Wednesday, November 27, 2013

How dis Mandoari get that name?,మండోదరికి ఆపేరు ఎలా వచ్చింది ?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మండోదరికి ఆపేరు ఎలా వచ్చింది ?

జ:మండోదరి అంటే - కప్ప పొట్ట్ట వంటి  ... పొట్ట కలిగినది అని అర్ధము . కప్ప పొట్టవంటి పొట్టను కలిగి ఉండడము మహారాజ్జీ లక్షణమని సాముద్రికశాస్తములో చెప్పబడినది . తదనుగుణము గానే మండోదరి త్రిలోక విజేత అయిన రావణాసునికి పట్టమహిష అయింది.

మండ + ఉదరి = మండోదరి
మండ=పలుచని,
ఉదరము = పొట్ట ,
పలుచని ఉదరము కలది (మండ=పలుచని). మండోదరి'

మండోదరి' రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు.
  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do say Succking like a leech?,జలగ లా పీల్చడం అని ఎందుకటారు ?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : జలగ లా పీల్చడం అని ఎందుకటారు ?

జ : జలగ లా పీడిస్తున్నాడంటూ దోచుకునే వారిని వర్ణిస్తారు . జలగ మనుషుల , పశువుల రక్తాన్ని ఆహారముగా గ్రహిస్తుంది. ఇందుకోసము వాటి నోటి నిర్మాణముతో పాటుగా లోపల జీర్ణవ్యవస్థలో పది జతల సంచుల వంటి నిర్మాణాలు ఉంటాయి. రక్తము పీల్చి ముందుగా ఆ సంచులను నింపుకొని ఆ తర్వాత తీరికగా తేలికగా జీర్ణము చేసుకుంటుంది .

రక్తము పీల్చేటప్పుడు బాధ తెలియ కుండా ఉండేందుకు ఒక రసాయనాన్ని ప్రయోగిస్తుంది. ఇలా దొంగ లా రక్తము దోచుకుని సంచులలో నింపుకుంటుంది. ఇతరులను దోచుకునేవారిని చూసినప్పుడు జలగలా పీడిస్తున్నాడని అనడం ఆనవాయితీ అయినది
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, November 20, 2013

How many children to Kunbhakarna?,కుంభకర్ణుడు కి ఎంతమంది పిల్లలు ?.

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : కుంభకర్ణుడు కి ఎంతమంది పిల్లలు ?.

జ : బలిచక్రవర్తి మనుమరాలు , వైరోచనుడనే రాక్షసుని కుమార్తె అయిన " వజ్రజ్వాల " కుంభకర్ణుడి భార్య.  రావణాసురుడే స్వయము గా ఈ వివాహాన్ని జరిపించాడు . కుంభకర్ణుడకు ఇద్దరు కుమారులు - కుంభుడు , నికుంభుడు .
  •  ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, November 19, 2013

Wet clothes on body produce shevering why?,వంటిపై బట్టలు తడిస్తే వణుకెందుకు వస్తుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప : వంటిపై బట్టలు తడిస్తే వణుకెందుకు వస్తుంది?,
జ : వర్షాకాలములో వాననీళ్ళు మీదపడి బట్టలన్నీ తడిసిపోతే శరీరము చల్లబడి వణికిపోవడము అనుభవమే .ఒంటిమీద పడిన నీటిని బట్టలు పీల్చుకుంటే తిరిగి ఆ నీరు ఆవిరయ్యే ప్రయత్నం చేస్తుంది . అలా ఆవిరయ్యేందు అవసరమైన ఉష్ణోగ్రత శరీరము నుండి తీసుకుంటుంది. ఎంత ఎక్కువ బట్టలు తడిస్తే అంత అధికము గా శరీరములోని వేడి బయటకు వెళ్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది . వేడి బయటకు పోవడము మరింతగా పెరిగితే వణుకు వస్తుంది.
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, November 15, 2013

