Saturday, December 21, 2013

Parvas in Mhabharatam,మహాభారతం లో పర్వాలు

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మహాభారతం లో పర్వాలు ఎన్ని అవి ఏవి ? (సుందరరావు పట్నాయిక్ - శ్రీకాకులం టౌన్‌)
జ : మహాభారత కథ ని శౌనకాది మునులకి సత్రయాగం చేస్తుండగా అక్కడికి వచ్చిన రోణమహర్షి కుమారుడున్ను, మంచి కథకుడున్ను అయిన ఉగ్రశ్రవుడు వినిపించాడు. ఉగ్రశ్రవుడు మంచి పురాణ కథకుడు కాబట్టి ఏదైనా మంచి ఇతిహాసం చెప్పమంటే మహాభారతం చెప్పాడు.

ఈ మహాభరతంన్ని .............
ధర్మశాస్త్రం తెలిసినవారు ధర్మశాస్త్రం అనిన్ని,
నీతి విషయాలలో నేర్పు కలిగినవారు నీతిశాస్త్రం అనిన్ని,
పరమాత్మా, జీవాత్మ తారతమ్యం తెలిసిన వారు వేదాంత శాస్త్రం అనిన్ని,
కవిశ్రేష్టులు గొప్ప కావ్యం అనిన్ని, పూర్వ కథలు తెలిసిన వారు ఇతిహాసం అని ప్రశంసించారు.

ఇందులో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి!
1. ఆదిపర్వం,
2. సభాపర్వం,
3. అరణ్యపర్వం,
4. విరాట పర్వం,
5. ఉద్యోగపర్వం
6. భీష్మపర్వం,
7. ద్రోణ పర్వం,
8. కర్ణపర్వం,
9. శల్యపర్వం
10. సౌత్పిక పర్వం,
11. స్త్రీపర్వం,
12. శాంతిపర్వం,
13. ఆనుశాసానిక పర్వం,
14, అశ్వమేధపర్వం,
15. ఆశ్రమవాస పర్వం,
16. మౌసల పర్వం,
17. మహాప్రస్థానిక పర్వం,
18. స్వర్గారోహణ పర్వం..
ఇవి కాక సంస్కృత భారతంలో హరివంశ పర్వం, భవిష్య పర్వం వున్నాయి కాని నన్నయ్య గారు ఆ రెంటిని ఆంద్ర మహాభారతంలో చేర్చలేదు. నన్నయ్య కొనసాగించిన ఆచారాన్నే తిక్కన్న , ఎర్రన్న కొనసాగించారు.. ఐతే ఎర్రన హరివంశ పర్వంలోనే భవిష్య పురాణం చేర్చి హరివంశం పేరుతొ ప్రత్యేకంగా గ్రంధం రచించాడు.

మహాభారతం లో మొత్తం 18 పర్వాలు  కలిపి ఉపపర్వాలతో మొత్తం 100 పర్వాలు ఉన్నాయి.. ఆంద్ర మహాహరతంలో మొత్తం 63 అశ్వాసాలు ఉన్నాయి. ఇందులో (తెలుగులో)21,507 పదగధ్యాలు , సంస్కృతంలో 1,00,500 శ్లోకాలతో మహాభారతం రచించారు.

Courtesy with : http://mahabharatamblog.blogspot.in/Sri Krishna.

  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, December 07, 2013

Is Sun mass decreasing?,సూర్యుని ద్రవ్యరాశి తగ్గుతుందా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: సూర్యుడు కాలం గడిచే కొలదీ తనలోని ద్రవ్యరాశిని కోల్పోతున్నాడా?

