయా?.

జ : సముద్రపు నీరు నీలరంగులో ఉంటుంది . సూర్య్కాంతిలోని ఏడు రంగులలో అన్ని రంగులు గ్రహించి ఒక్క నీలి రంగును వెనక్కి వెదజల్లుతుంది. (Sea water surface scatter blue color more than the other colors of the Sun rays) . ఈ వెనక్కి వెదజల్లే లక్షణము వలన సముద్రము రంగు నీలం గా ఉంటుంది.

నీటిలో ఉండే సూక్ష్మజీవులు , ఇసుక , బురద వంటి పదార్ధాలవల్ల సముద్రపు నీరు కొన్ని చోట్ల ఆకుపచ్చ , ఎరుపు రంగులలో అక్కడక్కడా కనిపిస్తుంది. అంతేకాని సముద్రము రంగులు మార్చుకోదు. అలా రంగులు మారవు.
  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, April 05, 2015

Lice on the head come from?- తలలో పేలు ఎక్కడినుండి వస్తాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

ప్ర : Lice on the head come from?- తలలో పేలు ఎక్కడినుండి వస్తాయి?

జ : పేలు తలలో పుట్టవు . మాడును అంటిపెట్టుకుని , మాడును కుట్టి మనిషి రక్తాన్ని పీల్చే పేలు  తలనుండి బయటకి తీస్తే ఒకరోజు కనా ఎక్కువ బ్రతకలేవు . కాబట్టి ఎవరోఒకరి తలనుండు మరొకరి తల్కు వ్యాప్తిచెందాల్సిందే . ఒకరి తల మరొకరి తలకు తగిలినపుడు , ఒకరి దువ్వెన మరొకరు వాడినపుడు ,దిండు  ... దుప్పటికి అంటిపెట్టుకుని ఒకరి తల నుండి మరొకరి తలకు వస్తాయి. అప్పుడప్పుడు పేలు గాలి ద్వారా ఒకరి తలనుండి మరొకరి తలకు వ్యాప్తిచెందే అవకాశము లేకపోలేదు .. కాని చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే పేలు ఎగరలేవు ఒకసారి తలలో చేరితే అతివేగముగా గుడ్లు పెట్టి వ్యాప్తిచెందగలిగిన పరాన్నజీవులు పేలు.
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, April 04, 2015

Pastes and gels solids or liquids?-పేస్టులు-జెల్‌లు ఘన పదార్థాలా లేక ద్రవ పదార్థాలా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



 ప్రశ్న: పేస్టులు, జెల్‌లు ఘన పదార్థాలా లేక ద్రవ పదార్థాలా?

జవాబు: నిర్ణీత ఆకారం, ఘన పరిమాణం ఉన్న వస్తువుల్ని ఘన పదార్థాలు అంటాము. నిర్ణీత ఘన పరిమాణం ఉన్నా నిర్దిష్ట రూపం లేకుండా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని సంతరించుకునే వాటిని ద్రవ పదార్థాలు అంటారు. ఘన పరిమాణం, పీడనం పైన ఆధారపడ్డమే కాకుండా నిర్దిష్ట రూపం లేని పదార్థాల్ని వాయు పదార్థాలు అంటారు. ఘన, ద్రవ పదార్థాల్ని చూడగలం కానీ వాయు పదార్థాల్ని ప్రత్యక్షంగా చూడలేం. పేస్టు, జెల్‌ చూడ్డానికి ఘన పదార్థాల్లాగే అనిపించినా కొంచెం చిదిమితే రూపం మారిపోతుంది. ఈ లక్షణం ద్రవానిది కాబట్టి మీరు ప్రస్తావించిన పేస్టులు, జెల్‌లను అర్ధ ఘనపదార్థాలు (Semi solids) లేదా ఘన ద్రవాలు అంటారు. వీటినే కొల్లాయిడ్లు అంటారు. ఇందులో ద్రవం తక్కువగాను, ఘన పదార్థం ఎక్కువగాను ఉంటుంది. సాధారణంగా ద్రవ పదార్థం లోపల ఘన పదార్థాలు కరిగి ఉంటాయి. అందుకు విరుద్ధంగా జెల్‌లలో ఘన పదార్థాలలో ద్రవ పదార్థాలు కరిగి ఉంటాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ===================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, April 01, 2015