Do fish fly?,చేపలు ఎగురుతాయా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : చేపలు ఎగురుతాయా?
జ : ఎగిరే చేపలు ఉన్నా అవి పక్షిలా ఎగరడము కాదు . చేపలకుండే రెక్కలు కొంచెమే విస్తరించి ఉంటాయి. ఈ తరహా చేపలు తోకతో నీటి మీద కొట్టి గాలిలోకి లేచి రెక్కలుకాని రెక్కలను విప్పి గాలిలో తేలుతూ కొంచము దూరము లో పడతాయి. అలా వరుసగా చేసుకుంటూ పోతాయి. ఇది ఒక రకమైన దూకడము . శత్రువులనుంది రక్షించుకునేందుకు , ఆహారము వేటాడే సమయములో వేగముగా చలించేందుకు ఇలా ఎగురుతాయి.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is jet lag ?,జెట్‌లాగ్ అంటే ఏమిటి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర  : జెట్‌లాగ్ అంటే ఏమిటి?
జ : జెట్‌లాగ్‌.. అంటే సూర్యరశ్మి ఉన్నప్పుడు మెలకువగా వుండి, చీకటిపడ్డాక నిద్రపోవడానికి అనుకూలంగా మన శరీరభాగాలు అమరివుంటాయి.ఈ పరిష్థితి జెట్ విమానాలలో ఒకదేశము నుండి  మరో దే్శము ప్రయాణించేవారు మానసికముగాను ,నిద్రపోయో వేలలోను ఒకవిధమైన అన-అనుకూలత ఎదుర్కొంటారు . దీనినే " జెట్ లాగ్ " అంటారు .జీవుల మెదడులో ఒకరకమైన బయొలాజికల్ క్లాక్ (Biological clock) ఉండి నిద్రను క్రమబద్ధము చేస్తూ ఉంటుంది. ప్రకృతికి విరుద్దంగా రాత్రివేళ మెలుకువగా వుండటం కారణంగా వారి శరీరంలోని వివిధ వ్యవస్థలు ముఖ్యంగా నాడీ వ్యవస్థ పనితీరులో మార్పు వస్తుంది. కృత్రిమమైన వెలుతురులో పనిచేయడం, ఎక్కువ సమయం నిద్రకు దూరంగా ఉండటం కారణంగా వారిలో మైగ్రేన్‌ హెడ్‌ఎక్‌, పారాడైమల్‌ న్యాచురల్‌ సఫిలాంజియా వంచి తలనొప్పులు అతిగా వస్తాయి. నిద్రలేమి, అతినిద్ర వంటి స్లీప్‌ రిలేటెడ్‌ వ్యాధులు వస్తాయి. వీరిలో రక్తప్రసరణ వ్యవస్థలో వచ్చే తేడాల కారణంగా బ్లడ్‌ప్రెషర్‌ పెరుగుతుంది. ఆంగ్జటీ, డిప్రెషన్‌ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఒత్తిడి కారణంగా ఫిట్స్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటిలో పాటు సాప్ట్‌వేర్‌ సంస్థలో పనిచేసే వారిలో స్పాండలైటీస్‌, కంటిసమస్యలు, అసిడిటీ, ఒబేసిటి వంటి సమస్యలు వస్తాయి.