జవాబు: ప్రతి సెకనుకు సూర్యునిలో 700 మిలియన్‌ టన్నుల హైడ్రోజన్‌ రూపాంతరం చెంది హీలియంగా మారుతుంటుంది. దాని వల్లే సూర్యుడు కాంతి, ఉష్ణాలను వెదజల్లుతున్నాడు. దాంతో కాలం గడిచే కొలదీ సూర్యుని ద్రవ్యరాశి తగ్గి తేలికవుతున్నాడు. సూర్యుని అంతరాళాల్లో జరుగుతున్న కేంద్రక సంయోగ చర్య వల్ల నాలుగు హైడ్రోజన్‌ పరమాణువులు ఒక హీలియం పరమాణుగా మారుతుంటాయి. ఒక హీలియం పరమాణువు ద్రవ్యరాశి, నాలుగు హైడ్రోజన్‌ పరమాణువుల ద్రవ్యరాశి కన్నా తక్కువ. అంటే హైడ్రోజన్‌ పరమాణువులు కోల్పోయే ద్రవ్యరాశి, శక్తిగా మారుతుందన్నమాట. ఇలా ద్రవ్యం, శక్తిగా మారడాన్ని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ రూపొందించిన E= mc2 ద్వారా లెక్కకట్టవచ్చు. ఇక్కడ m కోల్పోయిన ద్రవ్యరాశి అయితే, c శూన్యంలో కాంతివేగం. ఈ విధంగా ప్రతి సెకనుకు సూర్యుడు ఐదు మిలియన్‌ టన్నుల బరువు తగ్గిపోతున్నాడు. ఇది మనకు పెద్ద పరిమాణంగా అనిపించినా, సూర్యుని జీవితకాలంతో పోలిస్తే ఇది దాని ద్రవ్యరాశిలో 0.01 శాతం మాత్రమే!

- ప్రొ|| ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్‌
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How Snakes and cockroaches protect Environment?,పాములు.బొద్దింకలు పర్యావరణానికి ఏవిధంగా దోహదకారులవుతున్నాయి?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: పాములు, బొద్దింకలు ప్రకృతిలో పర్యావరణానికి ఏ విధంగా దోహదకారులవుతున్నాయి?

జవాబు: ఈ విశాల విశ్వంలో మనకు తెలిసినంతవరకు భూమి తర్వాత మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు కానరాలేదు. భూమ్మీద జీవం ఆవిర్భవించి సుమారు 400 కోట్ల సంవత్సరాలైంది. ఎన్నో లక్షల రకాల వృక్ష జాతులు, వేలాదిగా జంతుజాతులు ఈ భూమ్మీద పరిణామం చెంది పర్యావరణానికి అనుకూలంగా ప్రకృతివరణం (Natural selection) ప్రకారం జీవనం సాగిస్తున్నాయి. పరస్పరం సహకరించుకుంటూ, ఘర్షించుకుంటూ, సహజీవనం సాగిస్తూ జీవావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని సమతుల్యం చేయగలుగుతున్నాయి. ప్రకృతినెదిరించే సామర్థ్యం జంతువులకు, వృక్షాలకు లేదు. కానీ మానవుడికున్న తెలివి, అవసరాల కారణంగా ప్రకృతిని ఎదురించి, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఫలితంగా జీవ వైవిధ్యంలో తేడాలు సంభవిస్తున్నాయి. విపరీతమైన పట్టణీకరణ, జల ప్రణాళికల వల్ల ఎలుకలు, కప్పలు, పాములు, బొద్దింకలు పిచ్చుకలు, గాడిదలు, నక్కలు, రాబందులు, పులులవంటి పలు జంతువుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. బొద్దింకలు పలు రకాల మురికి పదార్థాలు తినికూడా బతుకుతాయి. ఒక అంచనా ప్రకారం అత్యంత స్వల్పంగా పరిణామం చెందిన అతి పురాతన జీవి బొద్దింక. ఎందుకంటే దాని జీవన విధానం ప్రకృతి ఆటుపోట్లను తట్టుకోగలగడమే కారణమంటున్నారు. పంటల్ని, ధాన్యాన్ని తినే ఎలుకల్ని భక్షించేవే పాములు. పాముల్లో ఎన్నో రకాలున్నా నేలమీద సంచరించే పాముల్లో మూడు మాత్రమే విషసర్పాలు. కానీ మనం అన్నింటినీ భయంతో చంపుతున్నాం. కానీ పాములు, బొద్దింకలు కూడా ప్రకృతికి అవసరమే.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  •  ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is Low pressure and Storm.How they form?,అల్పపీడనం.హరికేన్‌ అంటే ఏమిటి? ఎలా ఏర్పడుతుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



 ప్రశ్న: అల్పపీడనం అంటే ఏమిటి? హరికేన్‌ ఎలా ఏర్పడుతుంది?