Why poison in some?-జీవుల్లో విషమేల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: పాములతోపాటు మరికొన్ని జీవులకు కూడా విషం ఉంటుంది. ఎందువల్ల?
జవాబు: సుమతీ శతకంలో తేలు, పాములకు మాత్రమే విషమున్నట్లు ఉన్నా, మన జంతు ప్రపంచంలో చాలా జీవులకు విషం ఉంటుంది. కొన్ని వృక్ష జాతుల్లోనూ విషం ఉంటుంది. ప్రతీ జీవికి ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటుంది. కొన్నింటికి కొమ్ములు, శరీరంపై ముళ్లు, పదునైన పళ్లు ఉంటే కొన్ని జీవుల శరీరాల్లో విషం ఉంటుంది. విషపు జంతువులు పనిగట్టుకుని ఎవరికీ హానీ చేయవు. ఆహార సముపార్జనకోసమో, లేదా ఎవరైనా హానీ తలపెట్టినపుడో విష జంతువులు తమను తాము రక్షించుకోవడానికి కుట్టడమో, కరవడమో చేస్తాయి.
పాములతోపాటు కొన్ని రకాలైన సముద్రపు నక్షత్రపు చేపలు, ఆక్టోపస్‌లు, చేపలు, కీటకాలు, సాలెపురుగులు, చీమలు, బల్లులు, గబ్బిలాలు కరిస్తే విషం సోకే ప్రమాదం ఉంది.
విషం కూడా ఓ విధమైన ప్రోటీనన్నమాట గుర్తుపెట్టుకోవాలి. కానీ అది మన శరీరంలో అవాంఛనీయ చర్యలతో కీడు కలిగిస్తుంది.


- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,- శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What about bubble in water?-నీటిలో బుడగల సంగతేమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 
  •  


  •  
ప్రశ్న: నీటిలో చిన్నచిన్న బుడగలు కలిసి ఒక పెద్ద బుడగగా ఏర్పడతాయి. బుడగల మధ్య దూరం తగ్గే కొద్దీ వాటివేగం ఎక్కువవుతుంది. ఎందుకు?


జవాబు: నీటి ఉపరితలంపై గాలి బుడగలు లేక సబ్బునీటి బుడగలు ఒకదానికొకటి ఢీకొంటాయి. ఇలా నీటి కణాల మధ్య ఉత్పన్నమయ్యే ఆకర్షణకు కారణం తలతన్యత అనే భౌతిక ధర్మం. దీని ప్రకారం ద్రవాల ఉపరితలం స్థితిస్థాపకత కలిగి ఒక సాగదీసిన పొరలాగా ఉండి, అతి తక్కువ ఉపరితల వైశాల్యం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఈ ధర్మమే నీటిలో విడివిడిగా ఏర్పడిన చిన్నచిన్న బుడగలను ఒక పెద్ద బుడగగా ఏర్పరుస్తుంది.
ఇచ్చిన ఘన పరిమాణానికి ఏర్పడే ఆకారంలో గోళానికి అతి తక్కువ ఉపరితల వైశాల్యం ఉంటుంది. కాబట్టి తలతన్యత వల్ల కలిసిపోయిన చిన్న బుడగలు ఒక పెద్ద బుడగగా ఏర్పడుతాయి. చిన్న బుడగల మధ్య దూరం తగ్గేకొద్దీ వాటి వేగం ఎక్కువవడానికి, అలా ఏర్పడిన పెద్ద బుడగలు పాత్ర గోడల వైపు వేగంగా పోవడానికి కారణం కూడా ఈ తలతన్యత వలన ఉత్పన్నమయ్యే బలమే.

ఈ ప్రక్రియ మూలాన్నే 10 నుంచి 15 మీటర్ల ఎత్తుండే చెట్లు కూడా భూమి లోపలి నీటిని తమ వేళ్లలో నుంచి వాటి కాండాల్లోని గుజ్జులో ఉండే అతి సూక్ష్మమైన మార్గాల ద్వారా పీల్చుకోగలుగుతున్నాయి.
  • ఆర్‌. రమేష్‌, విజయనగరం
  • ==================
visit My website > Dr.Seshagirirao - MBBS.-