ఈ సృష్టి యావత్తు దినచరులు, నిశాచరులు అని రెండు రకాల ప్రాణులతో నిండి ఉంది. గబ్బిలాలు, గుడ్లగూబలు, అడివి పిల్లులు, పులులు, సింహాలు, నక్కలు, కుక్కలు, వగైరాలన్నీ రాత్రిపూట ఉత్సాహంగా ఉండి పగటి పూట మబ్బుగా మారిపోతాయి. అవి మేల్కొని ఉన్నా చురుకుగా ఉండలేవు. అందుకే వాటిని నిశాచర ప్రాణికోటి అని పెద్దలు పిలిచారు. పురాణాలలోకి వెళితే దయ్యాలు, భూతాలు, రాక్షసులు, ప్రేత, పిశాచ, శాకినీ, ఢాకినీ వగైరాలందరు నిశాచర జాతికి చెందిన వారిగా కనబడతారు. మనుషులలో కూడా చాలా కాలంగా కావలి ఉద్యోగాలలో ఉండే వారు నిశి అంతా మేలుకుని విధులు నిర్వహించేవారు. ఇదే రాత్రి డ్యూటీగా, నైట్‌ డ్యూటీగా, నైట్‌షిఫ్ట్‌గా తరువాతి కాలంలో ప్రసిద్ధికెక్కింది. నైట్‌ షిఫ్ట్‌ వల్ల పగలు రాత్రిగా, రాత్రి పగలుగా మారిపోతుంది. రాత్రి చేసే పనులు పగలు, పగలు చేసే పనులు రాత్రికి మారిపోతాయి. శరీర తత్వం, ఆహార అలవాట్లు వగైరాలు గణనీయంగా మారిపోతాయి.
మనిషి శరీరం రాత్రి మేలుకుని పనిచేయడానికి అనువుగా నిర్మితమైంది కాదు. పరిసరాలు కూడా రాత్రిపూట పడుకోడానికి అనుకూలంగా వుంటాయి. చీకటి, నినశ్శబ్దాలు కళ్ళు, చెవులకు ఇబ్బంది కలిగించక ప్రశాంతత చేకూరుస్తాయి. మనతోబాటు అందరూ పడుకుంటారు గనుక ఇతర శబ్దాలేవీ వుండవు. కానీ పగటిపూట అనేసరికి వెల్తురు, శబ్దకాలుష్యం ప్రధానంగా ఇబ్బందిపెడ్తాయి. పైగా రాత్రిపూట పడుకున్నట్లు పగటిపూట అన్ని గంటలపాటు పడుకోలేరు కొందరు. వ్యక్తిగత, సామాజిక ఇబ్బందులు కొన్ని ఎదురౌతాయి.

ఎప్పుడైనా ఒకరోజో, రెండ్రోజులో పనుల వత్తిడి, అనారోగ్యం, మనసు బాగోకపోవడం లాంటి అనివార్య కారణాలచేత నిద్ర పట్టకపోతే తర్వాతిరోజు మన ముఖాలు లంఖణాలు చేసిన రోగుల్లా వుంటాయి. కళ్ళు లోతుకుపోయి, ముఖం పీక్కుపోయి... నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. మనిషికి తిండితోబాటు నిద్ర చాలా అవసరం. ఇంకా మాట్లాడ్తే తిండి కంటే కూడా నిద్ర మరీ ముఖ్యం. టైముకు తిని టైముకు పడుకుంటే ఆరోగ్యాలు నిక్షేపాల్లా ఉంటాయి. నైట్‌ డ్యూటీ చేసి పగలంతా గొడ్డు నిద్రపోయినా చాలదు. శరీరం రిలాక్స్‌ అయిన అనుభూతి కలుగదు. విదేశాల నుంచి మనదేశానికి తిరిగి వచ్చినప్పుడు రెండ్రోజులపాటు అటు నిద్ర, ఇటు మెలకువ కాని స్థితి..
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is the difference in mental maturity of men vs women?,స్ర్తీ-పురుష మానసిక వికాశములో తేడా ఏమిటి ?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : స్ర్తీ-పురుష మానసిక వికాశములో తేడా ఏమిటి ?.

జ : భౌతికము గా ఒక వయసు వారైనా స్త్రీ , పురుషులలో మానసిక వికాశము భిన్నము గా ఉంటుంది . ఆడవారు మవవారికన్నా తక్కువ వయసులో మానసిక పరిపక్వతకు వస్తారు. సమస్యలను అర్ధము చేసుకోవడము , విశ్లేషించడమే కాదు ... రాబోయే అంశాలను ముందుగానే పసిగట్ట గలిగిన శక్తి మహిళలకు ముందే వస్తుంది.