జవాబు : గాలులు ఎక్కువగా గుమిగూడి ఉండే చోట అధిక పీడనం ఉంటుందనీ, పల్చగా ఉంటే ఆ ప్రాంతంలో అల్పపీడనమనీ అనుకోవచ్చు. గాలులు నిరంతరం తిరుగుతుండడం వల్ల ఇలా పీడనాల్లో వ్యత్యాసాలు వాతావరణంలో నిరంతరం ఏర్పడుతూనే ఉంటాయి. వేడిగాలులు పైకి లేచిన చోట అల్పపీడనం ఏర్పడితే, ఆ ప్రదేశంలోకి చల్లని గాలులు వేగంగా వచ్చి చేరుతాయి. ఈ గాలుల ఒరవడిలో ఒకోసారి సుడులు ఏర్పడతాయి. ఈ సుడుల వల్ల గాలుల పరిభ్రమణ వేగం ఎక్కువై, పెద్ద పరిమాణంలో గాలులు పోగవడం, పైకి వెళ్లే గాలులు ఎక్కువగా చల్లబడి పెద్దపెద్ద మేఘాలుగా ఏర్పడడం జరుగుతుంది. అందువల్లనే అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తాయి.

అల్పపీడనం ఏర్పడ్డ ప్రాంతాల్లో గాలుల ప్రభావం ఎక్కువైతే, దాన్ని వాయుగుండం అంటారు. అది కూడా బలపడితే తుపాను ఏర్పడుతుంది. అల్పపీడనాలు భూమ్మీద కూడా ఏర్పడవచ్చు. కానీ తుపానులు మాత్రం సముద్రంలోనే ఏర్పడతాయి. ఎందుకంటే అక్కడ గాలులకు కొండలు, భవనాలు వంటి అవరోధాలు ఉండవు కదా! అడ్డూ అదుపు లేని గాలులు అక్కడ సుడులు తిరుగుతూ కేంద్రీకృతమైపోతూ పెద్దవిగా మారిపోతాయి. మామూలుగా సూర్యుని కాంతితో సముద్రపు ఉపరితలాలు వేడెక్కడం వల్ల అక్కడ దాదాపు పదికిలోమీటర్ల ఎత్తు వరకు నీటి ఆవిరి పొరలుగా పేర్కొని ఉంటుంది. అల్పపీడనాలు ఏర్పడినపుడు ఈ నీటి ఆవిరి అంతా దానిచుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఈ పరిణామం బాగా బలపడితే అదే హరికేన్‌ అన్నమాట. హరికేన్‌ ఏర్పడినచోట ఒక్కోసారి సముద్రంలోని నీరు ఎవరో స్ట్రాపెట్టి పీల్చినట్టు పైకిలేస్తుంది. అలా లేచిన అల పెద్ద నీటి గొడుగులాగా 24 అడుగుల ఎత్తు వరకు కూడా లేచి వేగంగా ప్రయాణించి తీరాన్ని ముంచెత్తే అవకాశం ఉంటుంది. దీన్నే ఉప్పెన అంటారు.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • =======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do animals have horns and how they formed?,జంతువులకు కొమ్ములుంటాయెందికు ? అవిఎలా ఏర్పడతాయి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : జంతువులకు కొమ్ములుంటాయెందికు ? అవిఎలా ఏర్పడతాయి?