ఆడవారు 25 ఏళ్ళకు మానసికం గా పరిపక్వతకు వస్తే  పురుషులు 35 వ సంవత్సరము వరకు ఆష్థాయికి  చేరుకోలేరు . ఆ పది సం.లు తేడామానసిక పరిపక్వములో అలాగే నిలిచి ఉంటుంది. శారీరక బలహీనతను అధిగమించేందుకు  మహిళలకు మేధోపరము గా ఆ శక్తి ప్రకృతి ప్రసాధించిందని అనుకోవాలి . పురుషుడు శారీరక బలమును నమ్ముకున్నందున మానసిక పరిపక్వము ఆలస్యమువుతుందేమోనని భావించుకోవాలి,
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, November 14, 2013

Paintings-pictures-dolls inside bottles?,సీసా లోపలికి బొమ్మలు ఎలా వెళ్లాయి?








ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



    అద్భుతమైన కట్టడాలు... అందమైన కళాకృతులు... అబ్బురపరిచే విగ్రహాలు... అన్నీ సీసాల్లోకి దూరిపోయాయి! ఇంతకీ లోపలికి ఎలా వెళ్లాయి? అసలెక్కడున్నాయ్‌?

సీసాల్లోకి దెయ్యాలను రప్పించి మూత పెట్టే మాంత్రికుల కథలు బోలెడు చదివే ఉంటారు. అవన్నీ కల్పితాలు. కానీ నిజంగానే సీసాల్లో భవనాలు, విగ్రహాలు ఇంకా వందలాది కట్టడాలుంటే ఆశ్చర్యమే కదూ! ఇవన్నీ చూడాలంటే థాయ్‌లాండ్‌ వెళ్లాలి.

* పట్టాయా నగరంలో 'బాటిల్‌ ఆర్ట్‌ మ్యూజియం' ఉంది. దీంట్లోకెళితే ఎక్కడ చూసినా సీసాలే కనిపిస్తాయి. ఖాళీవి కావు. వాటిల్లో బోలెడు బొమ్మలు కనువిందు చేస్తాయి.
* ఒకటా రెండా, ఈ మ్యూజియంలో ఏకంగా 300కు పైగా సీసాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఎన్నో భవనాలు, చర్చిలు, ఆలయాలు, అందమైన ఇళ్ల నమూనాలు ఉంటాయి. అవన్నీ సూక్ష్మ రూపంలో అబ్బురపరుస్తాయి.

* సీసా ద్వారం అంత చిన్నగా ఉంది. మరి అంత పెద్ద కళాఖండాలను లోపలికి ఎలా దూర్చారు? అనే అనుమానం తప్పకుండా వచ్చి తీరుతుంది. అందుకే మ్యూజియంలోకి ప్రవేశించగానే మనకో వీడియో చూపిస్తారు. అందులో దీని వ్యవస్థాపకుల వివరాలు, వాళ్లు వీటిని ఎలాచేశారు, సీసాల్లో ఎలా పెట్టారు? అనే వివరాలు చూపిస్తారు.
* ఈ వింత మ్యూజియాన్ని ప్రముఖ డచ్‌ కళాకారుడు పీటర్‌ బెడిలాయిస్‌ 1995లో ప్రారంభించారు. అయితే సీసాల్లో మనకు కనిపించే నిర్మాణాలను చిన్నచిన్న విడిభాగాలుగా బయటే రూపొందిస్తారు. తర్వాత వాటిని జాగ్రత్తగా బాటిళ్లలో అనుకున్న తీరుగా అతికించి అమరుస్తారు. అయితే ఒక్కో బొమ్మను తయారుచేసి, సీసాలో పెట్టడం చిన్న విషయం కాదు. రోజుకు 15 గంటలు పనిచేస్తే నాలుగైదు నెలల సమయం పడుతుందని అంచనా! పీటర్‌ కొందరు తన శిష్యులతో కలిసి ఇవన్నీ చేశాడు.

* విశాలమైన భవనంలో ఉన్న ఈ మ్యూజియాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఒకదాంట్లోని సీసాల్లో ఆకాశహర్మ్యాల్లాంటి అద్భుత భవనాలు, ఇంకా పేరుపొందిన పర్యాటక కట్టడాలు, దేశదేశాల్లో కనిపించే అందమైన ఇళ్ల నమూనాలు కనిపిస్తాయి. రెండో విభాగంలో కళాకృతులు అంటే నౌకలు, సంగీత పరికరాలు, బొమ్మల్లాంటివి, మూడో దాంట్లో చర్చిలు, ఆలయాలు, బుద్ధుడు, ఇంకా ఎన్నో దేవతా మూర్తుల విగ్రహాల లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి.

* ఇవి చాలా చిన్నగా ఉన్నా ఆకట్టుకునే డిజైన్లు, చెక్కనాలతో కళ్లు తిప్పుకోకుండా చూసేలా చేయడం విశేషం.

source : Hai bujji@Eenadu news paper

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, November 11, 2013

Do Nature has revange?,ప్రకృతికి ప్రతీకారము ఉంటుందా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : ప్రకృతికి ప్రతీకారము ఉంటుందా?

జ : ప్రకృతి ఒక శక్తి స్వరూపము . దానికి ప్రతీకారాలు , కోపతాపాలు , మంచీచెడులు , తనవాళ్ళు -పరాయివాళ్ళు అంటూ ఏమీ ఉండదు . కానీ ప్రకృతికి ఒక ధర్మము(propety) ఉన్నది . లక్షలాది సంవత్సాల పరిణామ క్రమములో పలు ప్రయోగాలు తర్వాత స్థిరపడిన ధర్మమది. ఆ ధర్మానికి ఒక అర్ధముంది. ప్రకృతిలో నివశించే ప్రతీ జీవి ఆ ధర్మానికి లోబడే ప్రవర్తించాలి . అదే " పర్యావరణ పరిరక్షణ , పర్యావరణ సమతుల్యత " కాపాడుట. జీవ పరిణామ క్రమములో ప్రకృతిలో జీవులు విధి విధానాలు లో మార్పులకు అనుగుణము గా ప్రకృతి సమతుల్యత బేలన్స్ చేయడము . ప్రకృతి అంటే ... చెట్టు చేమా, నోరు వాయిలేని జంటువులు మాత్రమేనని ఆ బలహీన జీవాలన్నీ తకోసమే ప్రకృతిలో ఉన్నాయని భావించి మానవుడు  ప్రకృతి ధర్మానికి విరుద్ధముగా ప్రకృతి సంపదను దోపిడీ చేస్తున్నాడు , తన స్వార్ధముకోసం ఎన్నో పాప , అధర్మ , అనైతిక , విధ్వంసక కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు . మనిషి స్వార్ధాన్ని భరించలేని ప్రకృతి తకిగ సమయం చూసి  తన విలయతాండవం , విశ్వరూపం ను  చూపిస్తూ ఎదురుదాడి చేస్తూ ఉన్నది . అందుకు నిదర్శనమే ఈ తూఫాన్లు , జలప్రళయాలు , సునామీలు , వరదలు , అతివృష్టి , అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు . దీనినే మనము ప్రకృతి ప్రతీకారము గా అనుకోవచ్చు .

  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Refrigirator make sound at interval Why?.రిఫ్రిజిరేటర్‌ అప్పుడప్పుడు శబ్దం చేస్తుంటుందెందుకు?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: రిఫ్రిజిరేటర్‌ అప్పుడప్పుడు శబ్దం చేస్తుంటుంది. ఎందుకు?