జ : నాలుగు కాళ్ళ మీద నడిచే ఎద్దులు , గేదెలు , జింకలు వంటివాటన్నింటికీ కొమ్ములు ఉంటాయి . నిర్మాణపరంగా తేడాలు ఉన్నప్పటికీ కొమ్ములు రక్షణ కోసం నిర్దేశించినవి . ఎద్దులు , గేదెలు కొమ్ములు మార్పు చెందిన రోమాలు . అవి బలమైనవిగా రూపొందాయి. లోపల గుల్లగా ఉన్నా గట్టిగా ఉండి మొనతేలివున్నందున రక్షించుకునేసమయములో దాడిచేసేందుకు పనికివస్తాయి.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, December 06, 2013

How much is true gold in purchased ornaments, కొన్న బంగారం లో అసలెంత కొసరెంత?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : మనము కొన్న బంగారం లో అసలెంత కొసరెంత?.
జ : మనము కొన్న బంగారు ఆభరణాలలో తులం బరువుగల ఏ ఆబరణము లోనూ స్వచ్చమైన 24 కారెట్ల (karats) బంగారము తులం ఉండదు .. .. .. ఎందుకంటే పూర్తి స్వచ్చమైన బంగారం తో ఆభరణాన్ని తయారుచేయరు . అలా చేస్తే ఆ నగలు ధరించడానికి అనువుగా ఉండవు . అందుకే స్వచ్చమైన బంగారముతో ఎతర లోహాల్ని మిశ్రమం చేస్తారు. దాంతో ఆభరణానికి గట్టిదనం వస్తుంది. మిశ్రమం చేసే లోహాన్ని బట్టి రంగూ మారుతుంది. ఇతర లోహాల్ని కలిపి ఆబరణం చేయడం వరకూ ఓకె ... కాని ఇతర లోహాలను ఎంత శాతం కలుపుతున్నారన్నదె చాలా ముఖ్యము.

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారాన్ని " ట్రాయ్ ఔన్స్ " లలో తూస్తారు . ఔన్స్ బంగారము అంటే సరిగా 31.1034768 గ్రాములు. కొంచెం క్లుప్తం గా 31.103 గ్రాములు . భారతదేశములో బంగారాన్ని తులాలలో తూచడం ఆనవాయితీ . తులం అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. తులం బంగారమంటే  11.664 గ్రాములు. ఈ తులాలు బదులుగా ఇప్పుడు మెట్రిక్ కొలమానము '' గ్రాములు'' లో వాడకం అలవాటైనది.

బంగారం స్వచ్చత .. అంటే ఫైన్నెస్ (finess) కారట్ల (karats)పేరుతో తెలయజేస్తారు. విలువైన రాళ్ళ బరువును carat రూపం లో తూస్తారు. బంగారం స్వచ్చతను karat రూపం లో పేర్కొంటారు. ఈ రెండూ ఒకేలా ఉన్నా వాటి విలువలు వేరు. 24 కారట్ల బంగారం అంటే నూటికి నూరు శాతము సంపూర్ణ స్వచ్చమైనది.



కారట్
ఫైన్ నెస్
బంగారం %
24
1000
100
22
916. 7
91. 67
18
750
75
14
583. 3
58. 3
10
416. 7
41. 67
9
375
37. 5

  •  
  •  =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, December 03, 2013

Touch of inverter battary poles no shock why?,ఇన్వర్టర్‌ బ్యాటరీ ధ్రువాలను పట్టుకుంటే షాక్‌ కొట్టదు ఎందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: మామూలు కరెంటు వైర్లను పట్టుకుంటే షాక్‌ కొడుతుంది. కానీ అదే కరెంటును ఇచ్చే ఇన్వర్టర్‌ బ్యాటరీ ధ్రువాలను పట్టుకుంటే షాక్‌ కొట్టదు ఎందుకు.