జవాబు: రిఫ్రిజిరేటర్‌ ఒక నియమిత, కాలపరిధిలో శబ్దం చేస్తుంటుంది. దీనికి కారణం ఫ్రిజ్‌కు అమర్చిన కంప్రెసర్‌ తరచూ స్విచాన్‌, స్విచాఫ్‌ కావడమే. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రతను కొలిచి నియంత్రించే థర్మోస్టార్ట్‌ అనే మరో భాగంతో కంప్రెసర్‌ అనుసంధానమై ఉంటుంది. ఫ్రిజ్‌ లోపలి భాగం సున్నా డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగానే ఇక చల్లబడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వెంటనే థర్మోస్టార్ట్‌ కంప్రెసర్‌కు ఎలక్ట్రిక్‌ పవర్‌ అందకుండా ఒక సంకేతం పంపుతుంది. దాంతో కంప్రెసర్‌, రిఫ్రిజిరేటర్‌ లోపలి భాగాన్ని చల్లబరిచే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇదంతా విద్యుచ్ఛక్తి వృథా కాకుండా చేసిన ఏర్పాటన్నమాట. తర్వాత ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల నుంచి నెమ్మదిగా పెరుగుతుంది. ఒక నియమిత స్థితికి రాగానే థర్మోస్టార్ట్‌ మళ్లీ సంకేతం పంపడంతో విద్యుత్‌ వలయం పూర్తయ్యి కంప్రెసర్‌ ఆన్‌ అవుతుంది. కంప్రెసర్‌ ఒక యాంత్రిక వ్యవస్థ (mechanical sysytem) కాబట్టి అది ఆన్‌ అయినపుడల్లా శబ్దం వస్తుంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Rain is not falling as continous flow Why?,వర్షం ధారలుగా కురవదేం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: వర్షం ధారల్లాగా కాకుండా నీటి బొట్లుగా ఎందుకు పడుతుంది?

జవాబు : వర్షం ధారలాగా కురవకుండా, బొట్లలాగా, నీటి బిందువులుగా పడడానికి కారణం నీటికున్న తలతన్యత (Surface tension) అనే లక్షణం. ప్రతీ ద్రవం తన ఉపరితల వైశాల్యాన్ని సాధ్యమైనంత తక్కువగా ఉంచుకునేలా ప్రవర్తిస్తుంది. అంటే నిర్ణీత ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం ఉన్న ద్రవ పదార్థానికి అతి కనిష్ట ఉపరితలాన్ని ఇచ్చే జ్యామితీయ నిర్మాణం (Geometry) అంటే గోళాకారమే. ఆకాశంలో చాలా ఎత్తులో ఉన్న మేఘాల నుంచి కురిసే వాన పగిలిన నీటి ట్యాంకునుంచి పడ్డట్టుగా ఉండదు. అంటే నీరు మేఘంలో ఉండదు. కొంచెం కొంచెంగా వాయురూపంలో ఉన్న నీటి ఆవిరి ద్రవీభవించి వర్షంగా కురుస్తుంది. ఆ విధంగా కింద పడుతున్న వర్షపు నీరు తన తలతన్యత లక్షణాన్ని బట్టి బిందు రూపంలోకి చేరుకుంటుంది. ఆ రూపాన్ని చేరుకునేలోగానే వెనక నీరు దాన్ని అంటిపెట్టుకోకపోవడం వల్ల వర్షం చుక్కలుగానే పడుతుంది. మరి కొళాయి నీరెందుకు అలా పడదు? కొళాయి నీరు బిందు రూపంలోకి చేరుకునే లోగానే వెనక నుంచి వేగంగా వచ్చే నీరు కలవడం వల్ల అది ధారగానే పడుతుంది. కొళాయి ప్రవాహం బాగా తగ్గించితే అక్కడా నీటి చుక్కలు బొట్లుగానే కిందికి దూకుతాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, November 09, 2013

What are the situations to tell lies in Hindu Epics?,హిందూ పురాణాలలో అబద్ధమాడినా తప్పులేని సందర్భాలేవి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్ర : హిందూ పురాణాలలో అబద్ధమాడినా తప్పులేని సందర్భాలేవి?

జ : అబద్దాలాడడము దోషముతోనూ , పాపముతోనూ కూడుకున్నదని పురాణాలు లో చిప్పబడిఉన్నది . అబద్దమాడుట అష్టవ్యసనాలలో ఒకటి.  కొన్ని సమయాలలో అబద్దమాడినా దోషము లేదని అవే పురాణాలు చిన్న వెలుసుబాటును కల్పించాయి. మరి కలియుగములో అబద్దమాడనివాడంటూ లేరు ... అసలు అబద్దమాడితేనే జీవితము సుఖముగా గడుస్తుంది .  పురాణాలు లో వెలుసుబాటు ఈ క్రింది వాటికి ఇవ్వడము మనము చదువుతూ ఉంటాం .

  • స్త్రీ-వివాహము ,
  • ప్రాణరక్షణ ,
  • ధనరక్షణ ,
  • మానరక్షణ ,
  • గో-బ్రాహ్మణ సహాయము ,

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, November 07, 2013

People die of thunderbolt How?,పిడుగు పడితే మనుషులు చనిపోతుంటారు ఎలా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: పిడుగు పడితే మనుషులు చనిపోతుంటారు ఎలా ?

జవాబు: పిడుగు పాటుకు మనుషులు చనిపోవడాన్ని, భవనాలు, చెట్లు కూలడాన్ని ఈ మధ్య మనం వార్తల్లో తరచూ వింటున్నాం. అందుకు కారణం పిడుగు పాటులో ఉన్న అత్యధిక విద్యుత్తు పొటెన్షియల్‌ మాత్రమే. పిడుగు అంటే రూపురేఖలున్న వస్తువు కాదు. నిజానికి పిడుగుపాటుకు మరణించేది ఉరుముల సమయంలో కాదు. ఆ పాటికి పూర్తయిన మెరుపుల సమయంలోనే. పిడుగుపాటు అంటే మెరుపులో ఉన్న అత్యధిక విద్యుత్తు ప్రవాహం మనిషి శరీరంగుండా, లేదా భవనాల తడి గోడల గుండా, చెట్లగుండా భూమిని చేరడమే. తద్వారా కలిగే షాక్‌వల్ల మనుషులు మరణిస్తారు. విడుదలయ్యే అధిక వేడివల్ల భవనాలు, చెట్లు కూలిపోతాయిభ్

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Batary poles donot give shock like electricity Why?,కరంటు దృవాలు షాక్ కొట్టినట్లు బేటరీ దృవాలు షాక్ కొట్టవేమి?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: మామూలు కరెంటు వైర్లను పట్టుకుంటే షాక్‌ కొడుతుంది. కానీ అదే కరెంటును ఇచ్చే ఇన్వర్టర్‌ బ్యాటరీ ధ్రువాలను పట్టుకుంటే షాక్‌ కొట్టదు ఎందుకు.

జవాబు: విద్యుత్‌ వల్ల మనకు షాక్‌ కొడుతుందా? లేదా అన్న విషయం విద్యుత్‌ ప్రవాహం మీద కన్నా, విద్యుత్‌ పొటన్షియల్‌ మీద ఆధారపడుతుంది. ఆ పొటన్షియల్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదం. సాధారణ ప్రమాదస్థాయిలో పొటన్షియల్‌ ఉన్నా, డి.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలకన్నా అదే పొటన్షియల్‌ ఉన్న ఎ.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలు మరింత ఎక్కువ ప్రమాదం. మామూలు ఇన్వర్టర్‌ బ్యాటరీలో (+) గుర్తుకు (-) గుర్తుకు మధ్య పన్నెండు వోల్టుల డి.సి. కరెంటు తరహా విద్యుత్‌ పొటన్షియల్‌ భేదం ఉంటుంది. అటువంటి ధ్రువాలను కుడి, ఎడమ చేతులతో పట్టుకుంటే ప్రమాదం ఉండదు. చాలా మంద్ర స్థాయిలో విద్యుత్‌ మన శరీరం గుండా ప్రయాణించినా అది హానికర స్థాయిలో ఉండదు. అదే డి.సి. బ్యాటరీ కరెంటును ఇన్వర్టర్‌ ద్వారా ఎ.సి. విద్యుత్తుగా 230 వోల్టులకు మారుస్తారు. అలాంటి స్థితిలో న్యూట్రల్‌ (N)ధ్రువాన్ని, లైన్‌ (L)ధ్రువాన్ని వేర్వేరు చేతులతో పట్టుకుంటే మన శరీరంలోని జీవభౌతికరసాయనిక చర్యలు(bio physical and bio chemical actions)తాత్కాలికంగా స్తంభిస్తాయి. ఇలాంటి చర్య ఓసారి గుండెను, మెదడును అచేతనం చేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-