జవాబు: విద్యుత్‌ వల్ల మనకు షాక్‌ కొడుతుందా? లేదా అన్న విషయం విద్యుత్‌ ప్రవాహం మీద కన్నా, విద్యుత్‌ పొటన్షియల్‌ మీద ఆధారపడుతుంది. ఆ పొటన్షియల్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదం. సాధారణ ప్రమాదస్థాయిలో పొటన్షియల్‌ ఉన్నా, డి.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలకన్నా అదే పొటన్షియల్‌ ఉన్న ఎ.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలు మరింత ఎక్కువ ప్రమాదం. మామూలు ఇన్వర్టర్‌ బ్యాటరీలో (+) గుర్తుకు (-) గుర్తుకు మధ్య పన్నెండు వోల్టుల డి.సి. కరెంటు తరహా విద్యుత్‌ పొటన్షియల్‌ భేదం ఉంటుంది. అటువంటి ధ్రువాలను కుడి, ఎడమ చేతులతో పట్టుకుంటే ప్రమాదం ఉండదు. చాలా మంద్ర స్థాయిలో విద్యుత్‌ మన శరీరం గుండా ప్రయాణించినా అది హానికర స్థాయిలో ఉండదు. అదే డి.సి. బ్యాటరీ కరెంటును ఇన్వర్టర్‌ ద్వారా ఎ.సి. విద్యుత్తుగా 230 వోల్టులకు మారుస్తారు. అలాంటి స్థితిలో న్యూట్రల్‌ (N)ధ్రువాన్ని, లైన్‌ (L)ధ్రువాన్ని వేర్వేరు చేతులతో పట్టుకుంటే మన శరీరంలోని జీవభౌతికరసాయనిక చర్యలు(bio physical and bio chemical actions)తాత్కాలికంగా స్తంభిస్తాయి. ఇలాంటి చర్య ఓసారి గుండెను, మెదడును అచేతనం చేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Birds can not slip grip while sliiping How?,నిద్రలోపక్షులు పట్టుజారవేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చెట్ల మీద ఉండే పక్షులు రాత్రిపూట కింద పడకుండా ఎలా నిద్ర పోగలుగుతాయి?

జవాబు: అన్ని ప్రాణుల్లాగే పక్షులకు నిద్ర అవసరమే. ఆహారం తీసుకున్న తర్వాత, రాత్రిపూట తమ స్థావరాల్లో పక్షులు నిద్రపోతాయి. గూళ్లు కట్టుకుని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే, మరికొన్ని చెట్ల కొమ్మలమీదే నిలబడి నిద్రిస్తాయి. ఒక్కోసారి ఒంటికాలిమీద నిలబడి ఏమాత్రం కిందపడకుండా ఉంటాయి కూడా. పక్షుల కాళ్లలో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కిందపడకుండా కాపాడుతుంది. పక్షుల కాళ్లలో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలుంటాయి. ఇవి పక్షుల కాళ్లలో తొడభాగంలోని కండరాలనుంచి మోకాళ్లద్వారా కాలి చివరి వరకు అక్కడి నుంచి మడమచుట్టూ వ్యాపించి కాలివేళ్ల కింద దాకా ఉంటాయి. కొమ్మలపై వాలగానే పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్లపై వంగేట్టు చేస్తుంది. అప్పుడు కాళ్లలోని నరాలు వాటంతటవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్లు ముడుచుకొని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్లని నేరుగా సాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు కిందపడిపోకుండా కొమ్మలపై నిద్రపోగలుగుతాయి. పక్షుల కాలిగోళ్లు కొమ్మలను ఎంత బిగువగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి అక్కడ చనిపోయినా కిందకు వేలాడుతూనే ఉంటాయిగానీ కిందపడిపోవు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, December 01, 2013

Run before Jumping in games Why?,దూరం దూకడానికి ముందు పరుగేల?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న:
లాంగ్‌జంప్‌ చేసే వ్యక్తి ముందుగా కొంత దూరం పరుగెత్తి ఆ తర్వాత దుముకుతాడు ఎందుకు?

జవాబు: దీన్ని తెలుసుకోవాలంటే చలనం, వేగం, బలం గురించి తెలుసుకోవాలి. మనం ఉన్నచోట నుంచే ముందుకు గెంతాలనుకుందాం. అలా చేయాలంటే, మనం మన శక్తిని ఉపయోగించి నేలను కాళ్లతో తాటించాలి. అది చర్య. దానికి ప్రతిచర్యగా భూమి అంతే బలాన్ని మన కాళ్లపై కలిగించడం వల్ల మనం కాస్త ముందుకు దూకగలుగుతాము. అపుడు మనం ఉపయోగించే శక్తి కొంతమేరకే ఉంటుంది కాబట్టి ఒక స్థాయికి మించి దూకలేం. అంతకు మించి దూకాలంటే, మనకు మరింత బలం తోడవ్వాలి. ఈ అదనపుబలం మనకు వేగం వల్లనే లభిస్తుంది.

ఇప్పుడు న్యూటన్‌ చెప్పిన 'ద్రవ్యవేగం' గురించి తెలుసుకుందాం. ఒక కారు గంటకు 50 కిలోమీటర్ల వేగంతోనూ అంతే ద్రవ్యరాశి కలిగిన మరో కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతోనూ వస్తున్నాయనుకొందాం. ఇపుడు మనం వీటిని ఆపాలంటే, ఎక్కువ వేగంతో వస్తున్న కారుపై ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. అలాగే వేర్వేరు ద్రవ్యరాశులున్న లారీ, కారు మనవైపుకు ఒకే వేగంతో వస్తుంటే, ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న లారీని ఆపడానికి ఎక్కువ బలం అవసరమవుతుంది. అంటే ఒక బలాన్ని కొలవాలంటే ద్రవ్యరాశి, వేగం రెండింటి అవసరం ఉందన్నమాట. ఈ రెండింటినీ గుణిస్తే అదే 'ద్రవ్యవేగం' అవుతుందని న్యూటన్‌ చెప్పారు.

దీన్నిబట్టి ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తే దాని ద్రవ్యవేగంలో మార్పు వస్తుందన్నమాట. ఈ సూత్రమే మనకు 'లాంగ్‌జంప్‌'లో కనిపిస్తుంది. వేగంగా పరుగెత్తుకు వచ్చే క్రీడాకారుడు ద్రవ్యవేగంలోని మార్పువల్ల తగినంత బలాన్ని పొంది, అప్పుడు కాళ్లతో భూమిపై ఆ బలాన్ని ప్రయోగిస్తాడు. ఆ చర్యకు ప్రతిచర్యగా లభించే బలంతో ఎక్కువదూరం ముందుకు దూకగలుగుతాడు.

- ప్రొ||ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Do tatoos harm our body?,టాటూస్‌తో హాని కలుగుతుందా?

  •  



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: టాటూస్‌ శరీరంపై వేసుకుంటే ఏ హానీ జరగదా?

జవాబు: సహజరూపమైన శరీరంమీద శాశ్వత ప్రాతిపదికన ఏ పచ్చ పొడిపించుకున్న, ఎలాంటి టాటూస్‌ వేయించుకున్నా ఎంతో కొంత ప్రమాదం ఉండకమానదు. అందుకే పెద్దలు అడుసు తొక్కనేల, కాలు కడుగనేల అన్నారు. కాసేపు పూసుకుని సాయంత్రానికో, మధ్యాహ్నానికో స్నానం చేస్తే శుభ్రమయ్యే విధంగా ఉన్న ప్రమాద రహిత వర్ణాల్ని చర్మం మీద ఎవరికి తోచిన విధంగా వారు బొమ్మల్ని గీయించుకొంటే పెద్దగా ప్రమాదం లేదు. కానీ టాటూస్‌ అలా కాదు. శాశ్వత ప్రాతిపదికన పచ్చబొట్టులాగా కొన్ని రంగుల్ని బొమ్మలుగా సూదుల సాయంతో చర్మంలోకి నింపుతారు. ఈ రంగు ద్రవ్యాలు చాలా మట్టుకు క్యాన్సర్‌ కారక ద్రవ్యాలు. కాబట్టి అక్కడ చర్మ క్యాన్సరు వచ్చే దురవకాశాలు లేకపోలేదు.

చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే వృక్ష సంబంధ కారకాలు ప్రమాద రహితమైనవనీ కేవలం కర్మాగారాల్లో తయారై కృత్రిమ, రసాయనాలు ప్రమాదకరమనీ అంటుంటారు. ఆపేరుతో విచ్చలవిడిగా ఈ మధ్య వృక్షోత్పత్తి (herbel products) మందులంటూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వృక్షాల నుంచి తీసినా, కృత్రిమంగా చేసినా బెంజీన్‌ బెంజీనే. రసాయనిక పదార్థాల ధర్మాలు వాటి మాతృకను బట్టి మారవు. చాలా వృక్షసంబంధ రసాయనాలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do frog jump?,కప్ప గెంతుతుందేం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: అన్ని జీవుల్లా కప్పలు నడవకుండా గెంతులేస్తాయి ఎందుకు?

జవాబు: జంతువులకు వృక్షాలకు ఉన్న అనేక తేడాలలో ప్రధానమైంది జీవులకున్న స్థాన చలనం. కేవలం నడవడం, గెంతడం రెండే జంతువులకున్న స్థాన చలన యంత్రాంగాలు కావు. ఎన్నో రకాల పద్ధతులు జంతువుల్లో ఉన్నాయి. ఒకే జాతిలో కూడా పరిస్థితికి అనుగుణంగా స్థాన చలన పద్ధతిని మార్చుకుంటాయి. పులులు, సింహాలు, కోతులు, పిల్లులు, కుక్కలు మెల్లగా నడిచేప్పుడు ఓ విధమైన పాదగమనం' వేగంగా వెళ్లేప్పుడు మరో విధమైన భంగిమ చూస్తాము. ఆల్చిప్పలు, పక్షులు, చేపలు, కీటకాలు సరీసృపాలైన పాములు, తొండలు, బల్లులు దుముకవు, నడవలేవు. ఆ గమనం వేరు. ఇలా ఎన్నో రకాలైన కదలికల్లో కప్పల కదలిక దుమకడం. వెనక కాళ్లు బలమైనవిగా, ముందు కాళ్లు కాస్త బలహీనంగా ఉన్న జంతువుల్లో ఇలాంటి దూకే విధానం ఉంటుంది. కంగారూలు, చింపాంజీలు, కప్పలు ఈ కోవకు చెందుతాయి.

చతుష్పాద (tetrapod) జీవుల్లో వెనకకాళ్లు దేహానికి దాదాపు సమాంతరంగా ఉంటే, అవి తమ చలనంలో దేహాన్ని బాగా శ్రమకు గురిచేసినట్టవుతుంది. కానీ క్షితిజ సమాంతరంగా ఉన్న దేహానికి దాదాపు నిట్టనిలువుగా కాళ్లుంటే అపుడు కాళ్లను ఒకదాని తర్వాత ఒకటిగా అడుగులు వేసినపుడు దేహంమీద శ్రమ ఏర్పడదు. నడిచే జంతువుల శరీరాకృతి, వెనుకకాళ్ల నిర్మాణం ఆ విధంగా ఉండటం వల్ల నడవడంతోపాటు, పరుగెత్తేపుడు గెంతగలవు. కానీ కప్పల్లో వెనుక కాళ్లు పక్కలకు ఉండటంతోపాటు వాటిపొట్ట కన్నా ఏమంత కిందుగా ఉండవు. కాబట్టి అవి నడిచినట్లయితే పొట్టనేలకు రాసుకుంటూ పోవడం వల్ల గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది. ఇక గెంతడం మినహా మరో దారి లేదు. ఉభయచరాలయిన కప్పలకు తమ స్థావరాలను త్వరితంగా మార్చుకోవడానికీ, తమ భక్షకులు అయిన పాములు, గద్దలు వంటివాటి బారిన పడకుండా తప్పించుకోవడానికి గెంతే పద్ధతి సహకరిస్తోంది కూడా.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-